Editor

TELANGANA

వైన్స్, రెస్టారెంట్లు బంద్, 144 సెక్షన్: ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణ వ్యాప్తంగా ఆంక్షలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆదివారం (డిసెంబర్ 3) ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా నగరంలో 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేది ఉదయం 6 గంటల వరకూ మద్యం విక్రయాలు నిలిపివేయాలని, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్‌ హోటళ్లకూ ఈ నిబంధన వర్తిసుందని అధికారులు ఆదేశించారు.   రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ…

AP

ఎన్నికలు, పొత్తుల వేళ పార్టీలో చంద్రబాబు కీలక మార్పులు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. జనసేనతో పొత్తు ఖాయమైన వేళ నియోజకవర్గాల్లో పరిస్థితులపైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీజేపీ తో పొత్తుకు ప్రయత్నిస్తున్న వేళ నిర్ణయం జరిగిన తరువాత సీట్ల పంపకాలు..అభ్యర్దుల ఖరారు పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో పైనా కసరత్తు జరుగుతోంది. జనసేనకు సీట్ల కేటాయింపు పైన ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో నియోజకవర్గ ఇంఛార్జ్ ల మార్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు.   చంద్రబాబు నిర్ణయాలు టీడీపీ అధినేత చంద్రబాబు సైలెంట్‌గా…

CINEMA

స్నేహానికి సాహో అంటూ మాస్ యాక్షన్ తో దంచి కొడుతున్న సలార్..

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ సలార్. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వరుసగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. ఇప్పటివరకు చప్పుడు చేయకుండా ఉన్న చిత్ర బృందం ఫైనల్ గా ఈరోజు ట్రైలర్ ను విడుదల చేసింది. కేజిఎఫ్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు విడుదలైన…

AP

కులం పేరుతో వైసీపీ ట్రాప్.. జనసైనికులకు పవన్ హెచ్చరిక..

ఎలాంటి భావజాలం లేని పార్టీ వైసీపీ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్.. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జనసేన నేతలతో చర్చించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ, టీడీపీ పొత్తును క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. వైసీపీ వాళ్లకు తనను విమర్శించే హక్కులేదన్నారు. కులం పేరుతో వైసీపీ చేసే ట్రాప్ లో కార్యకర్తలు పడొద్దన్నారు.   తానేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తానని…

AP

బెజవాడలో భారీ బైక్‌ ర్యాలీ.. చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ..

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వచ్చారు. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లిన ఆయన.. శ్రీవారి దర్శనం తర్వాత విజయవాడకు వచ్చారు. ఇక్కడ పార్టీ అధినేతకు తెలుగుదేశం శ్రేణులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అడుగడుగునా బాబుకు ఘనస్వాగతం లభించింది.   తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకోగానే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, కొంతమంది సీనియర్‌ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అక్కడి నుంచి…

TELANGANA

సీఆర్ఎఫ్ ఆధీనంలోకి నాగార్జున సాగర్.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల విడుదల విషయంలో నవంబర్ 28న ముందు ఉన్న పరిస్థితి కొనసాగించాలని కేంద్రహోంశాఖ కార్యదర్శి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. డ్యామ్ నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించడంతోపాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్రం ప్రతిపాదించింది.   నాగార్జునసాగర్‌ వివాదంపై కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.…

TELANGANA

ప్రభుత్వ నిధుల మళ్లింపు.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీ కాంగ్రెస్ నేతలు. !

ఎన్నికల అధికారులను తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు కలవనున్నారు. ప్రభుత్వ నిధుల మళ్లింపుపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డ తర్వాత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయాలపై అనుమానాలున్నాయని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక సందేహాలను లేవనెత్తారు.   కమీషన్‌ల కోసం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని.. కేసీఆర్ ఓటమి భయంతో నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను.. ఇతరుల పేర్ల మీదకు మార్చి..…

CINEMA

బాలకృష్ణపై సందీప్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు..

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఫుల్బిజీగా ఉన్నారు. అన్స్టాపబుల్వంటి సెలబ్రిటీ క్రేజీ టాక్షోతో సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ షో ప్రసారమైన తర్వాత శభాష్ అనిపించుకుంది. ఆహా హిస్టరీలోనే అతిపెద్ద విజయవంతమైన షోగా అన్‌స్టాపబుల్ నిలిచింది.   వెండితెర‌తో పాటు అటు బుల్లితెర‌ను కూడా బాలయ్య షేక్ చేసి ప‌డేస్తున్నాడు. వెండితెర‌పై మూడు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టిన బాల‌య్య‌.. ఇటు బుల్లితెర‌పై దుమ్ము…

AP

జనసేన సీట్లు ఫైనల్, 30-2 : పవన్, నాగబాబు స్థానాలు ఖరారు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల పైన ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్న టీడీపీ, జనసేన అధినేతలు ఆ పార్టీ నుంచి స్పష్టత వచ్చిన తరువాత అధికారికంగా సీట్లను ప్రకటించనున్నారు. తాజాగా జనసేన 30 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ సీట్లను ప్రతిపాదించింది. ఈ నెల 2 లేదా 3వ తేదీ చంద్రబాబుతో పవన్ సమావేశం కానున్నారు. ఆ సమయంలో తుది నిర్ణయం తీసుకొనే…

AP

ఉరుసు ఉత్సవాల్లో వైఎస్ జగన్..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలోని అమీన్‌ పీర్‌ దర్గాను సందర్శించారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. ఛాదర్‌ను సమర్పించారు. ఉరుసును పురస్కరించుకుని- కడప పెద్ద దర్గాగా రాయలసీమ వాసులకు చిరపరిచితమైన ఈ ఆధ్యాత్మిక స్థలం సందడిగా మారింది.   కర్నూలు ఓర్వకుల్లు నుంచి ప్రత్యేక విమానంలో జగన్ కడపకు బయలుదేరారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అమీన్‌పీర్‌ దర్గాకు చేరుకున్నారు. దర్గా పీఠాధిపతి ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కాషాయ…