AP

AP

జేసీ ఫ్యామిలీపై కేతిరెడ్డి ఫైర్‌.. వారికి మతి లేదు పాపం..!

 జేసీ దివాకర్‌ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఫ్యామిలీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. పాపం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఆరోగ్యం బాగోలేదు.. మతి లేదు పాపం ఆయనకు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి అనునిత్యం అడ్డుపడుతుంది జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్‌ రెడ్డేనని ఆరోపించారు.. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు, కాలేజ్ కాంపౌండ్ కు.. ఇలా ప్రతి దానికి అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. HLC కాలువకు…

AP

వైసీపీది ధనబలం, టీడీపీది ప్రజాబలం.. ఈ ప్రభుత్వం పని అయిపోయింది..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ధనబలం, తెలుగుదేశం పార్టీది ప్రజాబలం.. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం పని అయిపోతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. శ్రీకాళహస్తిలో నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి ప్రసంగిస్తూ.. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం, చంద్రబాబు ఆత్మవిశ్వాసం తెచ్చారన్నారు.. 49 రోజులుగా చంద్రబాబును జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు..చంద్రబాబు నాయుడు అవినీతి చేశారని ప్రజలు నమ్మడం లేదన్న ఆమె.. పరిశ్రమలు ఏర్పాటు చేయటం తప్పా..? అమరావతి రాజధాని నిర్మించడం తప్పా…?…

AP

అర్హత ఉంటే నా బిడ్డను గెలిపించండి.. కాదంటే ఓడించండి

రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగి, తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పైరవీలతో వచ్చిన వాడు కాదు.. ఫైటర్ గా రాజకీయాల్లోకి వచ్చినవాడు వైఎస్‌ జగన్‌ అంటూ ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి.. తిరుపతిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నక్సల్ బరి ఉద్యమ ప్రభావంతో 1972లో ర్యాడికల్ పోరాటంలో ముందున్న వాడిని నేను అని గుర్తుచేసుకున్నారు.. ఎమర్జెన్సీ…

AP

డిసెంబర్‌లో లెజెండ్ క్రికెట్ లీగ్ విశాఖలో జరగబోతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి

డిసెంబర్‌లో లెజెండ్ క్రికెట్ లీగ్ విశాఖలో జరగబోతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. క్రిస్ గేల్, గంబీర్, షేన్ వాట్సన్.. ఇలా 15 నుంచి 20 మంది దిగ్గజ క్రికెటర్లు విశాఖలో మ్యాచ్‌లు ఆడబోతున్నారని ఆయన తెలిపారు. దులీప్ ట్రోఫీలో ఒక స్టేట్ నుంచి నలుగురు ప్లేయర్లు ఆడిన ఘనత ఆంధ్రకే దక్కుతుందన్నారు. హనుమ విహారి, కేయస్ భరత్, రిక్కీ భువి, శశికాంత్ ఆడారని గోపినాథ్‌ రెడ్డి చెప్పారు. ఐపీఎల్‌లో ఆంధ్ర క్రికెట్…

AP

ఏపీలో మొత్తం 4,02,21,450 ఓటర్లు.. 13.48 లక్షల ఓట్లు తొలగింపు..

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్లు దాటింది.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ రోజు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసింది.. ఆ జాబితా ప్రకారం.. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450గా ఉంది.. అందులో పురుష ఓటర్లు 1,98,31791కాగా.. మహిళా ఓటర్లు 2,0385,851 మంది ఉన్నారు.. ఇక ఓటుహక్కు కలిగిఉన్న ట్రాన్స్ జెండర్ల సంఖ్య 3,808గా ఉంది.. సర్వీస్ ఓటర్ల సంఖ్య 66,158 కాగా.. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19,79,775 మంది ఓటర్లు ఉన్నారు..…

AP

చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో తన భద్రత, ఆరోగ్యంపై ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దీనిపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ నేతులు మాత్రం బెయిల్‌ కోసం చంద్రబాబు ఆడే కొత్త డ్రామా ఇది అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు.. అయితే, చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబుకి 24 గంటలు మొదటి నుంచి సెక్యూరిటీ ఏర్పాటు…

AP

తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం.. ఆందోళనలో భక్తులు

తిరుమల నడక మార్గంలో ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు.. అయితే, వారిని చిరుతల సంచారం మరోసారి భయపెడుతోంది.. గతంలో ఓ బాలుడిపై దాడి చేయడం.. ఆ తర్వాత చిన్నారిని చిరుత చంపేయడంతో.. భక్తులు భయాందోళనకు గురయ్యారు.. దీంతో.. టీటీడీ, ఫారెస్ట్‌ అధికారులు ఉమ్మడిగా ఆపరేషన్‌ చిరుత చేపట్టారు.. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించారు.. ఇక, చిరుతల పీడ విరగడైందని భక్తులు సంతోషపడుతున్నారు.. చాలా రోజులైంది చిరుతల సంచారం లేక.. కానీ, తాజాగా, అలిపిరి…

AP

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నేత నారాయణ.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అరెస్ట్‌ చేయలేదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ.. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ వద్ద పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించింది సీపీఐ.. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ,…

AP

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. సైట్ మార్చిన ttd

తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్ సైట్ ను మార్చింది. ప్రస్తుతం tirupatibalaji.ap.gov.in అని ఉండగా.. తాజాగా ఆ పేరును ttdevasthanams.ap.gov.in అని మార్చారు. ఈ మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. ‘వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్’లో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in ను ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్చామని తెలియజేశారు. భక్తులు ఇకనుంచి tirupatibalaji.ap.gov.in కాకుండా ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని అధికారులు సూచించారు.…

APNational

తిరుమలలో గరుడసేవ, ఎన్ని లక్షలాది మంది భక్తులు, గోవిందా గోవింద, జన్మధన్యం స్వామి!

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో (Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా గురువారం సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై (Garuda Vahana) శ్రీవారు విహరించారు. తిరుమలలోని (Tirumala) తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది శ్రీవారి భక్తులు వెయ్యి కళ్లతో వేచి చూశారు. శ్రీవారి భక్తులతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి.   తిరుమలలో (Tirumala) గురువారం ఉదయం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగో తిరుమాడ వీధుల్లో మోహనీ అవతారంలో శ్రీదేవి, భూదేవి…