4news HD TV

World

జెరూసలేం ఓల్డ్ సిటీ లో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడు విచక్షణ రహితంగా కాల్పులు

జెరూసలేం ఓల్డ్ సిటీ లో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 47 ఏళ్ల ఇజ్రాయెలీ వ్యక్తి, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కారు వెనుక దాక్కుని అక్కడి యూదుల ప్రార్థన స్థలానికి వెళ్తున్న తండ్రీకొడుకులపై ఆ బాలుడు కాల్పులు జరిపాడు. అనంతరం, అక్కడి సాయుధులు ఆ బాలుడిపై కాల్పులు జరపడంతో ఆ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రార్థన స్థలం లో.. మరో ఘటనలో జెరూసలేంలోని ఒక…

CINEMA

ఒక్క మూవీగానే రానున్న నాని దసరా.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న దసరా మూవీ అనౌన్సయిన నాటి నుంచే ఆడియెన్సులో హైప్ చేసింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రం మార్చి 30 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అయితే నాని ఫస్ట్ టైమ్ ఓ పెద్ద సినిమా అయిన ప్యాన్ ఇండియా ప్రాజెక్టులో నటించడం, పీరియాడికల్ మూవీ కావడం,…

National

ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదం

ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో డాక్టర్ వికాస్ హజారా, అతని భార్య డాక్టర్ ప్రేమా హజారా సహా వీరి పనిమనిషి, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మంటల్లో కాలిపోవడం వల్ల కాదు, విషపు పొగలు రావడంతో ఊపిరాడక చనిపోయారు. డాక్టర్ హజారాకు చెందిన రెండు పెంపుడు కుక్కలు కూడా ఊపిరాడక చనిపోయాయి. డాక్టర్ వికాస్ హజారా హాస్పిటల్ వ్యవస్థాపకుడు…

AP

హెల్మెట్ లేకుండా వాహనలు నడుపుతున్నవాహనదారులకు కౌన్సిలింగ్

ఏలూరు జిల్లా, ఏలూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి .ఆదివారపు పేట చిన్న మార్కెట్ సెంటర్ వద్ద హెల్మెట్ లేకుండా వాహనలు నడుపుతున్నవాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి, సరియైన ధ్రువపత్రాలు చూపించని వాహనదారులకు. చలానాలు విధిస్తున్న ఏలూరు రెండవ పట్టణ సిఐ. పీ.చంద్రశేఖర్, ఎస్సై. ప్రసాద్, మరియు సిబ్బంది….

TELANGANA

4 H Dకోటపల్లి మండలం లక్ష్మీపూర్ వద్ద రోడ్ ప్రమాదం…

చెన్నూర్ నుండి సిరొంచ వెళ్తున్న టాటా సుమో వాహనం అదుపు తప్పి బోల్తా పడగా అన్నారం గ్రామనికి చెందిన వాహన డ్రైవర్ తమాటల సమ్మయ్య అక్కడికక్కడేమరణించాడు, ఇద్దరికి గాయాలు కాగా వీరిని వెంటనే వైద్య చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలింపు చేయడం జరిగింది. సంఘటన స్థలాన్ని కోటపల్లి Si వెంకట్ గారు సందర్శించి, ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.

AP

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం. పెద్దశాఖ పంచాయతీ జల గ్రామం

  నాడు నేడు స్కూళ్ల పనులకు సంబంధించి ఒక్క అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి కొన్ని స్కూళ్లలో నాడు నేడు పనులు కోసం ఉపాధ్యాయులే కాంట్రాక్ట్ అవతారం ఎత్తి లక్షల రూపాయలు బిల్లులు సకాలంలో నేటికీ అందకపోవడంతో ఉపాధ్యాయులే ఏమి చేయలేని పరిస్థితిలో చేతులెత్తే పరిస్థితికి దారితీసింది : ఎప్పుడు బిల్లులవుతాయి ఇంకా ఎప్పుడు స్కూలు నేడు నాడు పనులు పూర్తి అవుతాయి అంటూ లబోదిబోమని ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు…

TELANGANA

పక్కనున్న సాధువు నుంచి మైక్ లాక్కున్న సీఎం

వర్షాకాలం బెంగళూరు (bengaluru) నగరం ఎదుర్కొనే సమస్యలు, వాటిని పరిష్కరించే అధికారుల అలసత్వంపై గురువారం బెంగళూరు నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వామి ఈశ్వరానందపురి (Eshwaranandapuri Swami) వివరిస్తుండగా, ఆయన పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై (CM Baswaraj Bommai).. స్వామీజీ నుంచి మైక్ లాక్కుని బెంగళూరు (bengaluru) నగరం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి చెప్పుకొచ్చారు. CM snatches mic from seer: ఫేక్ హామీలిచ్చే సీఎం ను…

APTELANGANA

పాదయాత్ర పూర్తి చేసుకుని ఆసుపత్రికి లోకేష్

నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదటి రోజు పూర్తి అయ్యింది. పాద యాత్ర పూర్తి అయిన వెంటనే పీఈఎస్ ఆసుపత్రికి లోకేష్ వెళ్లారు. అక్కడ ఉదయం గుండె పోటుతో సొమ్మసిల్లి పడిపోయిన తారకతర్న ను లోకేష్ పరామర్శించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు గాను…

National

ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే అందరి ఆశలు

ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే అందరి ఆశలు, కళ్ళు దానిపైనే ఉంటాయి. ఎందుకంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశ బడ్జెట్ ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక ఈ వార్షిక సంవత్సరం ఆదాయపు వ్యయపు పద్దులు ప్రవేశపెట్టడానికి ఆర్ధిక శాఖ మంత్రి సిద్దం అయ్యారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రంగం సిద్దమైపోయింది. దీనితో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సారి బడ్జెట్ లో వందే భారత్ రైళ్లకు పెద్ద ఎత్తున కేటాయింపులు ఉంటాయని తెలియడంతో ప్రజలకు…

TELANGANA

తెలంగాణలో కొలువుల జాతర

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శుక్రవారం (జనవరి 27) ట్వీట్ చేశారు. ఈ ఖాళీ పోస్టులను టీఎస్‌పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిల్లో బీసీ గురుకులాల్లో భర్తీ 1,499 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితోపాటు ప్రిన్సిపాల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, జూనియర్…