AP

సుప్రీం కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై పిటీషన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తు కేసులకు సంబంధించి సుప్రీం కోర్టులో బుధవారం పిటీషన్ దాఖలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా ఈ పిటీషన్ వేశారు.

ఈ కేసుల్లో విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీచేయాలని ఆయన ఈ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

 

“జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ కేసులను సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదావేసింది. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. వందల కొద్దీ డిశ్చార్జి పిటిషన్లు వేశారు. డిశ్చార్జ్ పిటిషన్లతో కేసు విచారణ జాప్యం జరిగే అవకాశం ఉంది” అని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది.