4news HD TV

CINEMA

సార్ స్పెషల్ షోలు పెంచుతున్నారు

రేపు విడుదల కాబోతున్న సార్ మీద నిన్నా మొన్నటి దాకా అంచనాలు పెద్దగా లేవు కానీ టీమ్ చేస్తున్న తెలివైన ప్లానింగ్ వల్ల మెల్లగా బజ్ పెరుగుతోంది. రిలీజ్ కు ముందు రోజు సాయంత్రం స్పెషల్ ప్రీమియర్లను కేవలం మీడియాకి కాకుండా కామన్ పబ్లిక్ కు వేయాలని నిర్ణయం తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ముందు హైదరాబాద్ ఒకటే చాలనుకున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఇవాళ సాయంత్రం మూడు షోలు పెడితే ఇంకో రోజు మిగిలి ఉండగానే…

CINEMA

ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ త్వరలోనే భారీ స్థాయి యాక్షన్ డ్రామా

ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ త్వరలోనే భారీ స్థాయి యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్నారట. ఈ మూవీ మల్టీ స్టారర్‌గా రూపొందనుందట. ఈ సినిమా కోసం గౌతమ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌తో చర్చలు జరిపారట. ఈ సినిమా కోసం గౌతమ్ ఓ కొత్త ప్రపంచాన్ని రూపొందించనున్నారని సమాచారం.

CINEMA

సీనియర్ హీరోలను రూటు మార్చమంటున్న ట్రెండ్

ట్రెండ్ మారుతోంది. దానికి అనుగుణంగానే దర్శక రచయితలు ప్రేక్షకులను ఎంత వినూత్నంగా ఆకట్టుకోగలమా అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కేవలం సినిమాలతోనే కాకుండా పేరు డబ్బు సంపాదించడానికి ఓటిటి రూపంలో కొత్త మార్గం కనిపెట్టబడి ఉందని గుర్తించి దానికి అనుగుణంగా తమను తాము అప్డేట్ చేసుకుంటున్నారు. హిందీలో మొదలైన వెబ్ సిరీస్ ల ట్రెండ్ క్రమంగా తెలుగుకు పాకుతోంది. కొన్నేళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్ జగపతిబాబు ప్రధాన పాత్రలో గ్యాంగ్ స్టర్స్ తో పేరుతో…

APCINEMANationalTELANGANA

ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం. శతజయంతికి వంద నాణెం

అటు సినిమాలలో, ఇటు రాజకీయాలలో కూడా చెరగని ముద్రవేసిన నటసార్వభౌముడు, సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం లభించనుంది. జూన్ 10వ తేదీన ఆయన శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్‌ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేయబోతోందని ఆయన కుమార్తె, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. రిజర్వ్ బ్యాంకులోని కరెన్సీ, నాణేలని ముద్రించే మింట్ విభాగం అధికారులు ఇటీవల ఆమెని కలిసి నమూనా నాణెం…

AP

తూచ్ ఒకటి కాదు మూడే: సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న బెంగళూరులో పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ, “మూడు రాజధానుల కాన్సెప్ట్ మిస్ కమ్యూనికేషన్ అయ్యింది. ఏపీకి విశాఖ ఒక్కటే రాజధానిగా ఉంటుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్, గుంటూరులో ఓ అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తాము. విశాఖ నుంచే పాలన సాగుతుంది,” అంటూ ఇంతకాలం వైసీపీ మనసులో దాచుకొన్న రహస్యాన్ని బయటపెట్టేశారు. బుగ్గన చేసిన ఈ తాజా ప్రకటనపై రాష్ట్రంలో అప్పుడే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుండటంతో వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్‌…

AP

టిడిపి యువనేత నారా లోకేష్‌ మంగళవారం సత్యవేడు నియోజకవర్గంలో 19వ రోజు యువగళం పాదయాత్ర

టిడిపి యువనేత నారా లోకేష్‌ మంగళవారం సత్యవేడు నియోజకవర్గంలో 19వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు, బీసీ సంక్షేమంపై మంత్రులు చేస్తున్న వాదనలపై ఘాటుగా స్పందించారు. “బీసీ సంక్షేమంపై దమ్ముంటే చర్చకి రావాలని నన్ను పిలిచారు. మీరు సిద్దమైతే నేను సిద్దమే. సభాముఖంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను పాదయాత్రలో ఉన్నాను. ఈ పవిత్రమైన ఈ పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదు. కనుక రాబోయే మూడు రోజులలో నా పాదయాత్ర షెడ్యూల్ మీకు పంపిస్తాను. దారిలో ఎక్కడైనా…

AP

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో హెల్త్ మేళా

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో హెల్త్ మేళా నిర్వహించారు. దీనిలో భాగంగా సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశారు.ఈసైకిల్ ర్యాలీకి స్థానిక సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు,జడ్పిటిసి నీరుకొండ రామకుమారి సత్యనారాయణలు జెండా ఊపి ప్రారంభించారు . ఈ సందర్భంగా వైద్యాధికారి చంద్రకిరణ్ మాట్లాడుతూ ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల బిపి,షుగర్ వంటి పలు రోగాల రాకుండా నివారించుకోవచ్చు అని తెలిపారు.సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ,జడ్పీటీసీ నీరుకొండ…

APTELANGANA

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పాత మార్కెట్ కార్యాలయంలో స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు….. తల సేమియా వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక రోగులు, అత్యవసర సేవల నిమిత్తం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ IAS ప్రారంభించారు….. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి బాపు స్థానిక కౌన్సిలర్లు యువత మంచిర్యాల జిల్లా బ్లెడ్ బ్యాంక్…

National

ఇండియాలో అత్యంత కలుషిత నగరం

గత రెండు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ముంబై (Mumbai ) వాసులు మెరుగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ IQAir (రియల్ టైమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటర్) ప్రకారం.. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరంగా ముంబై జనవరి 29- ఫిబ్రవరి 8 మధ్య జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. వారం రోజుల్లోనే ముంబై రెండో స్థానంలో నిలిచింది. జనవరి 29న IQAir ర్యాంకింగ్‌లో ముంబై 10వ స్థానంలో నిలిచింది. తర్వాత ఫిబ్రవరి…

AP

మహిళల ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తెలుగు క్రికెటర్లు వీరే..!

ఊహించినట్లుగానే మహిళల ఐపీఎల్ వేలంలో పలువురు భారత స్టార్ ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. స్మృతి మందాన, దీప్తి శర్మ, రోడ్రిగ్స్ వంటి వారు జాక్ పాట్ కొట్టారు. వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు (Telugu States cricketers) కూడా మంచి ధర పలికారు. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఏపీ పేసర్‌ అంజలి శర్వాణిని రూ.55 లక్షలకు యూపీ వారియర్స్‌ దక్కించుకుంది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆమెపై యూపీ ఆసక్తి…