హోం గ్రౌండ్ లో అదరగొట్టిన ఢిల్లీ. కీలక మ్యాచ్ లో బెంగుళూరుపై గెలుపు
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ధాటిగా ఆడింది. ఓపెనర్లు డుప్లేసిస్, విరాట్ కోహ్లీ తొలి వికెట్ కు 82 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ…

