News

AP

వాటికి నిధులివ్వండి కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వినతి..!

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు.   ఏపీలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణా కేంద్రం..   అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందని మాండవీయ దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు…

AP

త్వరలో డీజీపీ చేతికి.. ‘ఆడుదాం ఆంధ్రా’ విజిలెన్స్ రిపోర్ట్..

వైపీసీ ఫైర్‌బ్రాండ్ రోజా ఎక్కడ? వైసీపీ సమావేశాలకు ఎందుకు దూరమవుతున్నారు? నెక్ట్స్ టార్గెట్ ఆమేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాటికి రోజా గురించి క్లియర్ పిక్చర్ రానున్నట్లు తెలుస్తోంది. అసలు మేటరేంటి? అనుకుంటున్నారా? అక్కడికి వచ్చేద్దాం.   ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తైంది. వారం రోజుల్లో డీజీపీకి నివేదిక ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. విచారణలో అధికారులు కీలక విషయాలు గుర్తించారు. నాసిరకం స్పోర్ట్స్ కిట్స్ కొనుగోలు చేసినట్లు తేలింది.…

AP

ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకుంటున్నాం: అనిత.

వైసీపీ అధినేత జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. జగన్ నుంచే ప్రసన్నకుమార్ రెడ్డి నేర్చుకున్నారని… మహిళా (ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి) నేతపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయని చెప్పారు. ప్రసన్నపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రసన్న తీరును జగన్ తప్ప ఎవరూ సమర్థించడం లేదని అనిత విమర్శించారు. రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలు గురించే తప్పుడు ప్రచారం చేసిన చరిత్ర జగన్ దని మండిపడ్డారు. బెట్టింగ్…

National

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం..!

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ పథకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 2025-26 నుంచి ఆరేళ్ల కాలానికి ఈ పథకం 100 జిల్లాలను కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించారు.   వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను…

TELANGANA

హస్తినలో ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం..!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్రమంత్రి సమావేశమయ్యారు.గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్.. 13 అంశాలతో తెలంగాణ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలను కేంద్రం ముందు ఉంచాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల…

TELANGANA

25 వేల మంది ప్రజాప్రతినిధులు అయ్యే వరకు మా పోరాటం ఆగదు!: కవిత..

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆ 25 వేల పదవుల్లో సగం మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో కవిత సమావేశమయ్యారు.   ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాల కోసం సబ్…

TELANGANA

కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ అక్రమంగా తరలించారు… బనకచర్లను ఒప్పుకోం: కోమటిరెడ్డి..

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్లను ఒప్పుకునే పరిస్థితే లేదని అన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం ఒక్కటే అజెండాగా పెడితే చర్చకు రాలేమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశామని తెలిపారు.   ఇప్పటికే తెలంగాణకు చెందిన కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ ఏపీకి తరలించుకుపోయారని కోమటిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో గోదావరిపై నాసిక్ లో ప్రాజెక్టు కడిగే…

National

విమాన ఇంజిన్ వైఫల్యాలు.. డీజీసీఏ నివేదికలో కీలక విషయాలు..

భారతదేశంలో గత ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థలు తమ విమానాల ఇంజిన్‌లు, ఇంధన స్విచ్‌లు మొదలైన వాటిపై అప్రమత్తమయ్యాయి. ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఒక నివేదికను విడుదల చేసింది.   ఈ నివేదికలో కొన్ని కీలక అంశాలను వెల్లడించింది. జనవరి…

National

బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బాంబు బెదిరింపులు ..

బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 3 గంటలకు పేల్చేయబోతున్నట్లు మెయిల్ వచ్చింది.   మెయిల్‌లో బెదిరింపు కామ్రేడ్ పినరయి విజయన్ అనే మెయిల్ ఐడీతో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాంబు స్వ్కాడ్‌తో ముమ్మరంగా గాలించారు. దీనితో వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌, ఫైర్‌ సర్వీసుల బృందాలను రంగంలోకి దింపారు. BSE పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను…

TELANGANA

గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని సీఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   ‘కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథం వైపు వెళ్తుందని సీఎం అన్నారు. ‘సాయుధ రైతాంగ, రజాకార్ వ్యతిరేక పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…