National

National

ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: తెలంగాణ భవన్ ప్రాంగణంలో మంచిర్యాలకు చెందిన ఆరిజిన్ డెయిర్ సీఈవో బోడపాటి శేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆమెను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉన్నట్లు తెలిసింది. శేజల్ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మానసికంగా, లైంగికంగా ఎమ్మెల్యే చిన్నయ్య వేధిస్తున్నాడని ఆరోపించింది.రెండ్రోజుల…

APNationalTELANGANA

టీడీపీ ఆధ్వర్యంలో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్రని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారం అవ్వడానికి అసెంబ్లీ నుంచి మొట్టమొదటి ప్రతిపాదనలు ఇచ్చింది చంద్రబాబునాయుడు అని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, యువత కలలుగన్న తెలంగాణ రాలేదని, నీళ్లు, నిధులు, నియామకాల…

National

ఆర్గానిక్ ఫుడ్స్‌పై ప్రజలకు పెరుగుతున్న ఆసక్తి.. భవిష్యత్తులో ఫుడ్ క్లీనింగ్ ఇండస్ట్రీదే హవా..!

భారతీయుల ఆహారపు అలవాట్లను కరోనా పూర్తిగా మార్చేసింది. కరోనాకు ముందు చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌పై మక్కువ చూపిన వారు ఇప్పుడు సహజంగా పండించిన ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారు. దేశంలో ‘క్లీన్ ఫుడ్'(పరిశుభ్రమైన ఆహారం)పై ప్రజలకు అవగాహన పెరిగిపోయింది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాల్సిందేనని నిశ్చయానికి వస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా రానున్న కాలంలో క్లీన్ ఫుడ్ ఇండస్ట్రీ(Clean food industry) ఓ వెలుగు వెలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.…

National

తిరుపతిలో అపశృతి.. గోవిందరాజస్వామి ఆలయం ముందు ప్రమాదం.. ఒకరి మృతి

తిరుపతిలో(Tirupati) ఊహించని అపశృతి చోటు చేసుకుంది. తిరుపతిలోని గోవిందరాజస్వామి (Govindaraja Swamy Temple) ఆలయం ముందు ఉన్న పెద్ద మర్రి చెట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వందల ఏళ్ల నాటి మర్రి చెట్టు కూలిపోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇది ఊహించని ప్రమాదం కావడంతో ప్రాణనష్టం సంభవించినట్టు తెలుస్తోంది.…

National

నిరుద్యోగులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. పదో తరగతి అర్హతతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారం మసాజ్ థెరపిస్ట్(Massage Therapist) పోస్టుల భర్తీ కోసం SAI అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వచ్చే నెల జూన్ 11లోపు ఇందుకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలు, ఎంపిక ప్రక్రియ, జీతభత్యాలు వంటి వివరాలు పరిశీలిద్దాం. ఖాళీల వివరాలు మసాజ్ థెరపిస్ట్-9…

National

ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు షాక్!

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొందరికి తీపికబురు అందించింది. అలాగే ఇంకొంత మందికి ఝలక్ ఇచ్చింది. దీని వల్ల బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి, తీసుకోవాలని భావించే వారిపై ప్రభావం పడనుంది. ఇంకీ బ్యాంక్ (Bank) ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ (EMI) భారం…

NationalTELANGANA

విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నం

విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోంది అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలి.. విభజన సమస్యలపై పట్టింపులకు పోవద్దు.. లోక్ సభ స్థానాలు పెంపు రాజ్యాంగ పరమైన ప్రక్రియ అని ఆయన అన్నారు. పునర్విభజన చట్టం ఉంది.. దక్షిణ భారత్ కు చెందిన రాష్ట్రాలపై సైతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని తెలిపారు. సౌత్- నార్త్ కు లింక్ పెట్టొద్దు…

APNational

విశాఖలో సుపారీ గ్యాంగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో ఓ సుపారీ గ్యాంగ్ గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్ క్రైమ్ పోలీసులు ఆ సుపారీ గ్యాంగ్‌ను అర్థరాత్రి పట్టుకున్నారు. న్యూకాలనీ లక్ష్మీరాయల్ హొటల్‌లో రూమ్ నంబర్ 105లో ఆ ముఠా ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో.. పోలీసులు ఓ ప్లాన్‌తో రంగంలోకి దిగి, నిందితులకు అనుమానం రాకుండా హోటల్‌లో ఎంట్రీ ఇచ్చి, వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురి సభ్యులు ఉండగా.. వారిని అరెస్ట్ చేశారు. నిందితులందరూ మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. వీళ్లు…

National

నవీన్ పట్నాయక్: ఒడిషా అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన సూపర్ సీఎం

భువనేశ్వర్: ఈరోజు ఒడిశా రాజకీయాలకే కాదు దేశానికి కూడా ముఖ్యమైన రోజు. నవీన్ పట్నాయక్, దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మాస్ లీడర్, 2019 లో ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు మరియు అదే రోజున 5వ సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ నెరవేర్చిన ఆయన ఇప్పుడు 5వ దఫా పాలనకు 4 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెంది కొత్త శకానికి చేరుకుంది. 20…

National

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు: బ్లూటూత్‌తో పరీక్ష రాశారు, నలుగురి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది. వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్(డీఈ) రమేష్ తోపాటు ప్రశాంత్, మహేశ్, నవీన్ అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నపత్రాలను డీఈ రమేష్ విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్…