AP

AP

నియోజవకర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు

వై నాట్ 175. సీఎం జగన్ ఈ ఎన్నికలకు ఫిక్స్ చేసిన టార్గెట్. ఇప్పటికే నియోజవకర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. పలు మార్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. సర్వేల్లో వెనుకబడి ఉన్న అభ్యర్ధులకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచనలు చేసారు. ఇక, ఇప్పుడు మంత్రుల్లో తిరిగి సీట్లు దక్కేదెవరికి..వారి గెలుపు అవకాశాల పైన చర్చ మొదలైంది. అందులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ…

AP

జగన్ తో ఉద్యోగ నేతల భేటీ- వారిని నమ్మొద్దు -సీఎం కీలక వ్యాఖ్యలు…!

ఏపీలో పలు ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎంతో పలు విషయాలపై చర్చించారు. అలాగా తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడిన సీఎం జగన్.. ఉద్యోగుల విషయంలో తాము పడుతున్న తపనను వారికి వివరించారు. ఇవాళ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు…

AP

దూసుకెళుతున్న 3 షేర్లు.. నో స్టాప్

దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి జోష్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు సానుకూలంగా ఉండంతోపాటు కొన్ని ప్రధానమైన రంగాల్లో కొనుగోళ్ల వల్ల భారీ లాభాల వైపు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ సెన్సెక్స్ సూచీ 361 పాయింట్ల లాభంతో 63 వేల 90 మార్క్ వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 108 పాయింట్లు లాభపడి 18 వేల 709 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఏషియన్ పెయింట్స్, సిప్లా, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్…

APTELANGANA

నిర్మలా సీతారామన్ అల్లుడు ఏం చేస్తారో తెలుసా?

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Niramala Sitharaman), పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి(Vangmayi) వివాహం ప్రతీక్‌(Pratik Doshi)తో నిరాడంబరంగా జరిగింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగళూరులోని మంత్రి ఇంట్లోనే పెళ్లి వేడుక పూర్తిచేశారు. రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఎవరూ హాజరుకాలేదు. పెళ్లి సమాచారాన్ని సీతారామన్‌ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించలేదు. అయితే వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్మలా సీతారామన్‌ అల్లుడు ప్రతీక్‌ వివరాల కోసం నెటిజన్లు గూగుల్‌లో…

APTELANGANA

వైసీపీలోకి ముద్రగడ చేరిక లాంఛనమేనా ? కాకినాడ ఎంపీగా పోటీపై చర్చలు !

కాపు ఉద్యమాలతో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత టీడీపీ ప్రభుత్వంలో తుని రైలు దహనం ఘటనతో చర్చల్లోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేయడంతో విపక్ష వైసీపీని ఆశ్రయించి మద్దతు పొందారు. ఇది కాస్తా ఎన్నికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా పనిచేసింది. దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉంటున్న ముద్రగడ తాజాగా కీలక ప్రకటన చేశారు.…

APNationalTELANGANA

వృద్ధురాలిని మోసం చేసిన నకిలీ డాక్టర్.. మత్తుమందు ఇచ్చి ఆపై అలా?

సమాజంలో రోజురోజుకీ నకిలీ డాక్టర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకమైన ప్రజల జీవితాలతో ఆటాడుతున్నారు. కొందరు డాక్టర్లు అనే పేరు చెప్పుకుంటూ నకిలీ డాక్టర్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే గతంలో చాలామంది నకిలీ డాక్టర్లు బాగోతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా కూడా వ్యక్తి డాక్టర్ ని అని నమ్మించి వృద్ధురాలిని…

AP

ఏపీలో తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం- లెవెల్ క్రాసింగ్‌పై ట్రాఫిక్ జామ్

పుట్టపర్తి: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా…

APNationalTELANGANA

టీడీపీ ఆధ్వర్యంలో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్రని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారం అవ్వడానికి అసెంబ్లీ నుంచి మొట్టమొదటి ప్రతిపాదనలు ఇచ్చింది చంద్రబాబునాయుడు అని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, యువత కలలుగన్న తెలంగాణ రాలేదని, నీళ్లు, నిధులు, నియామకాల…

APNational

విశాఖలో సుపారీ గ్యాంగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో ఓ సుపారీ గ్యాంగ్ గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్ క్రైమ్ పోలీసులు ఆ సుపారీ గ్యాంగ్‌ను అర్థరాత్రి పట్టుకున్నారు. న్యూకాలనీ లక్ష్మీరాయల్ హొటల్‌లో రూమ్ నంబర్ 105లో ఆ ముఠా ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో.. పోలీసులు ఓ ప్లాన్‌తో రంగంలోకి దిగి, నిందితులకు అనుమానం రాకుండా హోటల్‌లో ఎంట్రీ ఇచ్చి, వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురి సభ్యులు ఉండగా.. వారిని అరెస్ట్ చేశారు. నిందితులందరూ మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. వీళ్లు…

AP

`భవిష్యత్తు గ్యారెంటీ`- టీడీపీ మేనిఫెస్టో: ఆరు హామీలను ఆవిష్కరించిన చంద్రబాబు

రాజమండ్రి వేదికగా.. తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి కూడా తోడుకావడంతో ఇవ్వాళ్టి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం తన ముగింపు సభలో పలు కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్టీ రామారావు శతజయంత్యుత్సవాలను పురస్కరించుకుని చంద్రబాబు- తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా బహిరంగ లేఖ…