AP

APUncategorized

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం.గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షను వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.   సోమవారం యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల చేసిన…

AP

హైదరాబాద్‌లో టిడిపి పొలిట్‌ బ్యూరో సమావేశం..

చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పొలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. మొత్తం 17 అంశాలపై చర్చించారు. మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి, ఎన్నికల‌ మేనిఫెస్టో కోసం.. మూడు కమిటీలను వేశారు.పార్టీ కోసం కష్టపడినవారికి గుర్తింపు ఇవ్వడంతో పాటు… 40శాతం టికెట్లు యువతకే కేటాయించాలని నిర్ణయించారు. పొత్తులపై ఎన్నికల టైమ్‌లో చర్చిస్తామని చెప్పారు అచ్చెన్నాయుడు. తాము గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.  …

AccidentAP

టీడీపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే 40 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు..

టీడీపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే 40 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రోజూ ఫోన్లు వస్తున్నాయని.. అయితే పార్టీ చర్చించి ఎవరిని చేర్చుకోవాలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. వైసీపీ సస్పెండ్‌ చేసిన నలుగురు ఎమ్మెల్యేలతో మాతో ఇంకా టచ్‌లోకి రాలేదన్నారు. 40 మంది పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు అచ్చెన్నాయుడు. పొత్తులు కొత్తకాదు.. అయితే పొత్తులపై పార్టీలో ఎలాంటి చర్చా జరగలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలతో కలిసిపనిచేయాలని మాత్రమే…

AP

తిరుమలలో భక్తులకు రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు….

తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. రాబోయే వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్ధం అలిపిరి మార్గంలో 10వేలు,శ్రీవారీ మెట్టు మార్గంలో 5వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తాం..రాబోవు మూడు నెలలు పాటు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం వుంది..వేసవి రద్దీ నేపథ్యంలో మూడు నెలలు పాటు ప్రజాప్రతినిధులు సిపారస్సు లేఖలను…

AP

ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందంతో సీఎం జగన్ భేటీ..

ముఖ్యమంత్రి జగన్ తో ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయింది. భారత్ లో ప్రపంచబ్యాంకు డైరెక్టర్ Auguste Tano Koume నేతృత్వంలో బృందం భేటీ జరిగింది. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఎడ్యుకేషన్‌ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ప్రాజెక్ట్(ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్టులు అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచబ్యాంకు భారత్‌ విభాగానికి డైరెక్టర్ Auguste Tano Koume మాట్లాడుతూ.. ఏపీ రావడం…

AP

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు..

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చామని శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు తెలిపారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్నారు సీఎం. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్దికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు సీఎం. ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు…

AP

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు లో సీబీఐని నిలదీసిన సుప్రీం….

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని సీబీఐని నిలదీసిన సుప్రీం.. విచారణ అధికారిని మార్చాలని పేర్కొంది. ఇంకా విచారణ త్వరగా ముగించలేకపోతే మరో దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని సీబీఐని సుప్రీంకోర్డు ధర్మాసనం ప్రశ్నించింది. ఇక తదుపరి విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా…

AP

ఏపీలో ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె రాజేంద్రప్రసాద్‌ సూచించారు. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ ఎడ్‌సెట్‌ ప్రవేశాలను నిర్వహిస్తోంది.   దరఖాస్తు ప్రక్రియ మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.…

AP

విశాఖలో జీ 20 సదస్సు అన్ని ఏర్పాట్లు పూర్తి..

జీ 20 సదస్సు ద్వారా విశాఖ ఇమేజ్ మరింత పెరుగుతోందన్నారు ఏపీ మంత్రులు. సదస్సు కోసం స్టీల్‌ సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 130 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. కేవలం సుందరీకరణే కాకుండా శాశ్వత నిర్వహణకు చర్యలు చేపట్టామని వివరించారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధానికి తగ్గట్లు అభివృద్ధి పనులు జరిగాయన్న మంత్రులు.. కొత్తగా 5 బీచ్‌లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. G -20 ఏర్పాట్లపై…

AP

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..

టీడీపీకి అమ్ముడుపోయారనే అభియోగంతో ఇటీవలే వైసీపీకి చెందిన నలుగురు శాసనసభ్యులు పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత తెలుగు దేశం పార్టీ తనతోనే బేరసారాలు సాగించిందనన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ నేతలు తనతో బేరం ఆడారని రాపాక వరప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటును అమ్ముకుంటే…