అమరావతిలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్తో సీఎం చంద్రబాబు భేటీ: రూ. 795 కోట్ల అదనపు నిధుల విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతికి విచ్చేసిన కేంద్ర మంత్రితో సీఎం దాదాపు గంటపాటు రాష్ట్రంలోని వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల సంక్షేమానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ సహకారంపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు…

