AP

AP

అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ని నేడు కలిశారు..

అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ని నేడు కలిశారు. అంబుల వైష్ణవి గతేడాది జూన్‌లో రాజధానికి రూ.25 లక్షలు, 2019కి ముందు పలుసార్లు కలిపి రూ.25 లక్షలను విరాళంగా అందించారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం ను వైష్ణవి సచివాలయంలో శుక్రవారం కలిశారు.

AP

ఏపీ బడ్జెట్.. ఆ శాఖకు భారీ కేటాయింపులు..

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. మొత్తం రూ. 3.22 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గత పాలకులు ప్రతి శాఖలో ఆర్థిక అరాచకం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుంది.   అప్పు తీసుకునే శక్తి లేని ఏకైరా రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్నారు ఆర్థిక…

AP

న్యాయమూర్తి ముందు పోసాని ఆవేదన..

న్యాయమూర్తి ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి… పోసాని కృష్ణమురళికి 14రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. రాజంపేట సబ్‌జైలుకు తరలించారు పోలీసులు. అయితే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిని 9 గంటల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం నిన్నరాత్రి 9 గంటల 30 నిమిషాలకు రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు ఏడు…

AP

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉండవల్లి పంచాయతీ ఆఫీసు సమీపంలోని ఎంపియుపి స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉండవల్లి పంచాయతీ ఆఫీసు సమీపంలోని ఎంపియుపి స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు #AndhraPradesh

AP

పెదపూడి మండలం గొల్లల మామిడాడ బూత్ నెంబర్ 140 లో, పెదపూడిలో 138,139 పోలింగ్ బూత్ లలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి..

పెదపూడి మండలం గొల్లల మామిడాడ బూత్ నెంబర్ 140 లో, పెదపూడిలో 138,139 పోలింగ్ బూత్ లలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.   ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం NDA నాయకులు, గొల్లల మామిడాడ, పెదపూడి గ్రామాల NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

AP

జనసేన పార్టీ పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా బన్నీ వాసు..!

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మార్చి 14న జరగనున్న విషయం విదితమే. ఈ మేరకు పార్టీ ముహూర్తం కూడా ఖరారు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో దీనిని అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ భావిస్తోంది.   ఈ క్రమంలో ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసుకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయనకు అప్పగించినట్లు ప్రచారం…

AP

వైసీపీ నేత వల్లభనేని వంశీపై గన్నవరంలో మరో కేసు నమోదు..

ఇప్పటికే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరంలో మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో ఇప్పటికే మూడు కేసులు ఆయనపై నమోదయ్యాయి. తాజాగా మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీకృష్ట ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి పోలీసులు మరో కేసు నమోదు చేశారు.   మురళీకృష్ణ, పోలీసుల కథనం ప్రకారం.. మర్లపాలెం శివారులో 18 ఎకరాల్లో పానకాల చెరువు ఉంది. ఆ చెరువులోని కొంత భాగాన్ని 15…

AP

మంగళగిరి వద్ద వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుపై నారా లోకేశ్ సమీక్ష..

మంగళగిరి చినకాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఆసుపత్రి భవన నమూనాపై అధికారులతో మంత్రి సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన నమూనాను అధికారులు వివరించారు.   ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి అని అన్నారు.…

AP

పోసానిపై నాన్ బెయిలబుల్ కేసులు..!

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో ఆయనను ఓబులవారిపల్లె పీఎస్ కు తీసుకురానున్నారు. జనసేన నేత మణి ఫిర్యాదు మేకు ఆయనపై కేసు నమోదయింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. పోసానిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 196, 353…

AP

పోసానిపై వైసీపీ హయాంలోనే ఫిర్యాదు చేశాం… అప్పుడు పట్టించుకోలేదు: జోగిమణి..

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జోగిమణి మాట్లాడుతూ… తమ నాయకుడు పవన్ కుటుంబ సభ్యుల గురించి పోసాని అనుచితంగా మాట్లాడుతుంటే… తాము కూడా అలాగే మాట్లాడాలనుకున్నామని, అయితే అలా మాట్లాడొద్దని పవన్ సూచించారని తెలిపారు. సంస్కారం అడ్డొచ్చి తాము అలా మాట్లాడలేదని… పోసాని ప్రవర్తన సరిగా లేకపోవడం…