4news HD TV

AP

టీ20, వన్డే సిరీస్ ఆడబోయే టీమిండియాలో అనంతపురం అమ్మాయికి చోటు

భారత మహిళ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోంది. ఆ దేశ జాతీయ జట్టుతో మూడు చొప్పున ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడబోతోంది. భారత్- బంగ్లాదేశ్ మధ్య మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఈ సిరీస్ టీ20 మ్యాచ్‌తో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ నెల 9వ తేదీన ఆరంభమౌతుంది. 22వ తేదీన ముగుస్తుంది. మ్యాచ్‌లన్నింటికీ మిర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పూర్తి…

National

జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల భేటీ-పాత భవనంలో ప్రారంభమై కొత్త భవనంలోకి..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈసారి వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించాల్సిన కీలక బిల్లులపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన కేంద్రం.. ఈ నెల 20న సమావేశాల ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈసారి సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది. పార్లమెంటు పాత భవనంలోనే ప్రారంభం కాబోతున్న ఈ సమావేశాలు మధ్యలో కొత్త భవనానికి మారబోతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల…

AP

వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఏపీ ఆ తర్వాత అధిష్టానం తప్పిదాల కారణంగా ఉనికికే ముప్పు

ఒకప్పుడు వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఏపీ ఆ తర్వాత అధిష్టానం తప్పిదాల కారణంగా ఉనికికే ముప్పు తెచ్చుకుంది. విభజన కారణంగా ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, తెలంగాణలోనూ అధికారం కోసం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీతో ఉనికి చాటుకునేందుకుప్రయత్నిస్తున్న వైఎస్సార్ కూతురు షర్మిలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా గట్టెక్కాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. షర్మిల చేరికకు రంగం కూడా సిద్ధమైనట్లు, ఇందులో భాగంగా వైఎస్ సమాధి ఉన్న…

National

బక్రీద్ నేపథ్యంలో గోహత్య ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్

బెంగళూరు/బాదామి: బక్రీద్ నేపథ్యంలో గోహత్య ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కర్ణాటక నార్త్ జోన్ ఐజీపీ వికాసకుమార్ స్వయంగా పర్యటించి పరిశీలించారు. దీనికి తోడు భారీ పోలీసు బందోబస్తు ఇంకా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటకలోని బాదామి తాలూకా పట్టణానికి చెందిన బాదామి తాలూకకు చెందిన మహ్మద్ అజారుద్దీన్ నబీసాబ హులికేరి, అఖ్తాబ్ నబీసాబ హులికేరి, మహ్మద్ జామీ హుసేనసాబ…

AP

జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. ప్రకటన లాంఛనమే

జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. ప్రకటన లాంఛనమే. భీమవరం సభలోనే తన అభిమానులకు పవన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వారాహి యాత్ర ముగింపు సభలోనే పవన్ తాను చెప్పదలచుకున్నది తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిన పవన్ ఈ సారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని పవన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వే నివేదికలు.. పూర్తి సమాచారంతో పవన్ తన స్థానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.…

CINEMANational

దర్శక ధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం

దర్శక ధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్‌(ISBC)కు గౌరవ చైర్మన్‌గా నియమితులయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి క్రికెటర్లుగా ఎదగాలనుకునేవారిని ఈ బోర్డు గుర్తించి ప్రోత్సహిస్తుంది. మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ గైడెన్స్ లో ఐఎస్ బీసీ ఏర్పాటైంది. తాను కూడా క్రికెట్ ఆడేవాడినని, ఆ ఆటంటే తనకు చాలా ఇష్టమన్నారు. స్కూల్ టైంలో తమ ఊర్లో క్రికెట్ ఆడేవాడినని రాజమౌళి వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన…

AP

వైఎస్‌ జగన్‌కు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్..

జనసేన (Janasena)వర్సెస్ వైసీపీ(YCP) మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బహిరంగ సభల్లోనూ..సోషల్ మీడియా(Social Media)లోనూ ఒక పార్టీ అధ్యక్షుడ్ని మరో పార్టీ అధ్యక్షుడు విమర్శించుకుంటున్నారు. ఒకరిపై మరొకరు దూషణలకు దిగుతున్నారు. నరసాపురం సభలో పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ఉద్వేగంగా ప్రసంగించడాన్ని సీఎం జగన్ (YS Jagan)తప్పు పట్టారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్ అంటూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విమర్శలు చేశారు. చివరకు వారాహి వాహనాన్ని వరాహి అని ఉచ్చరించారు.…

Cricket

క్రికెట్ మహా సంగ్రామం షెడ్యూల్ విడుదల

ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ను విడుదల చేశారు. ఐసీసీ మంగళవారం అధికారికంగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. 2019 సంవత్సరంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. లీగ్ దశలో భారత జట్టు మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. భారత్…