National

National

ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నా వాయుసేన, నేవీ..! ప్రధానితో భేటీ..!

పహల్గమ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత వాయుసేన (ఐఏఎఫ్) సంసిద్ధత, ప్రభుత్వ ప్రతిస్పందన వ్యూహాలపై ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాయుసేన పరంగా అందుబాటులో ఉన్న ప్రతీకార అవకాశాలపై ప్రధానికి ఆయన వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.   ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో జరిగిన ఈ సమావేశంపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, దేశ భద్రతా పరిస్థితులు, ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతీకార చర్యల…

National

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు..

భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పరస్పర సుంకాలను నివారించేందుకు ఉద్దేశించిన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే తొలి దేశాల్లో భారత్ ఒకటిగా నిలవవచ్చని వాన్స్ పేర్కొన్నారు.   భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రస్తావిస్తూ, ఆయన సమర్థవంతంగా చర్చలు జరపగలరని కొనియాడారు.…

NationalUncategorized

ఏం జరగబోతుందో తెలియదు.. ఇరుదేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి: ఫరూక్ అబ్దుల్లా..

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన వేళ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు, సీనియర్ నేత ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు.   మీడియాతో మాట్లాడిన ఫరూక్‌ అబ్దుల్లా, పహల్గామ్ దాడి అనంతరం నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. “రేపు ఏమి జరగబోతుందో ఎవరికీ తెలియదు.…

National

కాంగ్రెస్ పార్టీపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు..!

ఎడ్లబండి కింద వెళ్లే కుక్క తానే బరువు మోస్తున్నట్లుగా భావిస్తుంటుందని, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో వాగ్దానాలు తప్ప వాస్తవాలు ఏమీ లేవని అన్నారు. బీసీలకు న్యాయం చేకూర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన ఊసే ఎత్తలేదని, ఇప్పుడు దానిపై…

National

పాక్ కవ్వింపు చర్యలు.. పాకిస్థాన్ సైన్యానికి భారత్ వార్నింగ్..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత వారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓలు) హాట్‌లైన్‌లో చర్చలు జరిపారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం పదేపదే రెచ్చగొట్టే విధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇలాంటి చర్యలను మానుకోవాలని భారత్ ఈ సందర్భంగా పాక్‌ను గట్టిగా హెచ్చరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.   గత ఆరు రోజులుగా…

National

దాయాది దేశం ప్రకటన.. సైనిక చర్యకు భారత్ రెడీ..!

పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో అసలైన వణుకు మొదలైందా? భారత్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని భయంతో వణికిపోతుందా? తమ మీద భారత్ దాడి చేయడం ఖాయమని ఎందుకు అంటున్నారు పాక్ మంత్రులు? ఈ లెక్కన ఉగ్రదాడి గురించి వారికి ముందే తెలుసా? జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. భారత్ మరో 24 నుండి 36 గంటల్లో పాకిస్తాన్‌పై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందన్నారు ఆదేశ సమాచార శాఖమంత్రి అట్టాఉల్లా తారర్. దీనికి సంబంధించి రహస్య సమాచారం…

National

భారత్ మాపై దాడి చేయడం ఖాయం: పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు..

కశ్మీర్‌లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ వైపు నుంచి సైనిక దాడి జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి తర్వాత ఇరు అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.   గత వారం ఏప్రిల్ 22న కశ్మీర్‌లో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పౌరులపై జరిగిన ఈ దారుణ…

National

పహల్గామ్‌ ఉగ్రదాడి.. పాక్‌పై భార‌త్ తీసుకున్న ఏడు క‌ఠిన చ‌ర్య‌లివే..!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ఉగ్ర‌దాడిలో పాకిస్థాన్ హ‌స్తం ఉంద‌ని ఆరోపిస్తూ దాయాది దేశంపై భార‌త్ క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఇప్పటివ‌ర‌కు పాక్‌పై ఏడు చర్యలు తీసుకుంది. దాడికి సంబంధించిన సరిహద్దు సంబంధాలను చర్చించిన తర్వాత భార‌త‌ ప్రభుత్వం బుధ‌వారం ఐదు చర్యలు తీసుకోగా, గురువారం మరో రెండు చర్యలు తీసుకుంది.   పహల్గామ్‌ ఉగ్రవాద దాడి నేప‌థ్యంలో పాక్‌పై భార‌త్‌ తీసుకున్న ఏడు…

National

కశ్మీర్ ఉగ్రదాడి.. భారత్ సంచలన నిర్ణయం..!

పహల్‌గామ్ లో దారుణమైన ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఉగ్రవాదులు కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన యాత్రికుల్ని టార్గెట్‌గా మారణహోమం సృష్టించడం దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది.   అయితే, పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పాకిస్థాన్ తీరుపై భారత ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఆ దేశంలో దౌత్య సంబంధాలను పూర్తి తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని…

National

లిక్కర్ స్కాంలో రాజ్ కెసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కెసిరెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక సుమారు 12:30 గంటలకు న్యాయాధికారి భాస్కరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు కెసిరెడ్డిని విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు.   అంతకుముందు, సిట్ అధికారులు రాజ్ కెసిరెడ్డికి ప్రభుత్వ ఆసుపత్రిలో…