27న రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు
న్యూఢిల్లీ : పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో ఈ నెల 27న సొమ్ము జమకానుంది. ఫిబ్రవరి 27న కర్ణాటకలోని బెలగావిలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన 13వ కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేస్తారు. అర్హులైన రైతుల ఖాతాలో ఆయన డబ్బులను జమ చేస్తారు. ఈ విడత ద్వారా 9 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.18…

