National

National

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు..! కీలక లోహాల ఎగుమతి నిలిపివేత..!

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో, కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత లోహాలు, అయస్కాంతాల ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు సహా అనేక కీలక రంగాలకు అత్యవసరమైన ఈ ముడిసరుకుల సరఫరాను నియంత్రించడం ద్వారా పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఇరుకున పెట్టేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోంది.   ఎగుమతుల కోసం చైనా ప్రభుత్వం సరికొత్త నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.…

National

బెంగాల్ ఆందోళనలు హింసాత్మకం, ముగ్గురు మృతి, కేంద్ర బలగాల ఎంట్రీ..!

వక్ఫ్ సవరణ చట్టాని(Waqf Act)కి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షిదాబాద్, మాల్దా, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను నిర్బంధించారు. కొందరు ఆందోళనకారులు హిందువుల నివాసాలు, వాహనాలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. షాపులు, దుకాణాల్లో దూరిన కొందరు దొంగతనాలకు తెగబడ్డారు.   ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు ధృవీకరించారు. ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. కాల్పుల్లో…

National

తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు..!

తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు ఖరారు అయింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన చేశారు. పళనిస్వామి నాయకత్వంలోనే అన్నాడీఎంకే ఎన్నికలకు వెళుతుందని ఆయన స్పష్టం చేశారు.   అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి చెన్నైలో అమిత్ షా విలేకరుల సమావేశం నిర్వహించారు. 1998లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలో బీజేపీ,…

APNational

ఇన్ స్టా ప్రేమాయణం..! అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.. !

అమ్మాయిదేమో అమెరికా.. అబ్బాయి ఉండేదేమో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఇద్దరి మధ్యా వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరాన్ని ఇన్ స్టాగ్రామ్ చెరిపేసి ఆ ఇద్దరినీ కలిపింది. హాయ్ అనే మెసేజ్ తో మొదలైన పరిచయం పెళ్లి పీటల వరకూ చేరుకుంది. 14 నెలల పాటు ఆన్ లైన్ లోనే ప్రేమించేసుకున్న ఈ జంట త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. పెళ్లి కోసం తల్లితో కలిసి ఆ యువతి అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చింది. ప్రస్తుతం…

National

ఉప ప్రధానిగా నీతీశ్ కుమార్..?

బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ ఉప ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని ఓ సమావేశంలో తెలిపారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ విషయం హాట్టాపిక్గా మారింది.   జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ను ఉపప్రధానిగా చూడాలనుకుంటున్నానని బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్చౌబే అన్నారు. “NDA…

National

ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ రాణాకు 18 రోజుల కస్టడీ..

ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణాకు ఎన్ఐఏ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. రాణాను గత రాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఎన్ఐఏ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ వాదనలు వినిపించారు.   రాణా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్‌దేవా వాదించారు. రాణాను తమకు 20 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా…

National

తాలిబన్ల మరో వికృత చర్య.. జుట్టు అందంగా అలంకరించుకున్నా జైలుకే..!

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు ఇప్పుడు పురుషులపైనా కత్తిగట్టారు. ఆధునిక పోకడలు పోయి జుట్టును అందంగా కత్తిరించుకుంటే ఇక ఊచలు లెక్కపెట్టుకోవాల్సిందే. జుట్టును అందంగా కత్తిరించుకున్న పురుషులతో పాటు, వారికి క్షవరం చేసిన క్షురకులను కూడా అరెస్ట్ చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.   కట్టుబాట్ల పేరుతో ఇప్పటి వరకు మహిళలపై అనేక ఆంక్షలు విధించిన తాలిబన్లు ఇప్పుడు పురుషులపైనా పడ్డారని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్ ప్రభుత్వంలోని ‘సదాచార, దురాచార నిరోధ మంత్రిత్వశాఖ’ చర్యల వల్ల…

National

అమెరికా రోడ్ల కంటే మన రోడ్లను అందంగా తీర్చిదిద్దుతాం: నితిన్ గడ్కరీ..

మన దేశంలోని రోడ్లను అమెరికా రహదారుల కంటే అందంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అమెరికా ధనిక దేశం కాబట్టి రోడ్లు బాగుంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారని… కానీ, రోడ్లు బాగున్నందుకే అమెరికా ధనిక దేశం అయిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ఒక సందర్భంలో అన్నారని చెప్పారు. దేశ అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రోడ్లు బాగున్న…

National

వక్ఫ్ సవరణ బిల్లు-2025పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, మజ్లిస్..

వక్ఫ్ (సవరణ) బిల్లు-2025ను సవాల్ చేస్తూ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ఆమోదం పొందిన విషయం విదితమే.   ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ బిల్లు (సవరణ) లోని నిబంధనలు ముస్లిం సమాజం యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.   కేంద్ర ప్రభుత్వం…

National

మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు భారీ షాక్..! ఏమైందంటే..?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ పరిధిలో ఉద్యోగాలు పొందిన 25 వేల మందికి పైగా టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. నియామక ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా, కళంకితమైనదిగా ఉందని పేర్కొంది. దానికి విశ్వసనీయత, చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది.   హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని సుప్రీంకోర్టు…