కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు
కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరిగింది. ఇందులో ఏపీతో పాటు ఆరు రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఇందులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ కీలక ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోందని జగన్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ…

