National

National

బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్ – మే నెలలో 12 రోజుల సెలవు

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెల ముగిసింది. మే ఒకటో తేదీ సోమవారం నుంచి మొదలైంది. ఈ నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ విషయంలో బ్యాంకు ఖాతాదారులు అలెర్ట్‌గా ఉండాలి. బ్యాంకు పనులకు వెళ్లేపని అయితే, ఈ సెలవులు చూసుకుని బ్యాంకులకు వెళ్లాలని అధికారులు సలహా ఇస్తున్నారు. ఆర్బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం 12 రోజుల సెలవుల్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులు పనిచేయవు.…

National

కేరళ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ వివాదం

కేరళ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ వివాదం సాగుతోంది. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ చిత్రంపై స్పందించారు. ఆ చిత్ర పోస్టర్‌ను షేర్ చేసిన ఆయన.. ‘ఇది మీ కేరళ కథ కావొచ్చు. మా కేరళ కథ మాత్రం కాదు’ అంటూ చిత్ర నిర్మాతలను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. కేరళలో కొన్నేళ్లుగా ’32 వేల మంది’ మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి…

National

కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు గంగారపు కిషన్ రెడ్డి ఆదివారం స్వల్ప అస్వస్థత

కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు గంగారపు కిషన్ రెడ్డి ఆదివారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో నొప్పిగాను, అస్వస్థతగా ఉండటంతో ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఛాతి భాగంలో నొప్పిగా అనిపించడంతో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో మంత్రి కిషన్ రెడ్డిని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఈ క్రమంలో ఆయనకు కార్డియోన్యూరో సెంటర్‌ల పలు రకాలైన…

National

పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ

పార్వతీపురం మన్యం జిల్లా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ముగింపు సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని, నాయకులను దుయ్యబడుతూ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పేదలకు, బడుగు, బలహీన వర్గాలకి,రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుంటే తెలుగుదేశం నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చంద్రబాబునాయుడు అంటూ మండిపడ్డారు.

National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకం

: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా డైరెక్షన్‌లో ప్రచార పర్వంలో ఆ పార్టీ దూసుకుపోతోంది. పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చోట స్పెషల్ ఫోకస్ చేస్తూ.. ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టకునేలా వ్యూహ రచన చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ నుంచి వెళ్లిపోయి ఇతర పార్టీల్లో చేరి పోటీ చేస్తున్న నేతలపై కూడా అధిష్టానం దృష్టి పెట్టింది. ఎలాగైనా వారిన ఓడించాలనే పట్టుదలతో ఉంది. టికెట్లు దక్కలేదని.. పార్టీలో గౌరవం లేదని…

National

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త.. కొత్త పే కమిషన్ అమలుపై కీలక నిర్ణయం..?

ప్రస్తుతం ఓల్డ్ పెన్షన్ విధానం అమలు కోసం పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతూ ప్రకటన చేయగా.. త్వరలో మరో భారీ ప్రకటన ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘాన్ని అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 8వ వేతన సంఘానికి ఈ ఏడాదే గ్రీన్ సిగ్నల్…

National

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఏప్రిల్ 06న ప్రారంభమైన చివరి విడత మెయిన్ పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి. జనవరిలో జరిగిన మెుదట విడత మెయిన్‌, తాజా పరీక్షల్లో సాధించిన బెస్ట్ స్కోర్‌ను (రెండు సార్లు రాసి ఉంటే) పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ర్యాంకులు ఇవ్వనుంది. కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తంహా 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. జూన్ 04వ తేదీన ఈ…

APNational

మందుతాగి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు!

ఢిల్లీ క్యాపిటల్స్ టీం లో మితిమీరి తాగిన ఒక ఆటగాడు ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడట, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది Delhi Capitals player : ఈ IPL సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానం లో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్.గత సీజన్ లో రిషబ్ పంత్ సారథ్యం లో ఈ టీం టేబుల్ టాపర్ గా కూడా నిల్చింది, అలాంటి టీం…

NationalTELANGANA

సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి.. ఛీఫ్ జస్టిస్‍ను అభ్యర్థించిన స్మితా సబర్వాల్..

బీహార్‌లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ప్రమేయం ఉన్న దోషుల విడుదలపై జోక్యం చేసుకోవాలని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) సీనియర్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabharwal) సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు. కృష్ణయ్య కుటుంబానికి స్మిత బుధవారం సంఘీభావం తెలిపారు. గోపాల్‌గంజ్ మాజీ జిల్లా మేజిస్ట్రేట్ జి. కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో దోషులను విడుదల చేయాలనే బీహార్ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సెంట్రల్ ఐఎఎస్…

National

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మావోలు మందుపాతర పేల్చడంతో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ మందుపాతర పేల్చేందుకు మావోలు 50 కిలోల ఐఈడీ(IED)ని వినియోగించారు. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున గోతి ఏర్పడింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌కు చెందిన పోలీసులు ఓ అద్దె వ్యానులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి కనీసం 20 అడుగుల ఎత్తుకు…