గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖలో రెండ్రోజుల పాటు ప్రచార హంగామా
పెద్దగా తేడాలేం లేవు.! అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎవరు అధికారంలో వున్నా ఇంతే.! గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖలో రెండ్రోజుల పాటు ప్రచార హంగామా నడిచింది. ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు జరిగినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. గతంలో చంద్రబాబు దాదాపు పది లక్షల కోట్లన్నారు. అంతకు ముందూ ఇలాంటివి జరిగాయి. భవిష్యత్తులోనూ జరుగుతాయి. పెట్టుబడిదారుల్ని, పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించేందుకు ఇదొక…

