4news HD TV

AP

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ- ఏఐటియూసి సంయుక్తంగా నిరసన దీక్ష

  25.01.2023 బుధవారం, ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ- ఏఐటియూసి సంయుక్తంగా నిరసన దీక్ష కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమని, ఈపరిశ్రమను ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ మౌనంగా కూర్చుందని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి…

TELANGANA

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుమలకుంట,రెడ్డిగూడెం పిఎస్134, నందు విద్యార్థులతో ముగ్గులు వేయించి ప్రతిజ్ఞలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుమలకుంట,రెడ్డిగూడెం పిఎస్134, నందు విద్యార్థులతో ముగ్గులు వేయించి ప్రతిజ్ఞలు చేయించి ముగ్గులేసిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్ ప్రైజ్ లు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎల్ఓఎస్ రాము అంగన్వాడి టీచర్ పల్లెల సత్యవతి తిరుమలకుంట పీఎస్ లో బిఎల్వోలు వాణి శ్రీనివాస పంచాయతీ సెక్రెటరీ నాగేశ్వరరావు వీఆర్ఏ రాము స్కూల్ హెచ్ఎం గారు వసంత మేడం మామిళ్లవారిగూడెం జిపిబిఎల్వో బుజ్జి పంచాయతీ సెక్రెటరీ రమేష్…

TELANGANA

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఓటు హక్కు అవసరంపై అవగాహన.

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు రెడ్డిగూడెం పిఎస్134, నందు జాతీయ ఓటర్లు దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.స్కూల్ ప్రధానోపాధ్యాయులు(హెచ్ఎం) వసంత మరియు విఆర్ఏ రాము పాల్గొని ప్రసంగించారు. ప్రతీ ఏడాది జనవరి 25వ తేదీన ఇండియాలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటుంటామని తెలిపారు. ఓటు వేయడానికి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంపొందించడమే జాతీయ…

CINEMA

మంచు ఫ్యామిలీ మీద దారుణమైన కౌంటర్ వేసిన చిరంజీవి.

గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి అస్సలు పడట్లేదు. ముఖ్యంగా మా అసోసియేషన్‌ ఎలక్షన్ల నుంచే ఈ రెండు ఫ్యామిలీల నడుమ దారుణంగా వార్‌ నడుస్తోంది. కాగా అప్పటి నుంచే మంచు ఫ్యామిలీ మీద కూడా దారుణంగా ట్రోల్స్‌ వస్తున్నాయి. ఒక రకంగా ఈ ట్రోల్స్‌కు కారణం మెగా ఫ్యామిలీ అంటూ మంచు ఫ్యామిలీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరు ఇన్‌ డైరెక్టుగా కౌంటర్ వేశాడని అంటున్నారు. తాజాగా ఆయన నటించిన మూవీ…

NationalTELANGANA

బీబీసీ డాక్యుమెంటరీపై రాహుల్ గాంధీ కామెంట్స్

2002 నాటి గుజరాత్ అల్లర్లపై (Gujarat 2002 riots) బీబీసీ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీని షేర్ చేయకూడదని కేంద్రం ట్విటర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా జమ్మూలో…

National

మెరుపుదాడులపై దిగ్విజయ్, జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు

భారత్ జోడో యాత్ర సందర్భంగా సర్టికల్ స్ట్రైక్స్ వ్యవహారాన్ని దిగ్విజయ్ సింగ్ (Jodo Congress) బయటకు తీశారు. ఆ రోజున జరిగిన సర్టికల్ స్ట్రైక్ (Surgical strike)సరే, భారత సైన్యంలోని 19 మంది చనిపోయిన విషయం ఏమిటని ప్రశ్నించారు. అప్పట్లోనూ దిగ్విజయ్ సింగ్ ఇదే వ్యాఖ్యలను చేశారు. ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్యల మీద ఉన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందించారు. భారత జవాన్లను…

NationalTELANGANA

మోడీకి US, UK మద్ధతు,BBC డాక్యుమెంటరీ పక్షపాతమని తేల్చివేత

భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద రెండు సిరీస్ డాక్యుమెంటరీలను (BBC Modi) బీబీసీ ప్రసారం చేసింది. కానీ, ఇండియాలో(India) మాత్రం దాన్ని బ్యాన్ చేస్తూ సోషల్ మీడియా, మీడియా వేదికలపై ఆంక్షలు పెట్టారు. కేంద్రం విధించిన ఆంక్షలతో డాక్యుమెంటరీని భారత ప్రజలు చూడలేకపోయారు. కేరళలోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్ లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి కమ్యూనిస్ట్‌, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగాలు ప్రయత్నం చేశాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రత్యేక స్క్రీన్లతో డాక్యుమెంటరీని ప్లే చేయాలని…

TELANGANA

హైదరాబాద్‌ శివార్లలోని ఓ వైన్‌షాప్‌లో దోపిడీ దొంగలు బీభత్సం

హైదరాబాద్‌ శివార్లలోని ఓ వైన్‌షాప్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఉద్యోగుల నుంచి రూ.2 లక్షలకుపైగా నగదు ఎత్తుకెళ్లేందుకు దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్దమర్రిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దుకాణం మూసి నగదుతో బయటకు వెళ్తుండగా ముగ్గురు ముసుగు ధరించిన వ్యక్తులు క్యాషియర్‌తో పాటు ఇతర ఉద్యోగులపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైన్ షాపు ఉద్యోగులపై దుండగులు…

AP

జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలే చంద్రబాబు విజయానికి మెట్లు

గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాకపోవడానికి కారణాలను టీడీపీ(Jagan-CBN) అన్వేషిస్తోంది. ఇప్పటికీ ఆ పార్టీకి అంతుచిక్కడం లేదు. మెరుగైనా పాలన కోసం జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు(AP Publice) ఓటేశారా? చంద్రబాబు పరిపాలన నచ్చలేదా? అనేది టీడీపీకి బోధపడడంలేదు. ప్రజలు చంద్రబాబును అర్థం చేసుకోలేక పోయారని కొందరు, ప్రస్తుత తరానికి చంద్రబాబు కనెక్ట్ కాలేకపోయారని మరికొందరు చెప్పుకొచ్చారు. తరం గ్యాప్ బాగా దెబ్బతీసిందని కొందరు పలు రకాలు గా ఇప్పటి దాకా అంచనా వేస్తూ…

World

చైనాలో 80 శాతం జనాభాకు కరోనా

చైనాలో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. దేశ జనాభాలో 80 శాతం మంది కరోనా (Corona) బారిన పడ్డారు. గత వారంలో అంటే జనవరి 13- 19 మధ్య కాలంలో దాదాపు 13,000 మంది రోగులు కోవిడ్‌తో (Covid) ఆసుపత్రులలో మరణించారని చైనా తెలిపింది. దీనితో పాటు రాబోయే రోజుల్లో కరోనా వైరస్ మరింత వినాశనం సృష్టించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీరో కోవిడ్ విధానం ముగిసిన తర్వాత కరోనా విజృంభించడంలో అక్కడ…