National

National

జనగణన, డీలిమిటేషన్ అప్పుడే: మహిళా బిల్లుపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పలు పార్టీలు రాజకీయాలు చేశాయని.. కానీ, బీజేపీ, నరేంద్ర మోడీకి అలా కాదని అన్నారు. మహిళలకు తగిన ప్రాధాన్యతను ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నామని చెప్పారు. జనగణన, డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు పట్టుబట్టడంపైనా అమిత్ షా స్పందించారు. వచ్చే(2024) సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో జనాభా…

National

పార్లమెంటులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది

న్యూఢిల్లీ: పార్లమెంటులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు(women’s reservation bill)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. నారీ శక్తి అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఈ బిల్లుపై దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం బుధవారం రాత్రి న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 454 మంది…

CINEMANational

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన హీరో విశాల్..

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే ఇలా జరిగిందంటే తనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటని, తలుచుకుంటేనే భయమేస్తుందని హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా సినిమా మార్క్ ఆంటోనీ సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్ వచ్చిన హీరో విశాల్ చంద్రబాబు అరెస్టు గురించి…

APNational

ముత్యపుపందిరి వాహనంపై కాళీయమర్ధన అలంకారంలో శ్రీ మలయప్ప !

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు తిరుమలలో ఉదయం, రాత్రి శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవలు నిర్వహిస్తున్నారు. తిరుమల మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరగుతున్న వాహన సేవలు కళ్లారా చూడటానికి వేలాది మంధి భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయమర్ధన అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన…

National

రూ.50 కోట్ల లోన్ ఫ్రాడ్: సౌమ్య పట్నాయక్ సంబాద్ పత్రికపై ఈవోడబ్ల్యూ అధికారుల దాడులు

భువనేశ్వర్: మీడియా బారన్ సౌమ్య రంజన్ పట్నాయక్ యాజమాన్యం, సంపాదకత్వంలో ఉన్న ఒడియా వార్తాపత్రిక సంబాద్ రూ. 50 కోట్ల మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. వివిధ బ్యాంకుల నుంచి కనీసం రూ. 50 కోట్ల రుణం తీసుకున్న ఈ సంస్థ.. “నిశ్చయంగా వ్యవస్థీకృత రుణ కుంభకోణం” నడిపిందని ఒడిశా పోలీసు ఆర్థిక నేరాల విభాగం(EOW) పేర్కొంది . సంస్థ ఉద్యోగుల నకిలీ వేతన ధృవీకరణ పత్రాలను ఉపయోగించినట్లు తెలిపింది. ఈఓడబ్ల్యూ.. సంబాద్ కార్యాలయంలో సోమవారం సోదాలు…

National

15 రోజుల పాటు తమిళనాడుకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం డిసైడ్

మండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర్ డ్యామ్ (కేఆర్ఎస్) నుంచి వచ్చే 15 రోజుల పాటు తమిళనాడుకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. మంగళవారం తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేసింది. సోమవారం రాత్రి నుంచే నీటి విడుదల ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.   సెప్టెంబరు 13 నుంచి అమలులోకి వచ్చే 15 రోజుల పాటు 5,000 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగించాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కర్ణాటకను ఆదేశించడంతో…

National

నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ సోమవారం చారిత్రక ప్రకటన చేసింది.   మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.   ఈ బిల్లు ప్రకారం.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయబడతాయి. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు.…

NationalWorld

యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలోకి ‘హోయసల’ ఆలయాలు

ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారతదేశంలోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటకలోని హోయసల ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో(UNESCO) తాజాగా వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలూర్, హలేబీడ్, సోమనాథ్‌పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతున్న 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతన్ కు ఈ గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలకు ప్రపంచ వారసత్వ…

APNational

ఉప్పందించిన కేంద్రం, చంద్రబాబు కేసు వెనుక – ఢిల్లీ టు అమరావతి..!!

చంద్రబాబు కేసులో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు వైసీపీ వర్సస్ టీడీపీ పొలిటికల్ వార్ గా టర్న్ తీసుకుంది. జనసేనాని పవన్ సైతం ఇది సీఎం జగన్ కక్ష్య పూరిత చర్యగా ఆరోపించారు. కానీ, ఈ కేసులో సీఐడీ కంటే ముందుగా కేంద్ర విచారణ సంస్థలు అనేక అంశాలు తేల్చాయి. ఈ స్కిల్ కుంభకోణానికి సంబంధించి కేంద్ర సంస్థలే ఉప్పందించాయని సమాచారం. కేంద్రం సంస్థలు ఇచ్చిన నివేదికలే కీలకంగా మారాయి.…

National

మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి

మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరికొందరు వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్ పోలీసుల అదుపులో కీలక వ్యక్తులు ఉన్నట్టుగా సమాచారం. అంతేకాదు ఈ డ్రగ్స్ కేసులో బేబీ సినిమా పేరు కూడా తెరపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది కొద్దిరోజుల క్రితం మాదాపూర్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్దనుండి…