News

AP

జైలులో గోరంట్లకు రాజభోగాలు..!

నిత్యం వార్తల్లో ఉండాలనుకునే వారిలో మాజీ పోలీసు అధికారి, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకరు. ఆయన అధికారి ఉన్నప్పుడు ఎలాగ ఉండేవారో తెలీదు. ఎంపీగా ఉన్నప్పుడు మాత్రం ఆయన లీలలు అన్నీ ఇన్నీకావు. పదవి లేకపోయినా ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు. చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన ఉంటున్నారు. అక్కడ కూడా అధికారులకు చుక్కలు చూపిస్తున్నారని తెలుస్తోంది.   వైసీపీలో ఫైర్ బ్రాండ్‌ అవతారమెత్తారు…

AP

నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం..! రాజధాని అమరావతిలో అదనపు భూసేకరణపై చర్చ..!

నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. దీనికి- ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. రాజధాని అమరావతిలో అదనపు భూసేకరణ సహా పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు సమాచారం.   త్వరలో అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉన్నందున.. వీటికి సంబంధించిన అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నాయి. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదిస్తుందని తెలుస్తోంది. గతంలో సీఆర్డీఏ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై…

TELANGANA

మంత్రి పదవి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కడం పక్కా అని, ఆ మేరకు పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, కొందరు కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి జానారెడ్డి పేరును ప్రస్తావించారు.   ధర్మరాజులా వ్యవహరించాల్సిన జానారెడ్డి వంటి సీనియర్ నేతలు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.…

TELANGANA

అమల్లోకి భూ భారతి చట్టం..!

ధరణిని రీప్లేస్‌ చేయబోతుంది భూభారతి. అంబేద్కర్ జయంతి రోజున అధికారికంగా సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాల్లో అమలు చేయనుంది ప్రభుత్వం. ఇంతకీ ఈ పోర్టల్‌లో ఉండే సేవలేంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?   ఆర్వోఆర్‌-2020 స్థానంలో ఆర్వోఆర్‌-2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు ధరణి స్థానంలో.. భూ భారతి పోర్టల్‌ సైతం అందుబాటులోకి రానుంది. మొదట మూడు మండలాల్లో పైలట్…

AP

365 రోజుల్లో వందపడకల ఆసుపత్రి..! మంత్రి నారా లోకేష్ ప్రకటన..!

మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపడమే తన ధ్యేయమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, రెండో కేబినెట్ సమావేశంలోనే మంగళగిరికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి, శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రానున్న 365 రోజుల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.   ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి నియోజకవర్గం…

AP

రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు..!

రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను మాత్రం కచ్చితంగా ప్రజల ముందు ఉంచుతానని ఆయన పేర్కొన్నారు.   కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం ఠాణేలంక…

National

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు..! కీలక లోహాల ఎగుమతి నిలిపివేత..!

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో, కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత లోహాలు, అయస్కాంతాల ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు సహా అనేక కీలక రంగాలకు అత్యవసరమైన ఈ ముడిసరుకుల సరఫరాను నియంత్రించడం ద్వారా పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఇరుకున పెట్టేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోంది.   ఎగుమతుల కోసం చైనా ప్రభుత్వం సరికొత్త నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.…

National

బెంగాల్ ఆందోళనలు హింసాత్మకం, ముగ్గురు మృతి, కేంద్ర బలగాల ఎంట్రీ..!

వక్ఫ్ సవరణ చట్టాని(Waqf Act)కి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షిదాబాద్, మాల్దా, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను నిర్బంధించారు. కొందరు ఆందోళనకారులు హిందువుల నివాసాలు, వాహనాలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. షాపులు, దుకాణాల్లో దూరిన కొందరు దొంగతనాలకు తెగబడ్డారు.   ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు ధృవీకరించారు. ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. కాల్పుల్లో…

AP

నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం..!

ఏపీలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు వైసీపీ చేజారాయి. తాజాగా ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది.   నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా… వీరిలో 27 మంది వైసీపీ, ఒక టీడీపీ కౌన్సిలర్ ఉండేవారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్లలో 14 మంది జనసేనలో చేరారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన వశమయింది. నిడదవోలు మున్సిపాలిటీ కూడా చేజారి పోవడంతో వైసీపీ…

TELANGANA

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు..

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ లోపాలు తలెత్తడంతో దరఖాస్తు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.   ఇంటర్నెట్ సెంటర్లు, మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దరఖాస్తు చివరి దశకు చేరుకున్న సమయంలో సర్వర్ మొరాయించడంతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, సాంకేతిక సమస్యల కారణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నట్లుగా చూపిస్తోందని…