Editor

TELANGANA

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం కేటీఆర్ సర్వే..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వే చేయిస్తున్నామని, ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని బస్తీల్లో వెనుకంజలో ఉన్నామని, అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఉప ఎన్నిక ఉంటుందని చెప్పారు.   మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామని ఆయన…

TELANGANA

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా పై మరోమారు సంచలన వాఖ్యలు..!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరేమి చేసుకుంటారో చేసుకోండంటూ తీవ్రంగా స్పందించారు. తన రాజకీయ వైఖరిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   తనను వరుసగా మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే గెలిపించారని అన్నారు. రాష్ట్రస్థాయి బీజేపీ తనకు ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా…

AP

నాది, పవన్ కల్యాణ్ ఆలోచన ఒక్కటే.. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు..

“మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. దర్జాలు, ఆర్భాటాలు ప్రదర్శించడం కుదరదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అహంకారం, అవినీతి, అలసత్వం వంటివి దరిచేరనివ్వొద్దని గట్టిగా సూచించారు.   బుధవారం అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభలో ఆయన మాట్లాడుతూ, తన ఆలోచన, మిత్రపక్ష…

AP

తురకపాలెం మరణాల కేసులో కీలక మలుపు..! అసలు కారణం అదేనా..?

గుంటూరు జిల్లా తురకపాలెంలో తీవ్ర కలకలం రేపిన వరుస మరణాల కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ విషాద ఘటనలకు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. కలుషితమైన సెలైన్ వాడకం వల్లే ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా మారి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.   గ్రామంలో జ్వరంతో బాధపడిన వారంతా మొదట ఈ ఆర్ఎంపీ వద్దకే వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. వారికి కలుషితమైన సెలైన్లతో పాటు, మోతాదుకు…

National

హింసాత్మకంగా నేపాల్… ఇండియా-నేపాల్ బోర్డర్ లో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం..

పొరుగు దేశమైన నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. అవినీతికి వ్యతిరేకంగా యువత ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త నిరసనలతో నేపాల్ అట్టుడుకుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇండియా-నేపాల్ సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, నేపాల్‌లో నివసిస్తున్న భారత పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది.   నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా, గతంలో విధించిన సోషల్ మీడియా నిషేధానికి నిరసనగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఈ నిరసనలు…

TELANGANA

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విద్యా పథకాలకు కేంద్ర సహకారం కోరుతూ ఆయన రెండు కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.   గత ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో విచక్షణారహితంగా అధిక వడ్డీలకు చేసిన అప్పులు రాష్ట్ర…

TELANGANA

తెలంగాణ గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు .

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షపై సంచలన తీర్పు వెల్లడించింది హైకోర్టు. అభ్యర్థుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, గ్రూప్-1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేసింది. మెయిన్స్ పేపర్లు రీ వాల్యూయేషన్ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో మెయిన్స్ పరీక్షను మరోసారి నిర్వహించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది కోర్టు.   తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ మూల్యాంకనం, ర్యాంకింగ్‌ లిస్ట్‌పై మంగళవారం హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా వెల్లడించిన జనరల్‌ ర్యాంకింగ్‌…

AP

ప్రజలకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..! ఇక నుండి ఇంటి వద్దకే ఆ సేవలు..!

ప్రజలకు శుభవార్త చెప్పనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన చంద్రబాబు సర్కార్, కొత్త ప్లాన్ చేస్తోంది. ఇకపై కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అక్టోబరు 2 నుంచి ఇంటికే వారి కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలను నేరుగా ఇంటికి పంపేందుకు చర్యలు చేపట్టింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.   విద్యార్థులు పాఠశాల మారాలన్నా.. స్కాలర్ షిప్‌లకు…

AP

ప్ర‌భుత్వ ఆఫీసుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటో వ‌ద్దు.. హైకోర్టులో పిల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించడం వివాదంగా మారింది. ఈ అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. చట్టపరమైన అనుమతులు లేకుండా డిప్యూటీ సీఎం చిత్రాన్ని కార్యాలయాల్లో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.   వివరాల్లోకి వెళితే.. వై. కొండలరావు అనే విశ్రాంత రైల్వే ఉద్యోగి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫొటోను పెట్టేందుకు…

Uncategorized

నేడు ఉప రాష్ట్రపతి ఎన్నిక..! సర్వత్రా ఉత్కంఠ. !

ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. సాయంత్ర 6 గంటలకు ఓట్లను లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. అధికార NDA అభ్యుర్థికి సంఖ్యాపరంగా మెరుగైన మెజారిటీ ఉండటంతో.. NDA అభ్యర్థి గెలుపు లాంచప్రాయమేననే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికలో రహస్య ఓటింగ్‌ విధానాన్ని అనుసరిస్తారు. మరోవైపు పార్టీలకు అతీతంగా ఎంపీలు ఓటు వినియోగించుకోవాలని విపక్ష…