National

National

మిలటరీ, పారా మిలటరీ మధ్య ఘర్షణల్లో 200 మందిమృతి, 1800 మందికి గాయాలు

అంతంత మాత్రంగా సూడాన్ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిపోతోంది. సైన్యం, పారామిలిటరీల మధ్య జరుగుతున్న పోరులో దేశం అతలాకుతలమవుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 200 మంది మృతి చెందగా 1800 మంది గాయాలపాలయ్యారు. ఇందులో అత్యధికులు పౌరులే ఉన్నారు.మరణించిన వారిలో పిల్లలు, స్త్రీలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2021 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF)కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్…

National

సూడాన్ పోరులో 400 మందికి పైగా మరణం , 3,500 మందికి గాయాలు

సూడాన్ లో మిలటరీ, పారా మిలటరీకి మధ్య జరుగుతున్న సాయుధ పోరులో ఇప్పటి వరకు 413 మంది మరణిం చారని 3,500 మంది తీవ్ర గాయాలపాలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.   WHO ప్రతినిధి మార్గరెట్ హారిస్ UN విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,ఈ పోరులో పిల్లలు అధిక మూల్యాన్ని చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. కనీసం తొమ్మిది మంది పిల్లలు మరణించగా,50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఆమె చెప్పారు. ఏప్రిల్ 15 నుండి ఇప్పటి వరకు…

National

భారత్ కి గుడ్ బై.. తిరిగి రాలేమంటున్న ప్రవాసులు

ప్రవాస భారతీయులంటే.. ఆరు నెలలకో, ఏడాదికో ఒకసారి భారత్ కి వచ్చి కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని చూసి వెళ్లేవారు. ఇదంతా గతం. ఇప్పుటి ఎన్నారైలు నేరుగా కుటుంబంతోనే ఫ్లైటెక్కుతున్నారు. అక్కడికి వెళ్లాక ఇక తిరిగి రాలేమంటున్నారు. భారత పౌరసత్వం వదిలేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కుటుంబంతో సహా విదేశాల్లోనే స్థిరపడిపోవాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఏడాదికేడాది భారత్ ని వీడిపోతున్న ప్రవాసుల సంఖ్యలో గణనీయమైన మార్పు వస్తోంది. విద్య,…

CINEMANationalWorld

థాయ్‌లాండ్ లో గ్యాంబ్లింగ్.. చికోటి ప్రవీణ్ సహా 83 మంది ఇండియన్స్ అరెస్ట్

గ్యాంబ్లింగ్ కింగ్ చికోటీ ప్రవీణ్ సహా మొత్తం 93 మంది భారతీయులను గ్యాంబ్లింగ్ ఆడుతుండగా థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టాయాలోని ఆసియా పట్టాయా హోటల్‌లో అనేక మంది భారతీయులు అనధికారికంగా గ్యాంబ్లింగ్ ఆడుతున్నారన్న సమాచారం మేరకు అర్ధరాత్రి థాయ్ లాండ్ పోలీసులు ఆ హోటల్ పై దాడి చేశారు. ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్‌లో గదులు బుక్ చేసి, ఆ హోటల్ కాన్ఫరెన్స్ రూ‍ంలో జూదం ఆడుతున్నారు. పోలీసులను చూడగానే పారిపోవడానికి…

National

భారత్ లో ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ 4 గంటల వేతనం ఒక కార్మికుడి సంవత్సరం వేతనం కన్నా ఎక్కువ

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు అంతకంతకూ దిగజారుతుండగా, టాప్ ఎగ్జిక్యూటివ్ లు పైపైకి ఎగబాకుతున్నారు. కార్మికుల వేతనాలు తగ్గుతుండగా టాప్ ఎగ్జిక్యూటివ్ ల జీతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత దేశంలో ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ నాలుగు గంటలు చేసే పనికి సంపాదించే వేతనం సగటు కార్మికుడు సంవత్సరమంతా చేసినపనికి పొందే వేతనం కన్నా ఎక్కువగా ఉంది. భారతదేశం, యుకె, యుఎస్, దక్షిణాఫ్రికాలో 2022లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు 9% పెరగగా, అదే…

National

కర్ణాటక ఎన్నికల వేళ ఏకంగా పార్టీలకే ఫైనాన్స్..

చాలా పార్టీలకు, ప్రముఖ ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఈయన ఫైనాన్స్ చేస్తాడని.. ఎన్నికల్లో గెలుపు కోసం వారికి ఆర్థిక సాయం చేసి గెలిచాక వడ్డీతో వసూలు చేసుకుంటాడని ఓ ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది.   Karnataka Elections 2023 : ప్రముఖ పత్రికాధినేత తన ఫైనాన్స్ వ్యాపారంతో బాగా సంపాదించాడని పేరుంది. ప్రజల నుంచి చిట్టీల పేరుతో వేల కోట్లు వసూలు చేసి.. వడ్డీలకు వడ్డీలు తిప్పి బాగా లబ్ధి పొందాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ…

National

బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్ – మే నెలలో 12 రోజుల సెలవు

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెల ముగిసింది. మే ఒకటో తేదీ సోమవారం నుంచి మొదలైంది. ఈ నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ విషయంలో బ్యాంకు ఖాతాదారులు అలెర్ట్‌గా ఉండాలి. బ్యాంకు పనులకు వెళ్లేపని అయితే, ఈ సెలవులు చూసుకుని బ్యాంకులకు వెళ్లాలని అధికారులు సలహా ఇస్తున్నారు. ఆర్బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం 12 రోజుల సెలవుల్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులు పనిచేయవు.…

National

కేరళ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ వివాదం

కేరళ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ వివాదం సాగుతోంది. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ చిత్రంపై స్పందించారు. ఆ చిత్ర పోస్టర్‌ను షేర్ చేసిన ఆయన.. ‘ఇది మీ కేరళ కథ కావొచ్చు. మా కేరళ కథ మాత్రం కాదు’ అంటూ చిత్ర నిర్మాతలను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. కేరళలో కొన్నేళ్లుగా ’32 వేల మంది’ మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి…

National

కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు గంగారపు కిషన్ రెడ్డి ఆదివారం స్వల్ప అస్వస్థత

కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు గంగారపు కిషన్ రెడ్డి ఆదివారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో నొప్పిగాను, అస్వస్థతగా ఉండటంతో ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఛాతి భాగంలో నొప్పిగా అనిపించడంతో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో మంత్రి కిషన్ రెడ్డిని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఈ క్రమంలో ఆయనకు కార్డియోన్యూరో సెంటర్‌ల పలు రకాలైన…

National

పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ

పార్వతీపురం మన్యం జిల్లా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ముగింపు సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని, నాయకులను దుయ్యబడుతూ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పేదలకు, బడుగు, బలహీన వర్గాలకి,రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుంటే తెలుగుదేశం నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చంద్రబాబునాయుడు అంటూ మండిపడ్డారు.