ఎల్ఆర్ఎస్పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..
తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ, వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా మొత్తం రుసుం చెల్లించిన దరఖాస్తుదారులకు లే-అవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.…

