National

National

పబ్‌లో ఊ అంటావా.. ఊఊ అంటావా మావా.. వరుణ్ ధావన్‌తో సమంత!!

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సమంత అటు సినిమాలతోనే కాకుండా, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్, డీకే దర్శకత్వంలో సిటాడెల్ లో సమంత నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సమంత సిటాడెల్ కోసం విదేశాలలో ఉన్నారు. ప్రస్తుతం సెర్బియాలో హంగామా చేస్తున్నారు. మొన్నటికి మొన్న సెర్బియాలో రాష్ట్రపతిని కలిసిన సిటాడెల్ టీం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేశారు.…

National

బీజేపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం కొడుకు, రాజీనామాలు చేస్తామని !

ముంబాయి/న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన కూటమికి ముప్పు తప్పదని కొందరు రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కూడా తమ ప్రవర్తన మార్చుకోకుంటే మహారాష్ట్ర ప్రభుత్వంలో మేము రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ప్రియురాలిని 20 ముక్కలుగా నరికేశాడు, నాకు కూతురు లాంటిదని డ్రామాలు, హెచ్ఐవీ ! స్వార్థ రాజకీయాల కోసం…

National

వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధికి గుండెపోటు- హెల్త్ అప్ డేట్ ఇదే.

కృష్ణాజిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి ఇవాళ గుండెపోటుకు గురయ్యారు. ఉదయం ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబసభ్యులు స్ధానిక ఆస్పత్రికి తరలించారు. వెంటనే అత్యవసర చికిత్స అందించిన డాక్టర్లు ఆయన ప్రాణం కాపాడారు. అనంతరం యాంజియోగ్రామ్ టెస్ట్ నిర్వహించి స్టెంట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. స్టెంట్ వేసిన తర్వాత పార్ధసారధి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఊరట పొందారు. అంతకుముందు స్ధానికంగా…

NationalTELANGANA

కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. కేసీఆర్ పేరును ఆమె తన చేతికి పచ్చబొట్టుగా వేయించుకున్నారు. గిరిజన యోధుడు కొమురంభీమ్ సహచరుని వారసులు ఆ పచ్చబొట్టు వేయడం విశేషం. జూన్ 2 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని బంజారాభవన్‌లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి…

National

కేశినేని 100శాతం పార్టీ మార్పు?

విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని టీడీపీని(Vijayawada TDP) డ్యామేజ్ చేస్తున్నారు. టీడీపీ ఇంచార్జిలను గొట్టంగాళ్లంటూ రెచ్చిపోయారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపై దురుసుగా మాట్లాడారు. మహానాడుకు ఆహ్వానం ఇవ్వలేదని, ఆ గొట్టంగాళ్లు పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంత? అంటూ విరుచుకుపడ్డారు. ఇలా తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ అధిష్టానంను సైతం ఇరకాటంలో పెడుతోన్న విజయవాడ ఎంపీ వాలకం అధిష్టానంకు తలనొప్పిగా మారింది.…

National

హత్య కేసులో అవినాష్ నిందితుడు, A 8గా నమోదు

మాజీ మంత్రి వివేకా హత్య(Viveka Murder) కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ తేల్చింది. ఇప్పటి వరకు ఆయన నిందితుడా? అనుమానితుడా? అంటూ కోర్టు ప్రశ్నించిన విషయం విదితమే. అయితే, తాజాగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కు కౌంటర్ వేసిన సీబీఐ అవినాష్ రెడ్డిని నిందితుడిగా(A8) చేర్చింది. హత్య జరిగిన తరువాత సాక్ష్యాలను తారుమారుచేసే ప్రయత్నం అవినాష్ రెడ్డి చేశారని అఫిడవిట్ లో పేర్కొంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో శుక్రవారం దీనిపై విచారణ…

National

హైదరాబాద్‌లో శర్వానంద్ రిసెప్షన్.. KCRని స్వయంగా ఆహ్వానించిన శర్వా..

టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) ఇటీవల జూన్ 3న వివాహం చేసుకున్నాడు. జైపూర్(Jaipur) లీలా ప్యాలెస్ లో రక్షిత(Rakshita) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని ఘనంగా వివాహం చేసుకున్నాడు. రక్షిత టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు. శర్వా వివాహానికి రామ్ చరణ్, సిద్దార్థ్, అదితి రావు హైదరి.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే వివాహం జైపూర్ లో పెట్టడంతో కేవలం అతి సన్నిహితులను మాత్రమే…

National

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు..

ఎండాకాలం(Summer( అయిపోవచ్చింది. సమ్మర్ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సంవత్సరం ఎండలు మరింత ఎక్కువ ఉండటంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండల నుంచి ఉపశమనం కోసం, తొలకరి చినుకుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలకు వాతావరణ శాఖ(Meteorological Department) చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) మరి కొన్ని రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లోకి రానున్నాయి. నైరుతి రుతుపవనాలు నేడు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా , తమిళనాడు,…

National

గుడ్లు,పాలు కలిపి తీసుకుంటే లాభాలతో పాటు నష్టాలు కూడా?

సాధారణంగా చాలామంది గుడ్లు పాలు కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకుంటే చాలా మంచిదని శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది పచ్చి గుడ్డు పాలు తీసుకుంటే మరికొందరు ఉడకబెట్టిన గుడ్డు పాలు తీసుకుంటూ ఉంటారు. గుడ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అలాగే పాల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరోవైపు, పచ్చి గుడ్లు, పచ్చి పాలు ఈ రెండు అధిక…

APNationalTELANGANA

వృద్ధురాలిని మోసం చేసిన నకిలీ డాక్టర్.. మత్తుమందు ఇచ్చి ఆపై అలా?

సమాజంలో రోజురోజుకీ నకిలీ డాక్టర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకమైన ప్రజల జీవితాలతో ఆటాడుతున్నారు. కొందరు డాక్టర్లు అనే పేరు చెప్పుకుంటూ నకిలీ డాక్టర్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే గతంలో చాలామంది నకిలీ డాక్టర్లు బాగోతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా కూడా వ్యక్తి డాక్టర్ ని అని నమ్మించి వృద్ధురాలిని…