AP

వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

కుల, మత, రాజకీయ పార్టీలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..

పెన్షన్లు తొలగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు ప్రచారం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

నందిగామ నగర పంచాయతీ పరిధిలో 4203 మంది లబ్ధిదారులకు వైయస్సార్ పెన్షన్ కానుక ..

నందిగామ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పాల్గొని నూతనంగా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది పెన్షన్ కానుకను పెంచుతూ రూ.2750/- లను ప్రతి లబ్ధిదారుడికి ప్రతి నెల పెన్షన్ రూపంలో అందిస్తున్నారని, వచ్చే ఏడాదికి రూ.3000/- లుగా పెన్షన్ పెంచడం జరుగుతుందన్నారు, గతంలో మాదిరిగా పెన్షన్ కోసం జన్మభూమి కమిటీల ముందు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడే అవసరం లేకుండానే, నేరుగా లబ్ధిదారుడు ఇంటి తలుపు కొట్టి వాలంటీర్ లు ఠంచునుగా పింఛను అందిస్తున్నారని తెలిపారు, తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు మీడియాను అడ్డుపెట్టుకొని పెన్షన్లను తొలగిస్తున్నారని నానా యాగి చేస్తున్నారని, కానీ ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది తప్ప -తగ్గటం లేదని వాస్తవాలను వక్రీకరించే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు, నందిగామలో పట్టణ పరిధిలో 4062 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా, గత నెల డిసెంబర్ నుండి ఈ నెలకు నూతనంగా 141 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు అయిందని, మొత్తంగా నందిగామ నగర పంచాయతీ పరిధిలో 4203 మందికి పెన్షన్ అందజేస్తున్నట్లు చెప్పారు, కేవలం పెన్షన్ మాత్రమే కాకుండా ప్రతి సంక్షేమ పథకం నేరుగా లబ్ధిదారుడికి చేరేలా వారి బ్యాకు ఖాతాల్లోనే డబ్బు జమ అయ్యేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డి.బి.టి విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు , గతంలో సంక్షేమ పథకాలు అందజేయడంలో ఏజెంట్లు, జన్మభూమి కమిటీ సభ్యులు , బ్రోకర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెత్తనం చేస్తుండేవారిని, ఆ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వ వారధిగా వాలంటీర్లను నియమించి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని చెప్పారు, ప్రజల మేలు కోసం మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు ..

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం, ఏఈ ఫణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ లు మాడుగుల నాగరత్నం ,ఓర్సు లక్ష్మి, నాయకులు మహమ్మద్ మస్తాన్ ,మండవ పిచ్చయ్య, గుడివాడ సాంబశివరావు, పాములపాటి రమేష్ ,కౌన్సిల్ సభ్యులు -కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్చార్జిలు పాల్గొన్నారు ..