AP

APTELANGANA

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో కటువైన నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీలో ఎంత సీనియర్ నాయకుడైనప్పటికీ గెలుపునకు అవకాశాలు లేకపోతే రానున్న ఎన్నికల్లో పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈకోవలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం చేరుతోంది. నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదంటూ.. : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 1999 నుంచి చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యలో 2004, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజాగా…

AP

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల- ఇలా చూసుకోండి

ఏపీలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలను ఇవాళ అధికారికంగా ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటలకే ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నా మంత్రి బొత్స హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం కారణంగా ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో ఆరు గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఫస్ట్…

AP

తొలిసారిగా ఆయన డైరెక్షన్ లో ప్రభాస్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరూ ఎదురు చూస్తోన్న కాంబినేషన్ ఒకటి ఉంది. అదే.. రెబల్ స్టార్ ప్రభాస్-లెక్కల మాస్టర్ సుకుమార్. రంగస్థలం, పుష్ప సినిమాలతో సుకుమార్ తన పరిధిని, ఇమేజ్ ను పెంచుకున్నారు. మరోవైపు ప్రభాస్ జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి కథానాయకుడిగా మారిపోయారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. పుష్ప2 చిత్రం తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలని సుకుమార్ భావిస్తున్నారు. అయితే లైగర్ పరాజయం ఈ సినిమాపై…

AP

వివేకా హత్య వెనక కారణమేంటో చెప్పేసిన వైయస్ షర్మిల..!

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. తన చిన్నాన్న హత్య ఆస్తి కోసం జరగలేదని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డిపై ఉన్న ఆస్తులన్నీ, ఆయన ఎప్పుడో సునీత పేరు మీద వీలునామా రాశారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఆస్తుల కోసం వివేకానంద రెడ్డిని హత్య చేశారని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. సునీత…

AP

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత సాకే శైలజానాథ్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశం

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత సాకే శైలజానాథ్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య దాదాపు గంటసేపు భేటీ జరిగింది. శైలజానాథ్ ఆహ్వానం మేరకే జేసీ ఆయనింటికి వెళ్లారని చెబుతున్నారు. కొంతకాలంగా శైలజానాథ్ టీడీపీలోకి వస్తారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. శింగనమల నియోజకవర్గం నుంచి సాకే 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ప్రాథమిక విద్యాశాఖ, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2022లో జనవరి నుంచి నవంబరు వరకు…

APTELANGANA

ఇకపై మహిళలకు ఆ హక్కు..సంచలన నిర్ణయం తీసుకున్న పోప్ ఫ్రాన్సిస్..!

:రానున్న బిషప్ సమావేశాల్లో మహిళలకు ఓటు హక్కును కల్పించాలని పోప్ ఫ్రాన్సిస్ నిర్ణయించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే భావనతో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఓటు హక్కుకల్పించడం ద్వారా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని పోప్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు మహిళలకు మరింత నిర్ణయాధికార బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు. సైనాడ్ ఆఫ్ బిషప్స్‌కు వర్తించే పాలనాపరమైన నిబంధనల్లో చేసిన మార్పులకు పోప్…

AP

ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న ఛాపర్ కు పదే పదే సాంకేతిక సమస్యలు

ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న ఛాపర్ కు పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు తాడేపల్లి నుంచి గన్నవరం వెళ్లి ఢిల్లీకి బయలుదేరి వెళ్లే సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణాలు ఆలస్యం కావడమో లేక రద్దు కావడమే జరిగాయి. ఇవాళ మరోసారి అనంతపురం జిల్లాలోని నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని పుట్టపర్తికి బయలుదేరే సమయంలో మళ్లీ ఇలాంటి పరిస్ధితే తలెత్తింది. వైఎస్ జగన్ ఇవాళ తొలిసారి సీఎం హోదాలో…

AP

అడ్వెంచర్ మూవీని తలపించే రెస్క్యూ

మౌంట్ అన్నపూర్ణ. నేపాల్‌లో ఉంటుందీ పర్వతం. పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వత శిఖరాల్లో ఇదీ ఒకటి. అతి ఎత్తయిన 10వ పర్వతంగా దీనికి గుర్తింపు ఉంది. సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని అధిరోహించడం అంత సులువు కాదు. ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతుంటుంది. అలాంటి దుర్భేధ్య పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లిన భారతీయ పర్వతారోహకుడొకరు మంచుదిబ్బల్లో చిక్కుకుపోయారు. 48 గంటల పాటు అందులోనే గడిపారు. ఆక్సిజన్ అందని సంక్లిష్ట వాతావరణ…

APNationalTELANGANAWorld

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటు

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వేల కోట్లకు సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నాడు. ఆదాయమే పరమావధిగా ముందుకు వెళుతున్నాడు. ట్విట్టర్ ని దక్కించుకున్న వెంటనే కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులను తీసేశాడు. అలాగే వెరిఫైడ్ అకౌంట్ కోసం డబ్బులు చెల్లించాలన్న నిబంధన తెచ్చాడు. దీంతో చాలా మంది వెరిఫైడ్ బ్లూ టిక్ కోసం ఏడాది చందా లేదా నెల నెలకు చందా…

APTELANGANA

దట్టమైన అడవి.. రాళ్లతో కూడిన రహదారి.. మనుషుల వాయిస్ వినిపించని భయంకర ప్రదేశం

దట్టమైన అడవి.. రాళ్లతో కూడిన రహదారి.. మనుషుల వాయిస్ వినిపించని భయంకర ప్రదేశం.. కానీ అక్కడ అందమైన దేవాలయం.. అందులో లక్ష్మీతో కొలువైన నరసింహాస్వామి.. బొమ్మలతో కూడిన ఇటుకలు.. బుద్ధుని చరిత్ర తెలిపే శిల్పాలు.. ఇలాంటి దేవాలయం కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ లో మాత్రమే కనిపిస్తుంది. కానీ తెలంగాణలోనూ 6వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం ఒకటి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఇక్కడి వెళ్లాలంటే సాహసంతో కూడుకున్న పనే. సాధారణ సమయంలో ఇక్కడికి…