4news HD TV

National

దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం

గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. తెలంగాణలో తగ్గుముఖం పట్టాయని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్‌లో తెలిపింది. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాజ్యసభలో వెల్లడించారు. 2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,673 మంది రైతులు మృత్యువాత పడగా, తెలంగాణలో 1,309 మంది తనువు చాలించినట్టు కేంద్రం పేర్కొంది. దేశంలో అత్యధికంగా రైతులు…

CINEMA

సమంత మీద పగ సాదించడానికే ఆ పని చేస్తున్న naga chaitanya..!!

సమంత-నాగచైతన్య ఎంతో గాఢంగా ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకున్నా వాళ్లని ఒప్పించి మరీ అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయ్యాక నాలుగు సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా చాలా ప్రేమగా ఉండేవారు. అంతేకాదు చాలామంది సినీ సెలబ్రిటీలకు ఈ జంట అంటే కొంచెం అసూయ కూడా ఉండేది. అలా ఉండేది వీరి జంట. ఇక అలాంటి ఈ దంపతులకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియా…

CINEMA

పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న యశ్‌కు.. ఈరోజు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే

కన్నడ స్టార్ యశ్(kannada star yash) గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కన్నడ సినీ పరిశ్రమంలో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగిన యశ్.. ప్రశాంత్‌ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్` సినిమాతో `రాఖి భాయ్` గా ప్రేక్షకుల మనసులో చెదిరిపోని ముద్ర వేసుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న యశ్‌కు.. ఈరోజు…

World

ఇండోనేషియాలో విషాద ఘటన

ఇండోనేషియాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని వెస్ట్ సుమత్ర ఫ్రావిన్స్ లో జరిగింది. మిథేన్ గ్యాస్ లీక్ అవ్వటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పది మంది మృతదేహాలను గుర్తించినట్లు ఓ అధికారి చెప్పారు. మరో నలుగురికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఆ దేశ అధికారులు…

TELANGANA

ఆదిభట్ల కిడ్నాప్ నిందితుల అరెస్ట్…కథ సుఖాంతం.

రంగారెడ్డిజిల్లా ఆదిభట్లలో కలకలం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. యువతిని సేఫ్‌గా రక్షించారు. పదిగంటలకు పైగా యువతి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళనలతో ఆదిభట్ల అట్టుడుకింది. అయితే తాను మన్నెగూడలోనే ఉన్నట్టు బాధిత యువతి తన తండ్రి దామోదర్‌కు ఫోన్‌ చేసి చెప్పడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. లొకేషన్‌ ఆధారంగా స్పాట్‌ చేరుకున్న పోలీసులు బాధిత యువతిని సేఫ్‌గా రక్షించారు. కిడ్నాపర్ నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. యువతి కిడ్నాప్‌ వెనుక ప్రేమ…

National

అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి సీఎం సీటు

అదృష్టమో, ఆనవాయితీయో.. హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ కథ మాత్రం మొదటికే వచ్చింది. సీఎం పదవి కోసం నేతల మధ్య రగడ రాజకుంది. ఓవైపు ఎమ్మెల్యేలు జారిపోతారేమో అనే భయాలు హైకమాండ్‌ను వెంటాతుంటే.. మరోవైపు సిమ్లాలో సీఎం కుర్చీ కోసం లడాయి చెలరేగింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం నేతలు తన్నుకు చస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హిమాచల్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్‌,…

TELANGANA

`తెలంగాణ`(Telangana) పదాన్ని కనిపించకుండా, వినిపించకుండా జెండా,ఎజెండాను కేసీఆర్‌ ఫిక్స్

`తెలంగాణ`(Telangana) పదాన్ని కనిపించకుండా, వినిపించకుండా జెండా,ఎజెండాను కేసీఆర్‌ ఫిక్స్ చేశారు. ఆయన పెట్టుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు బీఆర్ ఎస్ (BRS)ను అధికారికంగా ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (BRS) జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి జెండాలోని తెలంగాణ (Telangana) మ్యాప్ ను తొలగించారు. ఆ స్థానంలో భారత్ చిత్రపటాన్ని ఉంచారు. జై తెలంగాణ బదులుగా జై భరత్ గా నినాదాన్ని పెట్టారు. కానీ, కారు సింబల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తొలి…

SPORTS

ఇండియా ఇంటికొచ్చేయడం గ్యారెంటీ అని కామెంట్లు

టీమిండియా జట్టు పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ ఇంగ్లాండ్ టీంపై ఓడిపోయిన తర్వాత అసలు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. దీంతో క్రికెట్ ప్రేమికుల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరోపక్క మాజీ క్రికెట్ ఆటగాళ్లు టీం మార్చాలని కోరుతున్నారు. సీనియర్లను తప్పించి కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య బంగ్లా టూర్ లో ఆడుతున్న టీమిండియా రెండు వన్డేలలో… పసికూన లాంటి బంగ్లాదేశ్ టీంపై ఓడిపోవడంతో…

CINEMA

puja hedge బాయ్ ఫ్రెండ్ ఇతనే..!!

పూజా హెగ్డే తెలుసు కదా. తెలుగు, తమిళం ఇండస్ట్రీలో తను ఇప్పుడు స్టార్ హీరోయిన్. పొడుగు కాళ్ల సుందరి. తను పొట్టి డ్రెస్ వేస్తే కుర్రాళ్లు తట్టుకోవడం చాలా కష్టం. తన అందం అలా ఉంటుంది మరి. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పూజా హెగ్డే ముంబైలో బిజీ బిజీగా గడుపుతోంది. ఈనేపథ్యంలో ఇద్దరూ కలిసి తెగ తిరిగేస్తున్నారు. అయితే.. వీళ్లిద్దరూ…

AP

జగన్ ని కాపాడబోయే బ్రహ్మాస్త్రం

ఓవైపు ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరోవైపు.. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలపై దూకుడు పెంచాల్సిందే. అలా అయితేనే రెండోసారి అధికారంలోకి రాగలరు. లేదంటే.. కష్టమే. అందులోనూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితమైన వ్యూహాలను రచించాలి కాబట్టి.. సీఎం జగన్ ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ గా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించారో అన్ని సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని…