News

National

ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీ ఈ ఐదు లక్ష్యాలను నిర్దేశించారు: సంబిత్ పాత్రా..

పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’ వందకు వంద శాతం విజయవంతమైందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఉద్ఘాటించారు. ఈ ఆపరేషన్‌‍కు సంబంధించి మోదీ ఐదు లక్ష్యాలను నిర్దేశించారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండటంతో సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం…

AP

మే 15 నుంచి వాట్సాప్‌లో రేషన్ కార్డు దరఖాస్తు.!

రాష్ట్రంలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నూతన రైస్ కార్డుల జారీతో పాటు ఇతర ఆరు రకాల అనుబంధ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సేవలను ఇప్పటికే 72,519 మంది వినియోగించుకున్నారని, మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా కూడా ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు…

AP

క‌రెంట్‌ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

ఏపీలో క‌రెంట్ ఛార్జీలు పెంచుతున్న‌ట్లు గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో గృహ వినియోగ‌దారులు ఆందోళ‌న చెందుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఇళ్ల‌కు వ‌స్తున్న కరెంట్ బిల్లులు భ‌య‌పెడుతున్నాయ‌ని, మ‌రోసారి ధ‌ర‌లు పెంచితే ఎలాగంటూ వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించారు.   ఈ మేర‌కు ఆయ‌న క‌రెంట్ ఛార్జీల పెంపుపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎట్టిప‌రిస్థితుల్లో విద్యుత్…

National

సరిహద్దుల వైపు కదులుతున్న పాక్ సైన్యం..!

భారత్ పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పాకిస్థాన్ మరింత పెంచుతోందని ఆర్మీ ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ పై శనివారం ఉదయం ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను మీడియా ముందు పెట్టింది. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ, సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ఈ…

TELANGANA

ఆరు నెలలు కాల్పుల విరమణ.. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం..!

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు.. కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ.. మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం మావోయిస్టు పార్టీ అగ్రనేత జగన్ పేరిట లేఖ విడుదలైంది.   ‘‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్‌ను ప్రముఖంగా చేస్తున్నారు. దీనిని దృష్టిలో…

TELANGANA

ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..!

ఏప్రిల్ 22, పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాగ్రత్తగా గమనిస్తే.. ఇద్దరు రాజకీయ నేతలు మిగతా వారందరి కంటే ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆ ఇద్దరు మన తెలుగు నాయకులే కావడం గర్వకారణం. ఒకరు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మరొకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టెర్రర్ అటాక్‌ బాధితులకు నివాళిగా పార్టీ తరఫున 3 రోజులు సంతాప దినాలను నిర్వహించారు జనసేనాని. బాధిత తెలుగు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. పార్టీ తరఫున 50 లక్షల పరిహారం అందించారు.…

TELANGANA

క్లైమాక్స్‌లో ఆపరేషన్ కగార్‌,..!

ఆపరేషన్ సిందూర్‌తో సరిహద్దులు ఎరుపెక్కాయి. ఆపరేషన్ కగార్‌తో కర్రెగుట్టల రక్తమోడాయి. కర్రెగుట్టల్లో కాల్పుల మోత మోగుతూనే ఉంది. చంద్రన్న దళంతో భద్రత బలగాలు భీకర యుద్ధమే చేస్తున్నాయి. నూగూరు శివారు పెద్దగుట్ట దగ్గర భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 4 గంటల పాటు హోరాహోరాగా ఫైరింగ్ కొనసాగింది. మావోయిస్టుల తూటాలకు ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అదే ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్నతో సహా 22 మంది మావోయిస్టులు హతమయ్యారు.…

AP

ఏపీ లిక్కర్ స్కాం లో ఈడి ఎంట్రీ..! వైసీపీకి అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైందా..?

వైసీపీకి అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైందా? లిక్కర్ కేసులో నేతలకు దారులు మూసుకుపోతున్నాయా? నిన్నటికి నిన్న ముగ్గురు నిందితులకు ముందస్తు బెయల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాజాగా ఈ కేసులోని ఈడీ ఎంటరైంది. దీంతో వైసీపీ కీలక నేతల్లో అసలు టెన్షన్ మొదలైంది. ఇక తమ పని అయిపోయినట్టేనని అంటున్నారు.   వైసీపీ నేతలు బెంబేలు   వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. ఈ కేసుపై ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ,…

National

పాకిస్తాన్ కు బిగ్ షాక్.. పట్టుబడ్డ పైలట్..!

రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ ప్రాంతంలో భారత వైమానిక దళం పాకిస్తాన్ పైలట్‌ను సజీవంగా పట్టుకుంది. ఈ ఘటన మరింత ఆసక్తిని రేపుతోంది, ఎందుకంటే అదే సమయంలో కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ నుండి డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి.   ఢీకొన్న పాకిస్తాన్ విమానాలు.. జైసల్మేర్, అఖ్నూర్ ప్రాంతాల్లో రెండు పాకిస్తాన్ విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే, భారత వైమానిక దళం సమర్థవంతంగా స్పందించి, పాకిస్తాన్ పైలట్‌ను పట్టుకోగలిగింది. భారత వైమానిక దళం ఈ…

National

కరాచీ పోర్టుపై భారత్ దాడి.. పోర్టులో ఏడు భారీ పేలుళ్లు..

పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తోంది. భారత పౌరులను లక్ష్యంగా దాయాది దేశం దాడులు చేస్తోంది. పరిస్థితి గమనించిన భారత్ సైన్యం మూడు వైపులా పాకిస్తాన్‌ను చుట్టుముట్టింది. కేవలం ఎల్ఓసీ వెంబడి మాత్రమే కాకుండా ఆరేబియా సముద్రం వైపు భారత నేవీ రౌండప్ చేసింది. పాకిస్తాన్‌కు సమాచారం చేరుకునే లోపు కరాచీ పోర్టుపై మిస్సైల్ వర్షం కురిపించింది భారత నేవీ.   వార్ మొదలైంది?   పాకిస్థాన్‌ వాణిజ్యం కేంద్రానికి అత్యంత కీలకమైనది కరాచీ…