AP

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో హెల్త్ మేళా

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో హెల్త్ మేళా నిర్వహించారు.
దీనిలో భాగంగా సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశారు.ఈసైకిల్ ర్యాలీకి స్థానిక సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు,జడ్పిటిసి నీరుకొండ రామకుమారి సత్యనారాయణలు జెండా ఊపి ప్రారంభించారు .
ఈ సందర్భంగా వైద్యాధికారి చంద్రకిరణ్ మాట్లాడుతూ ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల బిపి,షుగర్ వంటి పలు రోగాల రాకుండా నివారించుకోవచ్చు అని తెలిపారు.సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ,జడ్పీటీసీ నీరుకొండ మాట్లాడుతూ సైకిల్ తొక్కడంవల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిపారు. మద్యపానం ధూమపానం వంటి మత్తు పదార్థాల దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు దరి చేరకుండా ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం చేయాలని దానివల్ల పలు రకాల వ్యాధులు అరికట్టవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలోపంచాయతీ కార్యదర్శి రాజమరాజు, ఎంపి హెచ్ ఓ భాస్కర్, ఎంఎల్ హెచ్ పి .సౌజన్య, ఏసుబాబు, రాజేంద్రప్రసాద్ తో పాటు ఒకటి రెండు సచివాలయాల ఆరోగ్య సిబ్బంది,ఏ యన్ ఎం , లక్ష్మి నాగమణి ,ప్రశాంతి, దీప్తి పాల్గొన్నారు