4news HD TV

TechnologyWorld

పబ్లక్‌ ఆఫర్‌కు కళామందిర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

దుస్తుల రీటైల్‌ వ్యాపారం చేసే సాయి సిల్క్స్ కళామందిర్‌ లిమిటెడ్‌ పబ్లిక్ ఇష్యూకు స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ .1200 కోట్లు సమీకరించాలనేది ఈ సంస్థ భావిస్తోంది. ఇందులో రూ.600 కోట్ల విలువైన కొత్తగా షేర్లు జారీ చేస్తారు. 1.80 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు సంస్థలు ఈ ఆఫర్‌ ద్వారా అమ్ముకుంటాయి. ప్రస్తుతం ఆంధ్ర , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు…

Health

ఈ ఒక్క చిట్కాతో నరాల బలహీనత మాయం..

మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో నరాల బలహీనత సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే చాలా మంది రక్తనాళాలను, నరాలను ఒకటే అని అనుకుంటారు. కానీ రక్తనాళాలు వేరు. నరాలు వేరు. రక్తనాళాల ద్వారా రక్తం అవయవాలకు చేరవేయబడుతుంది. నరాలు సంకేతాలను చేరవేస్తాయి. మెదడు నుండి వచ్చిన సంకేతాలను నరాలు వెన్నుపాము ద్వారా చేతులకు, కాళ్లకు ఇతర అవయవాలకు చేరవేస్తాయి. అలాగే ఇతర అవయవాల నుండి వచ్చిన…

APPOLITICS

ఏపీ సీఎం జగన్ తాను అభివర్ణించే దుష్టచతుష్టయంపై యుద్ధం

ఏపీ సీఎం జగన్ తాను అభివర్ణించే దుష్టచతుష్టయంపై యుద్ధం ప్రకటించినట్టున్నారు.చతుష్టయంలో ఒకరైన రామోజీరావుకు చెందిన మార్గదర్శిపై పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి సంస్థల్లో సోదాలు ప్రారంభించారు. అయితే ఒక్క మార్గదర్శిలోనే కాదు.. చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థల్లో తనిఖీలు చేపడుతున్నామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మార్గదర్శి తప్పించి ఇతర చోట్ల జరుగుతున్న తనిఖీల సమాచారం మాత్రం బయటకు రావడం లేదు. చిట్స్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను ఫిక్స్ డ్…

APPOLITICS

కర్నూలు TDP దూకుడు, NCB జోష్‌!

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. కర్నూలు వెళ్లిన ఆయన 2019 ఎన్నికల్లో ఇచ్చిన హైకోర్టు బెంచ్ హామీని బలంగా వినిపించనున్నారు. మూడు రోజుల ఆయన పర్యటన సందర్భంగా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కే. ఈ. బ్రదర్స్ ను పక్కన పెట్టిన చంద్రబాబు వాళ్ల స్థానాన్ని భర్తీ చేసే నాయకులను తయారు చేశారు. వాళ్లకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా కర్నూలు జిల్లా వ్యాప్తంగా టీడీపీని బలోపేతం…

POLITICSTELANGANA

కేసీఆర్‌ ఈటలతో రహస్య చర్చలు..?

బీజేపీతో ఢీ అంటే ఢీ అని కొట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఎక్కడా తగ్గేదే లే అంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నా.. కమలం నేతలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. త్వరలో కాషాయ దళానికి మరో ఝలక్‌ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. KCR- Etela Rajender ఈటల బహిష్కరణతో టీఆర్‌ఎస్‌కు భారీ నష్టం.. తెలంగాణ ఉద్యమకారుడు, సౌమ్యుడిగా పేరు ఉన్న ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌లో నంబర్‌ 2 గా ఎదిగారు. తన పార్టీలో…

World

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో భారీ భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సుమత్రాకు నైరుతి దిశలో బుధవారం ఈ భూకంపం వచ్చినట్లు తేలింది. రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత 5.5గా నమోదయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం కేంద్రం నుంచి 10 కిమీ (6.2 మైళ్లు) లోతులో ఉందని తెలిపింది. ఆ దేశం బాలిలో G20 నేతల శిఖరాగ్ర సమావేశానికి చివరి రోజు ఆతిథ్యం ఇచ్చింది. ప్రాణ నష్టం, ఆస్తి…

CINEMA

సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి

టాలీవుడ్ లో ఒక తరం ముగిసింది. సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం 4 గంటలకు మరణించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత టాలీవుడ్ ను వదిలి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణకు నివాళులర్పిస్తూ ఎల్లుండి (గురువారం) షూటింగ్స్ బంద్ చేయాలని పిలుపునిచ్చింది. మరోవైపు…

SPORTS

వెస్టిండీస్ క్రికెటర్, ముంబై ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ కిరన్ పోలార్డ్ ఐపీల్‌కు రిటైర్మెంట్

వెస్టిండీస్ క్రికెటర్, ముంబై ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ కిరన్ పోలార్డ్ ఐపీల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫ్రాంచైజీతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. అయితే తాను వేరే టీంలో జాయిన్ అవ్వడం లేదని, ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించాడు. కాగా పోలార్డ్ ముంబైతో గత కొన్ని సీజన్లుగా ఆడుతున్నాడు. 5 ఐపిఎల్ టైటిళ్లను గెలుచుకున్న ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యుడు కీరన్ పొలార్డ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు…

NationalPOLITICSTELANGANA

ఎక్కడైతే కేంద్ర సంస్థలు దాడులు చేస్తాయో అక్కడే ధర్నాలు…..సీఎం కేసీఆర్..

తెలంగాణభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షత టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నకున్నట్లుగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న కేసీఆర్, పార్టీ మారాలని ఒత్తిళ్లు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తన కూతురు ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీ మారాలని అడిగినట్లు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు జరగబోవని తేల్చి చెప్పారు. తన కూతురుని బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారంటూ వ్యాఖ్యానించారు. దీనికంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని…

World

ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడుల హెచ్చరిక

ఉక్రెయిన్ రాజధాని కీవ్ మంగళవారం రెండు భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుళ్ల తర్వాత నగరంలో పొగలు కమ్ముకున్నాయని ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని రాయిటర్స్ ప్రతినిధి తెలిపారు. రాయిటర్స్ ప్రకారం.. ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ బాలిలో సమావేశమవుతున్న గ్రూప్ ఆఫ్ 20 దేశాల నాయకులకు వీడియో ప్రసంగం చేసిన కొన్ని గంటల తర్వాత ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడుల హెచ్చరికలను అనుసరించి పేలుళ్లు సంభవించాయి. ‘#G20 వద్ద @Zelenskiy శక్తివంతమైన ప్రసంగానికి రష్యా కొత్త క్షిపణి దాడితో ప్రతిస్పందించింది.…