హైదరాబాద్లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి
హైదరాబాద్లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. చారిత్రాత్మక హుస్సేన్ సాగర్కు ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడైంది. ఈ సాయంత్రం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ దీన్ని ప్రారంభించారు. అదే- లేక్ ఫ్రంట్ పార్క్. మొత్తం 26 కోట్ల రూపాయలతో ఈ పార్క్ను నిర్మించింది హెచ్ఎండీఏ. ఇందులో పార్క్ నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు, సుందరీకరణకు నాలుగు కోట్ల రూపాయలను వ్యయం…