తెలంగాణకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు
ఇటీవలే సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుండి అనూహ్య రీతిలో ఆదరణ లభిస్తోంది. కాగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాచిగూడ- బెంగళూరు, సికింద్రాబాద్- తిరుపతి, సికింద్రాబాద్-పూణే మధ్య మూడు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మరో మూడు ఇలాంటి రైళ్లను త్వరలో ప్రారంభించాలని భారతీయ రైల్వే యోచిస్తోందని అధికారులు తెలిపారు. అదనపు…

