ఆలూరు నియోజకవర్గంలో యువగళం 75వ రోజు పాదయాత్ర
టిడిపి యువనేత నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో యువగళం 75వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా దారిలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ జగన్ డ్రామా ట్రూప్ వివేకా హత్య కేసులో అడ్డంగా బుక్కయి రోజుకో కధ చెపుతూ మమ్మల్ని అరెస్ట్ చేయకండి బాబో. అంటూ హైకోర్టును వేడుకొంటోంది. అయితే ఈ డ్రామా ట్రూప్ మొట్టమొదటే చిన్న లాజిక్ మిస్ అయ్యింది. ఒకవేళ గత ఎన్నికలలో అవినాష్ రెడ్డినే అభ్యర్ధిగా నిలబెట్టాలని…

