4news HD TV

TELANGANA

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ – రెండు నెలల గదుల కోటా విడుదల..!!

Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల కోటా విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరిలో అనుమతులపై తాజాగా సమయాలను ఖరారు చేసారు. గదుల కోటా విడుదల: ప్రతీ నెలా నిర్దేశించిన షెడ్యూల్…

APTELANGANA

జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు

జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తనపై రాజోలులో సుపారీ గ్యాంగ్‌తో రాళ్లదాడికి ప్రయత్నించారని ఆరోపించారు. మేల్కోపోతే ఇబ్బంది పడతామన్నారు. వైసీపీ ప్రభుత్వం రౌడీలు, గుండాలను వెనకేసుకొస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో లాఅండ్‌ఆర్డర్‌ పూర్తిగా దిగజారిపోయిందని..రూల్‌ ఆఫ్‌ లా ఎక్కడా అమలు కావడంలేదని చెప్పుకొచ్చారు. రాపాక వరప్రసాదరావు పేరు ప్రస్తావించకుండానే పంచ్‌ డైలాగులతో పవన్‌ తీవ్ర విమర్శలు చేశారు. విముక్తి చేయాలని పిలుపు: పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు కొనసాగిస్తున్నారు. తాను ప్రజల ముందు నిజాలను…

TELANGANA

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ధాటికి పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. ఇదే సమయంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ చ్చింది. రాగల మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. దంచి కొడుతున్న వానలు:…

APCINEMA

పవన్ ఒకప్పుడు బాగుండేవాడు- ఇప్పుడే ఇలా: జాలి చూపించిన పోసాని

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తోన్న వారాహి పర్యటన కలకలం రేపుతోంది. ఈ పర్యటన సందర్భంగా ఆయన చేస్తోన్న విమర్శలు, ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపుతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎదురుదాడికి కారణమౌతోన్నాయి. పవన్ చేస్తోన్న విమర్శలను వైఎస్ఆర్సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. పార్ట్ టైమ్ పొలిటీషియన్ రాజకీయాలు ఏపీకి అవసరం లేదని తేల్చేస్తోన్నారు. పవన్ కల్యాణ్ విమర్శలపై తాజాగా ప్రముఖ నటుడు, ఏపీ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్…

National

యూపీలో మరో దారుణ ఘటన-వాంగ్మూలం ఇస్తుందని దళిత మైనర్ రేప్ బాధితురాలికి ఉరి

ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బారాబంకిలోని హైదర్ ఘర్ లో నివసిస్తున్న ఓ దళిత మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఆమెను మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఆ లోపే ఆమె ఇంట్లోనే ఉరేసుకుని కనిపించింది. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బారాబంకిలో అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై తీవ్ర విమర్శలు…

TELANGANA

గుడ్ న్యూస్ చెప్పిన చమురు కంపెనీలు.. ధరలు తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన..!

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) మరో త్రైమాసికంలో బలమైన ఆర్థిక పనితీరును చూసినట్లయితే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ధరలు గత ఏడాది మే నుంచి పెట్రోల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం లాభాల్లో ఉన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ధరలు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. లీటర్ పెట్రోల్ కనీసం రూ.4 నుంచి గరిష్టంగా రూ.5…

TELANGANA

తెలంగాణ విద్యాశాఖ ఘోర తప్పిదం: సోషలిస్ట్, సెక్యులర్ పదాలు మిస్సింగ్

హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(SCERT) అధికారులు 10వ తరగతి సోషల్ స్టడీస్ కవర్ పేజీపై రాజ్యాంగ పీఠికను ముద్రించింది. అయితే, కవర్ పేజీపై ముద్రించిన రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు అదృశ్యమయ్యాయి. గత ఏడాది పీఠిక సరిగ్గా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం ఆ పదాలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలపై ఈ…

AP

ముద్రగడను వైసీపీ నడిపించట్లేదు- పవన్ నే చంద్రబాబు ఆడిస్తున్నారు- సజ్జల కామెంట్స్.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ వర్సెస్ విపక్షాల మాటల యుద్ధం ముదురుతోంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వారాహి టూర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకు వైసీపీ ఘాటు కౌంటర్లు ఇస్తోంది. అయినా పవన్ మాత్రం మాటల యుద్ధం ఆపట్లేదు. దీంతో ఓవైపు పవన్ ను చంద్రబాబుతో కలిపి టార్గెట్ చేస్తూనే, మరోవైపు ముద్రగడను పవన్ పైకి ఉసిగొల్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇవాళ వైసీపీ నేత సజ్జల స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

World

మోడీ అమెరికా పర్యటన వేళ కీలక ఒప్పందం: యుద్ధ విమానాల ఇంజిన్లు ఇక భారత్‌లో తయారీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన క్రమంలో భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మనదేశంలోనే ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీకి జనరల్ ఎలక్ట్రిక్(జేఈ) ఏరోస్పేస్(GE Aerospace)తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) కీలక అవగాహణ ఒప్పందం జరిగింది. ఈ ఇంజిన్లను భారత వాయుసేనకు చెందిన తేజస్ మార్క్-2 యుద్ధ విమానాల్లో అమరుస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. జీఈ ఏరోస్పేస్‌కు చెందిన ఎఫ్414 ఇంజిన్లను హెచ్ఏఎల్‌త కలిసి భారత్‌లోనే…