AP

AP

టిడిపితో కలవకుండా పవన్‌ కళ్యాణ్‌కి బ్రేకులు వేస్తున్నదెవరంటే.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఈసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ప్రయత్నిస్తానని అందుకోసం టిడిపితో కలిసి పనిచేసేందుకు సిద్దమని కూడా ప్రకటించారు. అయితే ఇటీవల ఢిల్లీలో బిజెపి పెద్దలను కలిసిన తర్వాత ఏపీలో బిజెపితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. పవన్ పొడ అంటే గిట్టని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు కూడా సై అన్నారు. మళ్ళీ ఎప్పటిలాగే రెండు పార్టీలు…

AP

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కధ అలా ముగించారు కేసీఆర్‌?

ఏపీలో రాజకీయపార్టీలకు దేని సమస్యలు దానికి, దేని లెక్కలు దానికీ ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని అమ్మకానికి పెట్టినా అన్నీ మొక్కుబడిగానే నిరసనలు తెలిపి ఊరుకొన్నాయి. కానీ ఎప్పుడైతే తెలంగాణ సిఎం కేసీఆర్‌ మీకు చేతకానిది నేను చేసి చూపించి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుతానంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారో అప్పుడే అన్ని పార్టీలకు వేడి పుట్టింది. ముఖ్యంగా అధికారంలో వైసీపీకి ఇది రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తుంది కనుక వెంటనే ఏపీ…

AP

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ జరుపుతోంది. మరోపక్క పిటిషన్లు పడుతుంటే వాటిపై హైకోర్టు విచారణ జరుపుతూనే ఉంది. ఈ కేసులో నిందితులు కూడా మీడియా ముందుకు వచ్చి రకరకాల స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఇవి సరిపోవన్నట్లు, మళ్ళీ వారి తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రికలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరూ నిరపరాధులని ముందే తీర్పు ప్రకటించి సమాంతర విచారణ జరుపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం…

AP

తాడేపల్లి టూ విశాఖ జగన్ ప్రయాణం ముగుస్తుందా?

సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుకి, నౌపాడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి, ఎచ్చెర్ల మండలంలో బుడగట్లపాలెంలో ఫిస్షింగ్ హార్బర్‌కి, హీరమండలంలో వంశధార ఎత్తిపోతల పదకాలకి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని, మరో రూ.365 కోట్లతో బుడగట్లపాలెం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. గత పాలకులు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని కానీ తన…

AP

ఆలూరు నియోజకవర్గంలో యువగళం 75వ రోజు పాదయాత్ర

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో యువగళం 75వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా దారిలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ జగన్‌ డ్రామా ట్రూప్ వివేకా హత్య కేసులో అడ్డంగా బుక్కయి రోజుకో కధ చెపుతూ మమ్మల్ని అరెస్ట్‌ చేయకండి బాబో. అంటూ హైకోర్టును వేడుకొంటోంది. అయితే ఈ డ్రామా ట్రూప్ మొట్టమొదటే చిన్న లాజిక్ మిస్ అయ్యింది. ఒకవేళ గత ఎన్నికలలో అవినాష్ రెడ్డినే అభ్యర్ధిగా నిలబెట్టాలని…

APTELANGANA

కేఏ పాల్-లక్ష్మినారాయణ. ఇదేం కాంబినేషన్‌?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కరలేని వ్యక్తి. ఆయన చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నప్పటికీ రాణించలేకపోయారు. కారణం అందరికీ తెలుసు. ఇక ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో కూర్చోబెట్టిన వ్యక్తి సీబీఐ మాజీ జేడీ లక్షినారాయణ. మితభాషి, మంచి సమర్దుడు, నిజాయతీపరుడు, రాష్ట్రం బాగుకోసం పరితపిస్తున్న వ్యక్తిగా ఆంధ్రా ప్రజలకు తెలుసు. ఏ విషయంలోనైనా వీరిద్దరూ తూర్పు పడమరవంటివారే. కానీ వైజాగ్‌…

APTELANGANA

ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు

ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవీపట్నం మండలం ఎంపీపీ కుంజం మురళి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థుల విన్యాసాలు ఆటపాటలు డాన్స్ పోటీలు క్విజ్ పోటీలు అనేక రకములైన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు తల్లిదండ్రులని ఎంతో ఆకట్టుకున్నాయి వీరి…

APCINEMATELANGANA

: 2 లక్షల పెట్టుబడి తో 10 లక్షల ఆదాయం వచ్చే వ్యాపారం ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలామంది చదువుకున్న యువత ఎంత చదివినా ఫలితం లేదు అని జాబ్స్ కేవలం అదృష్టం డబ్బులు ఉన్నవాళ్లకే వస్తాయని చెప్పుకుంటూ ఏదైనా ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి వాళ్ళు కొన్ని బిజినెస్ (Business Idea) లు చేస్తూ జాబ్ చేసే వాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అయితే మరికొంతమంది వాణిజ్య వ్యాపారం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. కొంతమంది రైతులుగా మారి తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక…

APCINEMAPOLITICSTELANGANA

అధికార పార్టీలకి కష్టం వస్తే ప్రజలు కన్నీళ్ళు కార్చాలా?

ఒకప్పుడు అధికార పార్టీలు రాష్ట్రాన్ని ప్రజలను ప్రభావితం చేసే వివిద అంశాలపై ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు ఓసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకొంటుండేవి. ఇటువంటి మంచి సాంప్రదాయాన్ని దాదాపు అన్ని పార్టీలు ఎప్పుడో మర్చిపోయాయి. కనీసం రాష్ట్రానికి సంబందించిన సమస్యల పరిష్కారానికి కూడా ప్రతిపక్షాలను కలుపుకుపోయేందుకు ప్రయత్నించడం లేదు. కానీ అధికార పార్టీల నేతలు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు లేదా హత్యనేరాలలో దర్యాప్తు సంస్థలకు అడ్డంగా దొరికిపోయినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ…

APTELANGANA

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ..

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయం వద్దకు వచ్చారు. కానీ అంతకు ముందే హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. కనుక హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డిని విచారించాలనే ఉద్దేశ్యంతో సీబీఐ విచారణను మంగళవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసిన్నట్లు సాక్షితో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ హైకోర్టులో వాదనలు ముగిసిన…