AP

APCINEMAPOLITICSTELANGANA

అధికార పార్టీలకి కష్టం వస్తే ప్రజలు కన్నీళ్ళు కార్చాలా?

ఒకప్పుడు అధికార పార్టీలు రాష్ట్రాన్ని ప్రజలను ప్రభావితం చేసే వివిద అంశాలపై ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు ఓసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకొంటుండేవి. ఇటువంటి మంచి సాంప్రదాయాన్ని దాదాపు అన్ని పార్టీలు ఎప్పుడో మర్చిపోయాయి. కనీసం రాష్ట్రానికి సంబందించిన సమస్యల పరిష్కారానికి కూడా ప్రతిపక్షాలను కలుపుకుపోయేందుకు ప్రయత్నించడం లేదు. కానీ అధికార పార్టీల నేతలు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు లేదా హత్యనేరాలలో దర్యాప్తు సంస్థలకు అడ్డంగా దొరికిపోయినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ…

APTELANGANA

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ..

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయం వద్దకు వచ్చారు. కానీ అంతకు ముందే హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. కనుక హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డిని విచారించాలనే ఉద్దేశ్యంతో సీబీఐ విచారణను మంగళవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసిన్నట్లు సాక్షితో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ హైకోర్టులో వాదనలు ముగిసిన…

AP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మంత్రుల అసమర్దత గురించి తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు మళ్ళీ చురకలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మంత్రుల అసమర్దత గురించి తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు మళ్ళీ చురకలు వేస్తున్నట్లు మాట్లాడారు. నేడు సిద్ధిపేట జిల్లాలో ఆత్మీయ సమ్మేళనంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తాను తెలంగాణ అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు పొరుగు రాష్ట్రంతో పోల్చి చూపితే, ఆంద్రా మంత్రులు ఎగిరెగిరిపడ్డారని అన్నారు. ఉన్నమాట అంటే ఉలుకెందుకని ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేకహోదా కోసం పోరాడుతామన్నారు. కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారెందుకు?మీ కళ్ళ ముందే విశాఖ…

APTELANGANA

యజ్ఞ సినిమా షూటింగ్ మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బేతాళ స్వామి జాతర

యజ్ఞ సినిమా షూటింగ్ మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బేతాళ స్వామి జాతరలో ఈరోజు తీయడం జరిగింది నటీనటులు హీరో శివాజీ, హీరోయిన్ జ్యోతిక, మరోక ఇద్దరూ నూతన నటీనటులు హీరో హీరోయిన్ బేతాళ స్వామి మందిరం వద్ద మరియు జాతరలో సినిమా షూటింగ్ తీయడం జరిగింది అల్లాదుర్గం మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు డి. సుభాష్ రావు గారి ఆధ్వర్యంలో సినిమా చిత్రీకరణ లోకేషన్లో ఫైట్ సీన్లు…

APCINEMANationalTELANGANA

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలను హిందీలో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అందుకే ఆ హీరోలను హిందీ సినిమాల్లో నటింపజేసేందుకు కొందరు స్టార్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఒక బాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ లను గెస్ట్ పాత్రలో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు…

AP

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి

ని సీబీఐ అరెస్ట్ చేయడం పట్ల ఆయన తనయుడు ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ సరిగా జరగడం లేదని ఎంపీ ఆరోపించారు. మేము చెప్పిన విషయాలను పట్టించుకోకుండా సిల్లీ విషయాలను తీసుకుని భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు అంటూ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వివేకా హత్య కేసును ఒక కొలిక్కి తీసుకు వచ్చేందుకు సీబీఐ విచారణ చేస్తుంది తప్పితే…

APTELANGANA

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనం

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నేను మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను అడ్డికి పావు షేరు లెక్క అమ్ముతున్నారు. 27 వేల మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడటం కోసం బిఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుందని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్…

APTELANGANA

ఆదిలాబాద్ జిల్లాలో ఎండిపోయిన ఆకులు కొన్ని రాలినప్పటికీ.. కొత్త చిగురులు

ఆదిలాబాద్ జిల్లాలో ఎండిపోయిన ఆకులు కొన్ని రాలినప్పటికీ.. కొత్త చిగురులు వస్తూనే ఉంటాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపిలో చేరిన నేపథ్యంలో ఆయన పార్టీని వీడినంత మాత్రాన్నే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి…

APTELANGANA

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఏప్రిల్ 06న ప్రారంభమైన చివరి విడత మెయిన్ పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి. జనవరిలో జరిగిన మెుదట విడత మెయిన్‌, తాజా పరీక్షల్లో సాధించిన బెస్ట్ స్కోర్‌ను (రెండు సార్లు రాసి ఉంటే) పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ర్యాంకులు ఇవ్వనుంది. కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తంహా 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. జూన్ 04వ తేదీన ఈ…

APTELANGANA

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించే స్థాయి పార్వతీపురం కమ్యూనిస్టు పార్టీలకు ఉందా అని

పార్వతీపురం మన్యం జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీ పరిపాలన ఎంత దారుణంగా ఉన్న మీకు కనిపించడం లేదా అని అన్నారు. మీరు వాళ్లతో చేతులు కలిపి పార్టీని నడిపిస్తున్నారా అని ఆరోపించారు. ప్రధానమంత్రిని విమర్శించేవాళ్లు వాళ్ళు ధైర్యం ఉంటే స్థానిక ఎమ్మెల్యే పై మాట్లాడాలని తెలిపారు. బిజెపితో అభివృద్ధి జరుగుతుందని, పార్వతిపురం చుట్టూ…