AP

AP

పవన్ వారాహి టూర్ స్పెషల్ ! పొత్తు తర్వాత తొలిసారి-గ్రౌండ్లో జనసేనతో పాటు టీడీపీ !

ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన తర్వాత అక్కడికి వెళ్లి పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. అక్కడే పొత్తు కూడా ప్రకటించేశారు. తద్వారా టీడీపీ శ్రేణుల్లోనూ స్ధైర్యం సన్నగిల్లకుండా చేశారు. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి వారాహి నాలుగో దశ యాత్రను కూడా ప్రారంభించడం ద్వారా ఇరు పార్టీల శ్రేణుల్ని ఉమ్మడిగా తనవైపు తిప్పుకునేలా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత…

AP

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. స్వామివారి ప్రధాన ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన కానుకలను రేపు టెండర్ కమ్ వేలం వేయనున్నారు. కొత్తవాటితోపాటు పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 14 లాట్ల వరకు ఉన్నాయి. వీటిల్లో ధోతీలు, ఆర్ట్ సిల్క్ చీరలు, నైలాన్, నైలెక్స్ చీరలు, లుంగీలు, క్లాత్ బిట్స్, ఆర్డినరీ టవల్స్.. వగైరా వగైరా ఉన్నాయి. వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని, 0877-2264429 ఫోన్ నెంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌…

AP

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగిశాయి. పలు కీలక బిల్లుల ఆమోదంతో పాటు విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పాత్ర ఉందని ఆరోపిస్తున్న పలు స్కాంలపై చర్చించేందుకు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశ్చర్యకరంగా సీఎం వైఎస్ జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సభలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలు, సస్పెన్షన్లు, చంద్రబాబు స్కాంలపై చర్చ, పలు బిల్లులపై చర్చలు కూడా జరిగినా జగన్ మాత్రం ఎక్కడా నోరు…

AP

జైల్లో దోమలు కుట్టక రంభా, ఊర్వశి.. తిరనాళ్లలో తప్పిపోయినట్లు లోకేష్- కొడాలి సెటైర్లు..

చంద్రబాబు పేరు చెబితేనే మండిపడే వైసీపీ నేతల జాబితాలో మాజీ మంత్రి కొడాలి నాని ముందుంటారు. సందర్భం దొరికితే చాలు చంద్రబాబుపైనా, ఆయన కుమారుడు లోకేష్ పైనా కొడాలి తనదైన శైలిలో రెచ్చిపోతుంటారు. చంద్రబాబు అరెస్టుపై ముందుగానే స్పందించిన కొడాలి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అరెస్టుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కొడాలి విమర్శలకు దిగారు. చంద్రబాబు,లోకేష్, భువనేశ్వరిపై వైసీపీ నేత కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్…

APTELANGANA

కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక

రాయ్‌పూర్: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలైంది ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అఖిల…

AP

ఏపీలో మహిళా సాధికారికత అంశంపై అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ

అమరావతి: ఏపీలో మహిళా సాధికారికత అంశంపై అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. మంత్రులు ఆర్ కే రోజా, ఉష శ్రీచరణ్, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంగాటి శ్రీదేవి, ధనలక్ష్మి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలు ఆర్థిక స్వావలంబనను సాధించారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును చీటర్‌గా అభివర్ణించారు. చంద్రబాబు చీటర్…

AP

ఈ ఏడాది మొహమాటంగా పలకరించిన నైరుతి రుతుపవనాలు అరకొర వర్షపాతం తర్వాత వెనక్కి

ఈ ఏడాది మొహమాటంగా పలకరించిన నైరుతి రుతుపవనాలు అరకొర వర్షపాతం తర్వాత వెనక్కి మళ్లడం ప్రారంభించాయి. రాజస్తాన్ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ ఇవాళ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో 5 శాతం లోటు వర్షపాతం నమోదుచేసిన రుతుపవనాలు.. వారం రోజులు ఆలస్యంగా వెనక్కి మళ్లుతున్నట్లు ఐఎండీ తెలిపింది. దేశవ్యాప్తంగా జూన్ నెలలోనే నైరుతి రుతుపవన వర్షాలు పలకరించాల్సి ఉండగా.. ఆలస్యంగా జూలైలో అవి విస్తరించాయి. ఆ తర్వాత…

AP

తిరుమలలో రాయల కాలం నాటి సంప్రదాయం- కన్నుల పండువగా

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల తాకిడి పెరిగింది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. నడక మార్గాలన్నీ రద్దీగా మారుతున్నాయి. బుధవారం 74,884 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,213 మంది తలనీలాలను సమర్పించారు. గరుడ సేవ తరువాత భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. కృష్ణ తేజ గెస్ట్…

AP

మోత్కుపల్లి మాటలను గుర్తు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం

విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ ప్రభుత్వంపై భారత్ రాష్ట్ర సమితి నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన విమర్శలను ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి తిప్పి కొట్టారు. దీక్షకు దిగడం పట్ల ఘాటు విమర్శలు…

AP

ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ దశలో బాబు పిటీషన్ల జాబితా ఇదే

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ…