4news HD TV

National

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరిగింది. ఇందులో ఏపీతో పాటు ఆరు రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఇందులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ కీలక ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గడిచిన నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోందని జగన్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ…

AP

ఏపీలో ప్రాథమిక విద్య, ఇంటర్ చదివిన విద్యార్థికి తెలంగాణలో నివాసం ధ్రువీకరణ పత్రం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

ఏపీలో ప్రాథమిక విద్య, ఇంటర్ చదివిన విద్యార్థికి తెలంగాణలో నివాసం ధ్రువీకరణ పత్రం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అలంపూర్ తసీల్దార్ ను ఆదేశించింది. జోగులాంగ గద్వాల జిల్లా అలంపూర్ కు చెందిన సింగోటం వెన్నెల ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు కర్నూలులో చదివింది. ఇంటర్ కృష్ణా జిల్లాలో చదివింది. వెన్నలక మెడికల్ అడ్మిషన్ నిమిత్తం స్థానిక ఎమ్మార్వో 18 ఏళ్లుగా వెన్నల స్థానికంగా ఉంటుందని నివాస ధ్రువీకరణ…

National

31 ఏళ్ల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు: ఇరాన్ మహిళకు నోబెల్ శాంతి బహుమతి

స్టాక్‌హోమ్: ప్రఖ్యాత శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, సాహితీవేత్తలు, రచయితలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో రంగంలో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతుల ప్రకటన చేస్తూ వస్తోన్నారు జ్యూరీ కమిటీ సభ్యులు. ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు…

National

ఖానాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి గుడ్‌బై

ఖానాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రాజీనామా చేసినా ఆమె పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. తెలంగాణ సిఎం కెసిఆర్ మాటతప్పారని, కెటిఆర్ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని అన్నారు. వచ్చే ఎన్నికలో తాను పోటీచేస్తానని, బిఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో నేను చూస్తానని సవాలు విసిరారు. నాపై లేని పోని ఆరోపణలు చేశారు : అయితే, ఖానాపూర్…

TELANGANA

సీఎం జగన్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్

ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ల స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్‌ను అన్న అంటూ కేటీఆర్ ఎప్పుడు గౌరవిస్తునే ఉంటారు. ఆ మధ్య తెలంగాణ దేవాలయాలను కూడా అభివృద్ది చేయాలని కోరగానే సీఎం జగన్ దానికి తగిన ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆరే స్వయంగా మీడియాకు తెలిపారు. పార్టీ నుంచి బయటకు గెంటేసి ..ఇప్పుడు ఏడుపులా.. టీడీపీపై మండిపడ్డ తమ్మారెడ్డి తాజాగా మరోసారి మంత్రి కేటీఆర్ సీఎం జగన్…

National

రైలులో వృద్ధ దంపతులపై మూత్ర విసర్జన చేసిన యువకుడు..

బస్సు, రైలు, విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మద్యం తాగిన వారు వింతగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ యువకుడు రైలులో వృద్ధ జట్టపై మూత్రవిసర్జన చేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ AC కోచ్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అక్టోబర్ 4వ తేదీ బుధవారం మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పూర్ నివాసి డాక్టర్ జిఎన్ ఖరే, అతని 60 ఏళ్ల భార్య ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీకి బయల్దేరారు. వారు…

National

ఆ రూ.27 కోట్లు విరాళాలే- స్కిల్ స్కాం నిధులు కాదు- సీఐడీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్..

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రూ.27 కోట్ల నిధులు నిందితుల ఖాతాల నుంచి డొల్ల కంపెనీలకు వెళ్లి అక్కడి నుంచి టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు నిన్న సీఐడీ ఏసీబీ కోర్టుకు ఆధారాలు సమర్పించింది. దీంతో ఈ స్కాంలో నిధులు టీడీపీకి చేరిన అంశంపై చర్చ మొదలైంది. ఇన్నాళ్లు రూ.371 నిధులు చేతులు మారాయని ఆరోపిస్తున్న సీఐడీ.. చివరకు రూ.27 కోట్ల నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు చేసిన…

AP

టీడీపీ-బీజేపీతో పొత్తులపై పవన్ క్లారిటీ-జేఏసీకి ఐదుగురు సభ్యుల ప్రకటన..

నాలుగో విడత వారాహి యాత్ర సక్సెస్ అయినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో సమస్యలు తనకెంతో బాధ కలిగించినట్లు పవన్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంటూరు మార్పు అంశం తీవ్రంగా బాధించిందన్నారు. అలాగే బందరులో జరిగిన జనవాణి కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని నడిపించే అఖిలభారత సర్వీసు అధికారులకు కూడా నెల దాటినా జీతాలు రావడం లేదన్నారు. మాజీ ఐఏఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తనకు…

National

దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి పుల్ స్టాప్

ముంబై: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి పుల్ స్టాప్ పడింది. ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుగయింది. ఇకపై ఈ నోట్లేవీ మార్కెట్‌లో చెల్లుబాటు కావు. వీటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించలేం. అందుబాటులో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ఉంది. గతంలో సెప్టెంబర్ 30వ తేదీ నాటికే చివరి గడువు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. దీన్ని మరో వారం రోజుల…

TELANGANA

గన్‌మెన్ చెంప పగలకొట్టిన హోంమంత్రి..తప్పని వారించిన మరో మంత్రి..వీడియో వైరల్

తెలంగాణ మంత్రులు ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే మంత్రి తలసాని ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సమయంలో మంత్రి కేటీఆర్ పక్కన నడుస్తున్న బైంసా అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జాదవ్‌ రాజేష్‌ను వెనక్కి లాగి మరి చెంప దెబ్బ కొట్టారు.   ఈ ఘటన మరువక ముందే అధికార బీఆర్ఎస్‌లోని మరో మంత్రి వివాదంలో చిక్కుకున్నారు.తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ…