జనగణన, డీలిమిటేషన్ అప్పుడే: మహిళా బిల్లుపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పలు పార్టీలు రాజకీయాలు చేశాయని.. కానీ, బీజేపీ, నరేంద్ర మోడీకి అలా కాదని అన్నారు. మహిళలకు తగిన ప్రాధాన్యతను ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నామని చెప్పారు. జనగణన, డీలిమిటేషన్పై ప్రతిపక్షాలు పట్టుబట్టడంపైనా అమిత్ షా స్పందించారు. వచ్చే(2024) సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో జనాభా…

