రాహుల్ గాంధీ కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై విచారణ నుంచి గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బుధవారం తప్పుకున్నారు. రాహుల్ గాంధీ తరపు న్యాయవాది పిఎస్ చంపనేరి ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి గీతా గోపికి విజ్ఞప్తి చేశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) వాదానలు వినిపిస్తూ ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్నారు.…

