శింగనమలలో రైతన్నతో లోకేష్ ముఖాముఖీ. ఇంతలోనే ఎంత పరిణతి!
టిడిపి యువనేత నారా లోకేష్ నేడు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో 64వ రోజు పాదయాత్ర ముగింపుగా ‘రైతన్నతో ముఖాముఖీ’ పేరుతో రైతులతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికల తర్వాత మన టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయం కోసం, రైతుల కోసం ఏమేమి చేయాలో మీ అందరినీ అడిగి తెలుసుకొనేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో పాల్గొన్న రైతులందరూ మీ సమస్యలు, అవసరాల గురించి నాకు చెప్పండి.…

