AP

APNationalTELANGANA

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపు

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతి, శివందొరవలస గ్రామంలో పార్టి జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులైన కామ్రేడ్ చారు మజుందార్,నాగభూషన్ పట్నాయక్ , ఎంపటాపు సత్యం, ఆదిబట్ల కైలాసం, కొరన్న మంగన్నలకు జోహార్లు పలికి నినాదాలు చేశారు. వారి ఆశయాలను కొనసాగించాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఏప్రిల్ 22,…

APCINEMA

తన బ్రాండ్ మీద రికార్డు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ది ముందు వరస.

టాలీవుడ్ లో సినిమా మీద హైప్ తో సంబంధం లేకుండా కేవలం తన బ్రాండ్ మీద రికార్డు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ది ముందు వరస. ఓజి షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. రాగానే హరిహర వీరమల్లు పెండింగ్ ఎంతుందో చూసుకుని డేట్లు ప్లాన్ చేసుకుంటారు. ఉస్తాద్ భగత్ సింగ్ ని మెట్రో స్పీడ్ తో పరుగులు పెట్టించేందుకు హరీష్ శంకర్ సర్వసన్నద్ధంగా ఉన్నాడు. వినోదయ సితం రీమేక్ ఆల్రెడీ షూటింగ్ పూర్తి…

AP

టిడిపిలో రాయపాటి టికెట్ల బేరం. చంద్రబాబు ఏం చేస్తారో?

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టికెట్ల కోసమని మీడియాతో మాట్లాడుతున్న టిడిపికి,ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఆయన తన కొడుకు రంగబాబుకి సత్తెనపల్లి లేదా పెదకూరపాడులోగానీ టికెట్‌ ఇవ్వాలని, అలాగే తన తమ్ముడు కూతురు శైలజకు కూడా తప్పనిసరిగా టికెట్‌ ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని, కానీ వారిద్దరికీ టికెట్స్ ఇస్తే తాను టికెట్‌ కోసం పట్టుబట్టనని టిడిపికి…

AP

వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ రోజుకో ఊహించని మలుపు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాకు తీసిపోకుండా సాగుతోంది. తాజాగా వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకి ఇచ్చిన తాజా వాంగ్మూలం మొత్తం ఈ కేసు విచారణనే మలుపు తిప్పేలా ఉంది. దానిలో ఆమె తనను వివేకానంద రెడ్డి 2010లో వివాహం చేసుకొన్నారని, మళ్ళీ 2011లో ఇస్లాం మతసాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకొన్నామని తెలిపారు. 2015లో తమకు కుమారుడు జన్మించాడని, అతనికి షెహన్ షా అని…

AP

సిఎం జగన్మోహన్ రెడ్డి అధినేత మొదలు ఆయనకు భజన

సిఎం జగన్మోహన్ రెడ్డి అధినేత మొదలు ఆయనకు భజన చేసే గుడివాడ అమర్నాథ్ వంటి మంత్రులు పదేపదే టిడిపి, జనసేన పార్టీలను “175 సీట్లలో పోటీ చేస్తారా లేదా?ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా లేదా?” అంటూ సవాళ్ళు విసురుతూనే ఉంటారు. సిఎం జగన్మోహన్ రెడ్డి అయితే పొత్తులు పెట్టుకొనేవారందరూ ‘తోడేళ్ళ గుంపు’ అని తాను వాటిని ఒంటరిగా ఎదుర్కొంటున్నానని చెప్పుకొంటూ ప్రజల నుంచి సానుభూతి కోరుకొంటుంటారు! అయితే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకోకూడదని ఎక్కడ ఆంక్షలు…

APTELANGANA

అక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి సాగు భూములకు పట్టాలివ్వాలి

  పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనలు సాగుచేసుకుంటున్న భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎం ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సంఘం లు కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం పెడమరికి పంచాయితీ శివం దొరవలస, చిన మరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కలిసి సమస్యను తెలియజేశారు. గతంలో పట్టణానికి చెందిన మాజీ సైనికడు కి ప్రభుత్వం వారు నిబంధనల…

APNational

రాహుల్ స్టే పిటిషన్ తిరస్కరణ.. రాహుల్ స్టే పిటిషన్ తిరస్కరణ.. .

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షని నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ని సూరత్ కోర్టు కొట్టివేసింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల సూరత్ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ట్రయల్‌ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టలేదని, కఠినంగా వ్యవహరించిందని, రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసు కాదంటూ రాహుల్‌ గాంధీ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ…

AP

చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. నమ్మకం

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. రాజకీయాలలో ఆయనది విలక్షణ శైలి. రాజకీయాలంటే పదవులు, అధికారం అనుభవించడం కాదని, అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం పనిచేయడమని భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ఏపీకి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన తన ఆలోచనలను ఆచరణలో పెట్టి చూపారు. ఆయన సమర్దతకు హైదరాబాద్‌ అతిపెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది. చేతిలో చెల్లిగవ్వలేని పరిస్థితిలో ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు…

AP

చంద్రబాబుకి విజయసాయి శుభాకాంక్షలు. వైసీపీలో మరో బ్లాస్ట్?

రాజకీయాలలో పదవులు, అధికారం ఎన్నడూ శాస్వితం కావనే విషయం అధికారంలో ఉండి చక్రం తిప్పుతున్నప్పుడు చాలా మంది గ్రహించరు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా వారిలో ఒకరు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సిఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటివాడుగా చలామణి అయ్యారు. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ ఓ వెలుగువెలిగారు. ఆ ఊపులోనే ఆయన చంద్రబాబు నాయుడుని, టిడిపిని అనరాని మాటలు చాలానే అన్నారు. సోషల్ మీడియాలో వేసిన సెటైర్లకు అంతే…

AP

వివేకా హత్యకేసులో మరో ట్విస్ట్. పాపం అవినాష్ రెడ్డి!

జగన్ ప్రభుత్వం తలుచుకొని ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసును నాలుగు వారాలలో తేల్చేసేది. కానీ దానిలో అందరూ అసమదీయులే కావడంతో నాలుగేళ్ళయినా తేల్చనీయలేదు. ఇదే మాట సీబీఐ న్యాయవాది మొన్న హైకోర్టులో కూడా చెప్పారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ కేసు విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు తమని ఆదేశించిందని, కానీ అవినాష్ రెడ్డిని ఎప్పుడు విచారణకు పిలిచినా కోర్టులో పిటిషన్లు వేస్తూ విచారణ ముందుకు సాగకుండా అడ్డుకొంటున్నారని కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పింది. సీబీఐ వాదనలు సహేతుకంగా ఉండటంతో…