ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం..పోలవరం పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి..
రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ బయల్దేరారు.…

