AP

AP

చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ హస్తిన ప్రయాణం

రాజకీయ బద్ధ శత్రువులు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక చోట కనిపించ బోతున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఇద్దరు సోమవారం హస్తిన ప్రయాణం కడుతున్నారు. ఆ వేదికపై ఎవరి పెరఫార్మెన్సు ఎలా ఉండనుందో ఆసక్తిగా ఉంది. ఒకే సమావేశం ఒకటే ఎజెండా గా సాగే మీటింగ్లో జీ 20కి పనికి వచ్చే పాయింట్స్ మెరుగ్గా ఎవరు ఇస్తారు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. బీజేపీతో పొత్తులకు కూడా బాబు తెరతీయడం ద్వారా వైసీపీకి గట్టి…

APTELANGANA

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, ప్రక్కనే ఉన్న భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, మలక్కా జలసంధి ద్వారా సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో డిసెంబర్ 05 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. డిసెంబర్ 07 ఉదయం…

AP

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనకు సీఎం జగన్మోహన్ రెడ్డి దూరం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనకు సీఎం జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఆయన బదులుగా మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆమెకు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి కార్య్రమాల్లో జగన్ కు బదులుగా ప్రభుత్వ ప్రతినిధిగా అమర్నాథ్ వ్యవహరించనున్నారు. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి టూర్ సందర్భంగా మంత్రి అమర్నాధ్ హోదాను పెంచుతూ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా ఖరారు చేసారు. తొలి సారి మంత్రి అయిన అమర్నాధ్ కు అరుదైన అవకాశం లభించడం…

AP

బెజవాడలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం

బెజవాడలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఆఫీసులు పెట్టి… ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమదేనంటూ ఆర్భాటంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. దీన్ని నమ్మిన నిరుద్యోగులు అప్పు చేసి మరీ డబ్బులు కట్టి ఇరుక్కుపోయారు. విజయవాడ లో అల్ఫబేట్ గ్రూప్ స౦స్ద నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ పెట్టింది. ఐసీడీఎస్‌లో ఉద్యోగాలు అ౦టూ వ౦దల మ౦ది నిరుద్యోగుల ను౦డి రూ. 4 లక్షల ను౦డి…

AP

కొండపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ పై అధికార వైసీపీ కౌన్సిలర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ వినూత్న నిరసన తెలిపాడు. తన డివిజన్లో దోమల మందు కొడుతూ కౌన్సిలర్ చంద్రం నిరసన చేపట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొండపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ పై అధికార వైసీపీ కౌన్సిలర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వార్డులో ఉన్న సమస్యలు చెబుతున్న కమిషనర్ పట్టించుకోవట్లేదని.. గ్రామంలో ఎక్కడ ఏముందో కమిషనర్ కి తెలియదని ఆయన ఆరోపించారు. రెండు సంవత్సరాలుగా కమిషనర్ గా…

APHealth

ఒక్కసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం

ఒక్కసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ తరహా ప్లాస్టిక్ వినియోగంపై భారీ ఎత్తున జరిమానాలు విధించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్యాన్ని సృష్టించే వారే వ్యయాన్ని కూడా భరించాలన్న సూత్రం ఆధారంగా సరికొత్త జరిమానాలను విధించింది. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు…

APPOLITICSTELANGANA

టీఆర్ఎస్ పార్టీకి, వైఎస్సార్సీపీకి మధ్య ట్వీట్ వార్

టీఆర్ఎస్ పార్టీకి, వైఎస్సార్సీపీకి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ఇందులో భాగంగా కవిత ‘కమలం వదిలిన బాణం’ అంటూ షర్మిలపై ఆసక్తికర ట్వీట్ చేసింది. దీనికి కౌంటర్ గా షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన పాదయాత్రను అడ్డుకున్న నేపథ్యంలో మంగళవారం షర్మిల ప్రగతి భవన్ ను ముట్టడించి, అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ…

AP

చంద్రబాబు రోడ్ షో సూపర్ హిట్

ఉభయ గోదావరి జిల్లా ప్రజల నాడి రాజ్యాధికారాన్ని నిర్ణయిస్తుందని రాజకీయ నానుడి. ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎటు వైపు ఉంటే ఆ పార్టీకి అధికారం ఖాయమని చాలా సందర్భాల్లో ప్రూ అయింది. 2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ స్వీప్ చేసింది. ఇప్పుడు కూడా అలాంటి స్పందన జనం నుంచి ఉందని టీడీపీ నేతలు విశ్వసిస్తున్నారు. మూడు రోజుల పర్యటనకు గోదావరి జిల్లాలకు వెళ్లిన చంద్రబాబు తొలి రోజు ఏలూరు జిల్లాలో…

APPOLITICSTELANGANA

YS షర్మిలకి బెయిల్.!

ఉదయం నుంచీ హైడ్రామా నడిచింది. వైఎస్ షర్మిల, పోలీసుల కంట పడకుండా సొంత వాహనంలో ప్రగతి భవన్ వైపు దూసుకెళ్ళగా, అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. వాహనం దిగేందుకు నిరాకరించిన షర్మిలను, వాహనంతో సహా పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సాయంత్రం వైఎస్ షర్మిల సహా, ఈ కేసులో పలువురు నిందితుల్ని పోలీసులు న్యాయస్థానం యెదుట హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై నాంపల్లి కోర్టు, వైఎస్ షర్మిల సహా ఇతర నిందితులకు…

APPOLITICSTELANGANA

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ విషయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ట్వీట్ చేస్తూ సొంత బాబాయ్ కేసును ఇతర రాష్ట్రానికి వెళ్లడం సిగ్గచేటని అన్నారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మృతుడి కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు…