AP

APTELANGANA

ఆటోలో తీసుకెళ్లి.. అత్యాచారం

ఓ గుర్తుతెలియని వ్యక్తి గాయాలతో ఉన్న మహిళను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించగా సాయంత్రం ఆమె మృతి చెందింది.   Khammam Crime : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన అత్తకు సహాయకురాలిగా వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాష్టీకానికి ఒడిగట్టారు. కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసి.. మరుసటి రోజు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేశారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన సదరు మహిళ చికిత్సపొందుతూ…

AP

ఏపీలోని కాకినాడలో ఒక విషాదకర ఘటన

ఏపీలోని కాకినాడలో ఒక విషాదకర ఘటన జరిగింది. ఓ చిన్నారి కారులో చనిపోయింది. కారులో ఉంచి డోర్లు లాక్ చేయడంతో ఆ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాజులూరు మండలం కోలంక గ్రామంలో జరిగింది. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక అఖిలాండేశ్వరి (8) అనే ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. కిరాణా షాపుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ చిన్నారి రోడ్డుపై ఉన్న కారును…

AP

డా.గజల్ శ్రీనివాస్‌‍కు ‘సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్గంగిణీ సంగీత సంస్థ, స్వరంగిణీ జన వికాస సమితి ఆధ్వర్యంలో ఇండోర్‌లో అభినవ్ కళా సమాజ్, గాంధీ హాలులో నిర్వహించిన “సంత్ కబీర్ ఉత్సవ్”లో ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గ్రహీత, ప్రఖ్యాత గజల్ గాయకుడు “మాస్ట్రో” డా.గజల్ శ్రీనివాస్‌కు “సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం” అందించారు. ఈ వేడుకలో ముఖ్య అథితిగా పాల్గొన్న ఇండోర్ ఆకాశవాణి సంచాలకులు సంతోష్ అగ్నిహోత్రి చేతుల మీదుగా బహుకరించారు. ఈ సభలో డా.గజల్ శ్రీనివాస్ ఆలపించిన…

AP

సీఎం జగన్ – భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తేదీన విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మే మూడో తేదీన విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ నిర్మాణం, తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పెండింగ్ పనులు ప్రారంభిస్తారు. సవరవిల్లిలో జరిగే బహిరంగ సభ…

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో షాక్ కొట్టింది. అదేసమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అసోసియేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. నిరసనలకు దిగితే ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని ఆయన…

APTELANGANA

బాబాయ్ హత్య కేసు నుంచి దృష్టి మరల్చలేరు : టీడీపీ ఎంపీ

సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నేతలపై పోలీసులను ఏపీ ప్రభుత్వం ఉసిగొల్పిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా, జగత్ జనని చిట్ ఫండ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన తనయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్‌(వాసు)లను ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ…

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మే ఒకటో తేదీన ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, మే 1, 2 తేదీల్లో ప్రకాశం, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మే రెండో తేదీన మన్యం, అల్లూరి సీతారామ రాజు జిల్లా, తూర్పు గోదావరి,…

APTELANGANA

మే ఒకటో తేదీన సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పునఃసమీక్ష

మే ఒకటో తేదీన సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పునఃసమీక్షించాయి. ఇందులోభాగంగా, వ్యాపార అవసరాల నిమిత్తం వినియోగించే వాణిజ్య సిలిండర్ ధర తగ్గింది 19 కేజీల సిలిండర్ ధరను రూ.171.50 మేరకు తగ్గించినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సోమవారం వెల్లడించాయి. ఈ సవరణ తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.1856.50కు చేరుకుంది. ఈ తగ్గిన ధర సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. అలాగే, ముంబైలో రూ.1808.50గాను కోల్‌కతాలో రూ.1960.50కు…

AP

రక్షక బటుడి స్వచ్ఛంద సేవలను అభినందిస్తూ రాజకీయాలకు అతీతంగా కృష్ణారావును ఘనంగా సత్కరించి సన్మానించి గౌరవించిన గౌ, ఎమ్మెల్యే అలజంగి జోగారావు

రక్షక బటుడి స్వచ్ఛంద సేవలను అభినందిస్తూ రాజకీయాలకు అతీతంగా కృష్ణారావును ఘనంగా సత్కరించి సన్మానించి గౌరవించిన గౌ, ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారు మరియు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పార్వతీపురం ప్రాంతానికి చెందిన రక్షకబటుడు కృష్ణారావు పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా ఒకవైపు విధులు నిర్వహిస్తూ మరోవైపు తన సంపాదనలో సగభాగం పేద ప్రజల సహాయార్థం ఖర్చు చేస్తూ నిరంతర సేవా గుణంతో పరితపిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది…

AP

జగనన్న వసతి దీవెన… తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ

ఈ సందర్భంగా సీఎం వైయస్‌. జగన్‌ మాట్లాడుతూ.. చిక్కటి ఆప్యాయతల మధ్య చెరగని చిరునవ్వుల మధ్య ఇలాంటి ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికి, ప్రతి అవ్వాతాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 9,55,662 మంది పిల్లలకు మంచి చేస్తూ… 8,61,138 తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.912.71 కోట్లు జమ చేస్తున్నాం. చదువు కుటుంబ చరిత్రను…