National

National

2021లో యూట్యూబ్ ఇండియా మెుత్తం 7,50,000 ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానమైన జాబ్స్

దేశంలో యూట్యాబ్ ద్వారా ఉపాధి పొందే వారు క్రమంగా పెరుగుతోన్నారు. కొందరైతే యూట్యూబ్ ద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు.దేశ జీడీపీకి యూట్యూబ్ ద్వారా రూ.6800 కోట్ల ఆదాయం వస్తోందట. యూట్యూబ్ తో దాదాపు 7 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. 2021లో యూట్యూబ్ ఇండియా మెుత్తం 7,50,000 ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానమైన జాబ్స్ సృష్టించిందని పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. యూట్యూబ్ ఆదాయ వనరుగా మార్చుకున్న వారు.. అందులో ఎక్కువ డబ్బులు సంపాదించాలని రకరకాల వీడియో చేస్తున్నారు.…

National

సహజీవనంలో ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు

సహజీవనంలో ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సహజీవనాలు వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. సహజీవనం నుంచి బయటికి వచ్చిన తర్వాత వివాహానికి భాగస్వామిని కనుగొనడం మహిళలకు చాలా కష్టమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సహజీవ భావన ఆరోగ్యకరమైన సమాజానికి లక్షణం కాదని హైకోర్టు పేర్కొంది. “భారతదేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి క్రమబద్ధమైన రూపకల్పన ఉంది. ప్రతి సీజన్లో…

National

అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెడితే రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదు. దీన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తరువాతే.. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా పడొచ్చా? లేక షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయా?…

National

మనీ లాండరింగ్‌పై ఈడీ ఎందుకు మౌనం

ఏడాది క్రితం ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రశ్నించారు. మనీ లాండరింగ్‌పై ఈడీ ఎందుకు మౌనంగా ఉందని నిలదీసారు.రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుంటే..మనీలాండరింగ్‌ జరిగిందని క్లియర్‌గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని కేంద్రం బట్టబయలు చేయాలని సజ్జల డిమాండ్ చేసారు. మనీలాండరింగ్‌ : చంద్రబాబు వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగిందని క్లియర్‌గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా…

National

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతి శనివారం రాత్రి 9.30 గంటలకు వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ బయలుదేరుతున్నారు. అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలుసుకుంటారు. ఈనెల 12వ తేదీన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. యూకే పర్యటనకు ప్లాన్ చేసుకొని అనుమతివ్వాలంటూ కోర్టును కోరారు. సెప్టెంబరు 2వ తేదీ నుంచి 12వ తేదీ…

National

బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే నేతలను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం

బెంగళూరు/హావేరి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 20 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించాలని బీజేపీ సిద్దం అవుతోంది. బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే నేతలను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. హవేరి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని రంగంలోకి దింపుతున్నారని తెలిసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. కొత్త అభ్యర్థి కోసం అన్వేషణలో…

National

చంద్రయాన్ 3.. . వాట్ నెక్స్ట్: తెరపై సంచలన `మిషన్`

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది. రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (లిబ్స్), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. ల్యాండర్ మాడ్యూల్ పేలోడ్స్ ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ…

National

గత కొద్ది రోజులుగా టమాట ధర భారీగా తగ్గిపోయింది.

గత రెండు మూడు నెలల క్రితం క్రితం వరకూ టమాటతోపాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులను బెంబేలెత్తించాయి. అయితే, గత కొద్ది రోజులుగా టమాట ధర భారీగా తగ్గిపోయింది. దీంతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా పడిపోయాయి. పంటల సప్లై పెరగడంతో ఇది సాధ్యమైంది. దీంతో కూరగాయలు కొనుగోలు చేసే వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో పంట పండించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల క్రితం వరకు కిలో…

National

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది. వైఎస్సార్ వర్దంతి నాడు షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ తప్పు లేదనిపిస్తోందని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ పైన సోనియాకు అభిమానం ఉందన్నారు. ఇక, షర్మిల పాలేరు నుంచి పోటీకి హామీ లభించిందనే ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అటు ఖమ్మం..ఇటు బెంగళూరు కేంద్రంగా ఆసక్తి కర రాజకీయం మొదలైంది. షర్మిల నిర్ణయం కీలకం కానుంది. సోనియాతో భేటీలో క్లారిటీ : వైఎస్ షర్మిల…

National

యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక రంగాలపై దృష్టి

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్న తరుణంలో యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక రంగాలపై దృష్టిసారిస్తోంది. అభివృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం యోగీ .. తాజాగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరుతో నడుస్తున్న అటల్ రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించారు. వాటి పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ విలువలతో గురుకుల విధానంలో నడుస్తున్న ఈ స్కూళ్లపై ప్రశంసల జల్లు కురిపించారు. అటల్…