తెలంగాణలో ముగిసిన ‘మేయర్’ల ఎన్నిక: 5 చోట్ల కాంగ్రెస్ హవా.. కరీంనగర్లో బీజేపీ, కొత్తగూడెంలో సీపీఐ జయభేరి
తెలంగాణలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది. నిజామాబాద్లో మజ్లిస్ పార్టీ (AIMIM) మద్దతుతో కాంగ్రెస్ పీఠాన్ని దక్కించుకోగా, రామగుండం మరియు మంచిర్యాల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఏ…

