కేజ్రివాల్ కు అండగా కాంగ్రెస్ ? ఢిల్లీ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించాలని నిర్ణయం..
ఢిల్లీలో ఆప్ సర్కార్ కు, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కూ మధ్య జరుగుతున్న పోరుకు ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దీని ప్రకారం హోంశాఖ మినహా మిగిలిన అంశాల్లో ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని తేల్చిచెప్పింది. దీంతో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అమలుకాకుండా చూసేందుకు కేంద్రం పార్లమెంటులో ఓ బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీలో సేవలపై పెత్తనాన్ని లెఫ్టినెంట్ గవర్నర్…

