News

TELANGANA

ఎల్ఆర్ఎస్‌పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..

తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ, వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.   ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా మొత్తం రుసుం చెల్లించిన దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.…

TELANGANA

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారని.. రూ. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా రూ. 70 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని కేసీఆర్‌ను దుయ్యబట్టారు.   సింగరేణి కార్మికులకు రూ. కోటి ప్రమాద…

AP

ఏపీ స్పీకర్ సంచలనం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు.   ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని అధికార వైయస్సార్…

Uncategorized

టీడీపీ- జనసేన ఉమ్మడి బహిరంగ సభ పేరు ఇదే…

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.   ఇక ఈ రెండు పార్టీలు కూడా సంయుక్తంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. ఉమ్మడి బహిరంగ సభలకు శ్రీకారం చుట్టనున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రా.. కదలిరా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా…

National

నేడు 500 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన..

అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద దేశవ్యాప్తంగా 500కు పైగా స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా ఏపీలో 34, తెలంగాణ రాష్ట్రంలో 15 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులు జరగనున్నాయి.   169 కోట్ల రూపాయలతో చేపట్టే ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సహ 16 అండర్ పాస్ బ్రిడ్జిల పనులకు నేడు ప్రధాని…

TELANGANA

బీఆర్ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి తీగల కృష్ణారెడ్డి…

లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒకరికొకరు పార్టీని వీడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితోపాటు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా రాజీనామా సమర్పించారు.   ఫిబ్రవరి 27న చేవెళ్లలో జరగబోయే సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నట్లు…

TELANGANA

సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)కు ఇటీవలే సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందించిన కవిత ఆదివారం సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేనని లేఖలో స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల దృష్యా సీబీఐ నోటీసులు జారీ వల్ల అనేక ప్రశ్నలకు తావిస్తోందని కవిత తెలిపారు.   ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున విచారణకు రావడం అవరోధంగా ఉందని కవిత తెలిపారు.…

AP

జనసేన పరిస్థితి ఇంత హీనమా, దేహీ అనటం పొత్తు ధర్మమా – జోగయ్య..!..

టీడీపీ, జనసేన అభ్యర్దుల ప్రకటనతో కొత్త రాజకీయం మొదలైంది. జనసేన 24 సీట్లకు పరిమితం కావటం ఆ పార్టీ శ్రేణులకు..మద్దతు దారులకు రుచించటం లేదు. సీట్ల దక్కని జనసేన ఆశావాహులు నైరాశ్యం లో ఉన్నారు. మరి కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో చేగొండి హరిరామ జోగయ్య జనసేనాని పవన్ కు లేఖ రాసారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సీట్ల ఒప్పందం కూడా పవన్ సమర్ధించుకుంటారా అని ప్రశ్నించారు.…

AP

బుచ్చయ్య, గంటా సీట్ల పై చంద్రబాబు క్లారిటీ – అసంతృప్తులకు ఏం చెప్పారు..!

టీడీపీలో సీట్లు దక్కని అసంతృప్తులతో చంద్రబాబు మంతనాలు ప్రారంభించారు. సీనియర్లను తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. పార్టీపరంగా ఉన్న పరిస్థితిని వివరించారు. వారికి ఇతరత్రా అవకాశాలు కల్పిస్తామని, పార్టీకి సహకరించాలని కోరారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం నుంచే ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. కందుల దుర్గేష్ ను నిడుదవోలు నుంచి పోటీకి నిర్ణయించినట్లు తెలుస్తోంది.   గోరంట్ల సీటు సేఫ్: టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు పైన క్లారిటీ…

National

సీట్లను పంచుకున్న ఆ రెండు ప్రధాన పార్టీలు.. .

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య పొత్తుల వ్యవహారాలు ఒక్కటొక్కటిగా తేలుతున్నాయి.   ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా…