National

APNational

పవన్ పొత్తు ప్రకటన- విజయనగరం సభలో జగన్ స్పీచ్ కోసం వెయిటింగ్..!!

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి సన్నద్ధమౌతోంది. అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడానికి సన్నాహాలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అవి అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం వైఎస్ జగన్.. శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలను ప్రారంభిస్తారు. అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే వేదికపై నుంచి రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో మెడికల్ కాలేజీలను వర్చువల్…

National

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కేఆర్ పీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మరోసారి ప్రజల ముందు తలక్కుమని మెరిశారు.

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కేఆర్ పీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మరోసారి ప్రజల ముందు తలక్కుమని మెరిశారు. గంగావతి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన గాలి జనార్దన్ రెడ్డి ఆ నియోజక వర్గం ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.   గంగావతి నియోజక వర్గంలోని హీరేహళ్ల డామ్ కు బాగిన (మొక్కులు, గంగమ్మ తల్లికి సారె)…

National

యూపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్..

యూపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్ లో వినిపించే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ లకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన యూపీ కేబినెట్ భేటీలో బుందేల్ ఖండ్ లో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేలా ఓ ప్రత్యేక సంస్ధ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ సంస్ధ ఏర్పాటు కాబోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా తరహాలో వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతాన్ని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి…

National

ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం

న్యూఢిల్లీ: ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం కాబోతోన్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పార్లమెంట్ సమావేశాలు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే దిశగా కేంద్రం ఈ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు, బిల్లులను ప్రవేశపెడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించారు.…

National

ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాకు చేరుకున్నారు

ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాకు చేరుకున్నారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో కిమ్ జోంగ్ ఉన్ రష్యాతో ఆయుధ ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని అమెరికా ఆందోళ వ్యక్తం చేసింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ప్రకారం, కిమ్ ఈ వారంలో రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతంలో పేర్కొనబడని ప్రదేశంలో పుతిన్‌ను కలుస్తారు. పుతిన్ ప్రస్తుతం ఉత్తర కొరియా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫార్…

National

బెంగళూరు: ఎంపీ పదవికి అనర్హత వేటు

బెంగళూరు: ఎంపీ పదవికి అనర్హత వేటు వేయకుండా చూడాలని దాఖలైన దరఖాస్తును హైకోర్టు తిరస్కరించడంతో కర్ణాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు నిరాశ ఎదురైంది. హాసన్ ఎంపీ పదవికి తనపై అనర్హత వేటు వేసిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ జేడీఎస్ యువనేత. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ప్రజ్వల్ రేవణ్ణ పిటిషన్‌ను విచారించి కోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు తీర్పును ప్రకటించారు. తాను ఎంపీ…

National

రెండింటిలో ఏ పేరు పెట్టినా ఆమోదయోగ్యమే.. రాహుల్ గాంధీ..

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పారిస్‌లో విద్యార్థులు, విద్యావేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిజెపిపై విరుచుకుపడ్డారు. పాలక పక్షం ఎలాగైనా అధికారం పొందాలని చూస్తుందని ఆరోపించారు. దేశం పేరు చుట్టూ జరుగుతున్న చర్చపై ప్రశ్నించినప్పుడు.. భారతదేశం, భారత్ రెండూ రాజ్యాంగంలో నమోదు అయ్యాయని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం విచిత్రమైన మార్గాల్లో వ్యవహరిస్తోందని, ఎందుకంటే అవి ప్రతిపక్షాల ఇండియన్ నేషనల్ పేరుతో ఉన్నాయని చెప్పారు. డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A.) వారికి చికాకు తెప్పిస్తుందన్నారు. “మనకు నచ్చినా నచ్చకపోయినా…

National

హైదరాబాద్ వ్యాప్తంగా 22 వేల మ్యాన్ హోళ్లకు గ్రిల్స్ ఏర్పాటు..

హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది. అయితే పట్నం వర్షం పడితే భయమే.. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందో తెలియదు. దీంతో వర్షం తర్వాత బయటకు వెళ్లడానికి చాలా మంది భయపడతారు. ఇందుకు చాలా మంది మ్యాన్ హోళ్లలో పడి చనిపోయారు. ముఖ్యంగా పిల్లలు ఈ మ్యాన్ హోళ్ల పడి చనిపోతున్నారు. మొన్న కురిసిన భారీ వర్షానికి ప్రగతి నగర్ లో ఓ బాలుడు తెరిచి ఉన్న మ్యాన్ హోల్ పడి మృతి చెందాడు. గత…

APNational

నరేంద్రమోడీ, అమిత్ షాకు తెలియకుండానే జరిగిందా?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుణ్ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కు సంబంధించి వాదనలు ముగిశాయి. బెయిల్ వస్తుందా? రాదా? అనే విషయంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బాబు అరెస్ట్ పై ఏపీలో టీడీపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియకుండా జరగదని పార్టీ…

National

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తుపై తొలిసారిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తుపై తొలిసారిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. అన్ని అంశాల చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, సీట్ల కేటాయింపుపై ఇంకా చర్చ జరగలేదని, దాని గురించి తర్వాత మాట్లాడతామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడ్యూరప్ప బీజేపీ-జేడీఎస్ పొత్తుపై మాట్లాడారు. యడియూరప్పకు తాను కృతజ్ఞుడిని అని మాజీ సీఎం హెచ్ డీ.…