National

National

రాహుల్ గాంధీ కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి

పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై విచారణ నుంచి గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బుధవారం తప్పుకున్నారు. రాహుల్ గాంధీ తరపు న్యాయవాది పిఎస్ చంపనేరి ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి గీతా గోపికి విజ్ఞప్తి చేశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) వాదానలు వినిపిస్తూ ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్నారు.…

NationalPOLITICSTELANGANA

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు బిగిస్తున్నారు. మహారాష్ట్రలో బలంగా పాగా వేయడానికి గట్టిగానే ఫోకస్ చేశారు. ఇప్పటికి మూడు దఫాలుగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన కేసీఆర్, అక్కడ వివిధ పార్టీల నాయకులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.   ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ కు చెందిన నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ రోజు…

National

దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం

దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న విద్యాసంస్థలతో పాటు ఇవి పనిచేస్తాయిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ. 1570 కోట్ల వ్యయంతో ఆమోదం లభించిందన్నారు. ఈ నర్సింగ్ కాలేజీల ఏర్పాటు వచ్చే 24 నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన నర్సింగ్‌ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నైపుణ్యంతో కూడిన నర్సింగ్ సిబ్బంది సంఖ్యను పెంచాలని…

National

కేంద్ర మంత్రి ఫైర్, ట్రబుల్ షూటర్ మీద చర్యలు తీసుకోండి, ఎన్నికల్లో !

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ సామాన్య ప్రజలనే కాకుండా మీడియాను కూడా బెదిరిస్తున్నారని. ఆయన దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. ర్యాపిడో బైక్ లో జాగ్రత్త, బైక్ మీద నుంచి దూకేసిన యువతి, ఎక్కడంటే అక్కడ చేతులు ? బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శోభా…

National

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని తన అధికారిక బంగళాను శనివారం ఖాళీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని తన అధికారిక బంగళాను శనివారం ఖాళీ చేశారు. లోక్ సభ సభ్యత్వానికి అనర్హత (disqualification)వేటు పడిన కారణంగా ప్రభుత్వం ఆయనను అధికారిక బంగళాను ఖాళీ చేయమన్న విషయం తెలిసిందే. దాంతో, శనివారం ఆయన తుగ్లక్ రోడ్ లోని 12 నెంబర్ బంగళాను ఖాళీ చేశారు. Rahul Gandhi disqualification row: ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు ప్రధాని మోదీ (PM Modi) ఇంటిపేరైన ‘మోదీ’పై అనుచిత వ్యాఖ్యలు…

NationalWorld

సెప్టెంబర్ లో జో బైడెన్ భారత పర్యటన

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ సంవత్సరం సెప్టెంబర్ లో భారత్ కు రానున్నారు. భారత్ లో సెప్టెంబర్ నెలలో జరిగే జీ 20 (G20) దేశాధినేతల సమావేశంలో ఆయన పాల్గొంటారు. జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ సమర్దవంతంగా నిర్వహిస్తోందని అమెరికా ప్రశంసించింది. Joe Biden to visit India: జీ 20 సదస్సు భారత్ జీ 20 అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. అందులో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో భారత్ లో…

National

36 గంటలు.. 8 నగరాలు.. 5300 కిమీలు- ప్రధాని సుడిగాలి పర్యటన

సోమవారం ఉదయం నుంచి 36 గంటల వ్యవధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 5300 కిలోమీటర్లు ప్రయాణించి, 7 నగరాల్లో ఎనిమిది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.   సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి 36 గంటల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సెంట్రల్ ఇండియాలోని మధ్య ప్రదేశ్, దక్షిణాదిన ఉన్న కేరళ, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డయ్యూ, డామన్ లలో పర్యటిస్తారు. తిరిగి మంగళవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు.…

National

అమృత్​ పాల్​ భార్య కిరణ్​దీప్​ కౌర్​ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్ద టర్నింగ్​ పాయింట్​

ఖలిస్థానీ మద్దతుదారుడు, మత ప్రబోధకుడు అమృత్​ పాల్ సింగ్​​.. పంజాబ్​ పోలీసుల ఎదుటు లొంగిపోయిన వ్యవహారం ఇప్పుడు వార్తలకెక్కింది. పంజాబ్​ మోగాలోని ఓ గురుద్వారాలో ఆదివారం ఉదయం జరిగిన ప్రార్థనల అనంతరం అమృత్​ పాల్​ లొంగిపోయాడు. తాను అక్కడ ఉన్న విషయాన్ని పోలీసులకు ఈ వారిస్​ పంజాబ్​ దే చీఫ్​.. శనివారం రాత్రి చెప్పినట్టు తెలుస్తోంది. ఫలితంగా అమృత్​ పాల్​ను పట్టుకునేందుకు పంజాబ్​ పోలీసులు చేపట్టిన దాదాపు 40 రోజుల ఆపరేషన్​కు ముగింపు పడింది! ఇన్ని రోజులుగా…

National

152 ఖాళీల భర్తీకి ఎన్‍టీపీసీ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ

152 ఖాళీల భర్తీకి ఎన్‍టీపీసీ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. మైనింగ్ ఓవర్‌మన్, ఓవర్‌మన్ (మ్యాగజీన్), మెకానికల్ సూపర్‌వైజర్ సహా మరిన్ని పోస్టులకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎన్‍టీపీసీ అధికారిక వెబ్‍సైట్ careers.ntpc.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు మే 5వ తేదీ తుదిగడువుగా ఉంది. వివరాలివే. NTPC Recruitment 2023: పోస్టులు ఇవే మైనింగ్ ఓవర్‌మన్: 84 ఖాళీలు ఓవర్‌మన్ (మ్యాగజీన్): 7 పోస్టులు మెకానికల్ సూపర్‌వైజర్: 22 పోస్టులు…

National

మరోసారి రసవత్తరంగా మహారాష్ట్ర రాజకీయాలు

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 రోజుల్లోగా కుప్పకూలుతుందని శివసేన (యూబీటీ – ఉద్ధవ్ వర్గం) కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. షిండే సర్కార్‌కు మరణ శాసనం రానుందని జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సంజయ్ అత్యంత సన్నిహితుడు. కొన్ని పిటిషిన్లపై సుప్రీం కోర్టు నుంచి తీర్పు రావాల్సి ఉండగా.. సంజయ్…