4news HD TV

National

భవిష్యత్తులో బయో ఇథనాల్ వాహనాలే.. ఇథనాల్ petrol 60 రూపాయలే..

జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు(Plants) నాటే కార్యక్రమంలో నేడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పాల్గొన్నారు. ఏపీలో తిరుపతి(Tirupati) వద్ద రేణిగుంట నుండి నాయుడుపేట NH71 హైవేపై ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి చొరవతో గ్రీన్ ఇండియా మిషన్ (GIM) భాగస్వామ్యంతో జతకట్టి జాతీయ రహదారులను పర్యావరణపరంగా గ్రీన్ హైవేలుగా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రహదారి ప్రాజెక్టుల సమయంలో నరికివేయబడిన ప్రతి చెట్టుకు రెండింతలు చెట్లను ఈ ప్రాజెక్టులో భాగంగా నాటనున్నారు.…

CINEMA

తొలిసారి పోస్ట్ పెట్టిన పవన్ కల్యాణ్.. జ్ఞాపకాలతో వీడియో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్‍స్టాగ్రామ్‍లో అడుగుపెట్టారు. జూలై 4వ తేదీ ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ క్రియేట్ అయిన గంటల్లోనే మిలియిన్ ఫాలోవర్లు వచ్చారు. ఒక్క పోస్ట్ పెట్టకుండానే పవన్ ఇన్‍స్టా అకౌంట్‍కు ఇప్పటి వరకు 2.4 మిలియన్ ఫాలోవర్లు అయ్యారు. అయితే పవన్ కల్యాణ్ ఎప్పడెప్పుడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ పెడతారా అని అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు అది నెరవేరింది. నేటి (జూలై 15) సాయంత్రం ఆయన ఇన్‍స్టాగ్రామ్‍లో తొలి పోస్ట్…

World

మోడీకి ఫ్రాన్స్ టూర్ లో షాక్ ? మణిపూర్ హింసను ఖండిస్తూ యూరప్ పార్లమెంట్ తీర్మానం

ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో రెండు నెలలుగా సాగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ ఓ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది. దీనిపై భారత్ స్పందించింది. అది తమ అంతర్గత విషయమని ఐరోపా దేశాలకు స్పష్టం చేసింది. అయినా భారత ప్రధాని తమ దేశాల్లో పర్యటిస్తున్న వేళ యూరోపియన్ పార్లమెంట్ వేసిన అడుగు కలకలం రేపింది. ప్రధానమంత్రి నరేంద్ర…

AP

. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆవర్తనం ఉత్తర కోస్తాంధ్ర, దాని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలతోపాటు చిరు జల్లులు పడతాయని పేర్కొంది. మరో రెండు రోజుల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు…

Technology

గ్రౌండ్‌ రిపోర్ట్‌: వెలమకోటలో బీసీల కొట్లాట..

కరీంనగర్‌.. ఉద్యమాల పురిటిగడ్డ. తెలంణలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమం కరీంనగర్‌ నుంచే ఉవ్వెత్తున ఎగిసింది. ఇక తెలంగాణ ఉద్యమసారథి కె.చంద్రశేఖర్‌రావును ఉప ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ వాదాని గట్టిగా వినిపించింది. పోరాటాలు, ఉద్యమాలకు నెలవైన కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 15 ఏళ్లుగా గంగుల కమలాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హ్యాట్రిక్‌ విజయం సాధించిన గంగుల ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన…

National

ఎవరీ సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు. జస్టిస్ ఉజ్వల్ భూయాన్, వెంకటనారాయణ భట్టి..?

సుప్రీంకోర్టు (Supreme Court)లో బుధవారం (జూలై 12) మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ ఉజ్వల్ భుయాన్ (Justice Ujjal Bhuyan), జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్టి (Justice S. Venkatanarayana Bhatti)లకు పదోన్నతి కల్పించాలని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఇద్దరు న్యాయమూర్తుల నియామకాన్ని ప్రకటించారు. జూలై 5న జస్టిస్ ఉజ్వల్ భుయాన్, జస్టిస్ భట్టి పేర్లను కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. గతంలో జస్టిస్…

CINEMA

బ్రో సినిమాపై పవన్ పొలిటికల్ కామెంట్స్ ఎఫెక్ట్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ(Janasena Party)ని గెలిపించాలనే పట్టుదలతో ఉన్న పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. వారాహి యాత్ర ప్రారంభించే ముందు పవన్ కల్యాణ్ కొన్ని సినిమాల్లో నటించారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్. అయితే ఆయన పొలిటికల్ కామెంట్స్.. ప్రభావం సినిమాలపై ఉంటుందని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే బ్రో(Bro), ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు(HariHara Veeramallu) సినిమాల్లో నటించాడు. మరికొద్ది రోజుల్లో బ్రో…

World

మోదీ పర్యటన వేళ- భారతీయులకు శుభవార్త వినిపించిన ఫ్రాన్స్

పారిస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటన ఆరంభమైంది. ఈ మధ్యాహ్నం ఆయన పారిస్‌లో ల్యాండ్ అయ్యారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్నె స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అక్కడే సైనిక వందనాన్ని స్వీకరించారు మోదీ. ప్రవాస భారతీయులు ఆయనను కలుసుకున్నారు. అనంతరం ఫ్రాన్స్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఇండియన్ డయాస్పొరాను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రయాన్ 3 ప్రయోగం సహా అనేక అంశాలను ప్రస్తావించారు.…

AP

టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆసక్తికరచర్చ

వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి విశాఖ వేదికగా పరిపాలన రాజధాని ఉండబోతుందని, త్వరలోనే విశాఖ నుండి పాలన ప్రారంభం అవుతుందని అనేకమార్లు ప్రకటనలు చేశారు. అయితే అది ఈ నాటికీ నెరవేరలేదు. ఇక తాజాగా విశాఖకు సీఎం జగన్ షిఫ్ట్ కాబోతున్నారని, త్వరలోనే పాలన అక్కడ నుండి మొదలవుతుందని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆసక్తికరచర్చ జరుగుతుంది. నేడు టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి…

TELANGANA

అయ్యో చెన్నమనేని.. వేములవాడలో ఇంత పనైందేంటి?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈసారి హ్యాట్రిక్ సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఎంత కష్టమైనప్పటికీ తన సర్వేలో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో బాగానే చాలామందికి ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.. అయితే ముఖ్యమంత్రి సంకేతాలు ఇవ్వడంతో కొంతమంది పార్టీలో ఉండకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా ఎన్నికల మొదట అధికార…