National

APHealthNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న H3N2 వైరస్‌…

దేశంలో వేగంగా వ్యాపిస్తోంది హెచ్‌3ఎన్‌2 వైరస్‌.. ఈ మాయదారి రోగం తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మొన్నటి వరకూ కరోనా..ఇప్పుడు H3N2 వైరస్‌.. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఇప్పుడు కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. హాంగ్‌కాంగ్‌ఫ్లూ H3N2 వైరస్.. ఈ పేరు చెప్తే ఇప్పుడు గుండెల్లో గుబులు రేపుతోంది. H3N2 వైరస్‌ కారణంగా సోకే ఇన్‌ఫ్లూయెంజానే హాంగ్‌కాంగ్ ఫ్లూ అంటున్నారు డాక్టర్లు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో…

NationalSPORTS

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్టులో టాస్‌ వేయనున్న ప్రధాని మోదీ…

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 చివరి దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది.. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలుపుకోసం ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ఇవాళ జరుగనున్న ఈ మ్యాచ్‌ చాలా ప్రత్యేకంగా నిలువనుంది. ఎందుకంటే..ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని మోదీతో పాటు..ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ హాజరుకానున్నారు. వీరిద్దరూ కలిసి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌ టాస్‌ ప్రధాని మోదీ వేయనున్నారు.…

NationalTELANGANA

హైదరాబాద్ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు..

హైదరాబాద్ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు ప్రారంభమైంది. నగరంలోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో జరుగుతున్న సదస్సుకు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలో తొలి సమావేశం జనవరిలో కోల్‌కతాలో జరుగగా, రెండో సమావేశానికి హైదరాబాద్‌ వేదికగా నిలిచింది. ఇప్పటివరకు 25 నగరాల్లో 36 సదస్సుల నిర్వహించగా ఈ ఏడాది జీ-20 సదస్సుకు ఇండియా నేతృత్వం వహిస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాల్లో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు, దేశాల అనుభవాలు, ఉత్తమ విజయగాధల అంశంపై ఈ సదస్సు…

NationalTELANGANA

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక మలుపు..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన హైదరాబాద్‌ వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. పిళ్లైకి సంబంధించిన ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు ఉన్నాయి. రామచంద్ర పిళ్లై సౌత్‌గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత బినామీగా ఉన్నారని , ఆమె ప్రయోజనాల కోసం రామచంద్రి పిళ్లై పనిచేశారని రిమాండ్‌ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. రామచంద్ర పిళ్లైకి సంబంధించి 17 పేజీలతో రిమాండ్‌ రిపోర్ట్‌ను తయారు చేసింది ఈడీ.. తాను కవిత బినామీ అని విచారణలో…

APHealthNationalTELANGANA

భయపెడుతున్న ర్యాట్ ఫీవర్…

కేరళలో మరో కొత్త ఫీవర్‌ బెంబేలెత్తిస్తోంది. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అతిరపల్లిలోని సిల్వర్‌ స్టార్మ్‌ వాటర్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించిన విద్యార్థులకు ర్యాట్‌ఫీవర్‌ సోకడంతో వాటర్‌ థీమ్‌ పార్క్‌ను మూసివేయాలని సూచించారు అధికారులు. వాటర్ థీమ్ పార్కును మూసివేయాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అతిరప్పిలి…

NationalTechnology

యూఐడీఏఐ.. అందుబాటులోకి కొత్త సర్వీసులు!

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో తప్పనిసరి అయింది ఇలా ఒక వ్యక్తి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఎంతో కీలకమైనది ప్రస్తుతం మన వ్యక్తిగత డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ అనుసంధానం కావడంతో ఆధార్ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీస్లను అందుబాటులోకి తీసుకువస్తుంది యూఐడీఏఐ.ఈ క్రమంలోనే తాజాగా ఆధార్ కార్డుదారుల కోసం మరొక కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది తద్వారా ఆధార్ సేవలు ఇకపై మరింత…

National

ఢాకా వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం

ఢాకా వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(124 బంతుల్లో 132, 18 ఫోర్లు, ఒక సిక్సర్‌) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ బట్లర్‌ 76 పరుగులతో రాణించాడు. చివర్లో మొయిన్‌ అలీ 42 నాటౌట్‌, సామ్‌ కరన్‌(19 బంతుల్లో 33 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌…

NationalWorld

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌..

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌ కోరింది. ఆర్థిక నేరస్తులను అప్పగించడమే కాదు, వారి నుండి దేశ విదేశాల్లో ఆస్తుల రికవరీ కూడా జరిగేలా చూడాల్సి వుందని కోరింది. దేశ రాజధాని శివార్లలోని గుర్‌గావ్‌లో అవినీతి నిరోధక వర్కింగ్‌ గ్రూపు మొదటి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఇటలీ ప్రతినిధితో కలిసి కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర…

National

ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్‌ ఎస్టేట్‌ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..

దేశంలోని మూడు మెట్రోపాలిటన్ నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో రియల్‌ ఎస్టేట్‌ ధరలు చుక్కలనంటాయి. వాటి ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 2022లో ధరల పెరుగుదలను నమోదు చేసింది. ఈ మూడు నగరాలు నైట్ ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్‌ఐ 100)లో ఉన్నత స్థానాలకు చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్లు (రూ.8,24,43,400)కు ఏయే నగరాల్లో ఎంత స్థలం కొనుగోలు చేయొచ్చో నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ గణాంకాలను విడుదల చేసింది. (ఇదీ : టయోటా కార్లపై…

National

ఐబొమ్మ వాడుతున్న వారికి షాక్.. మీరు వాడుతుంటే చెక్

ప్రస్తుతం సినిమా ధియేటర్ లతోపాటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా విరివిగా పెరిగిపోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 లాంటి నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉండగా ఆహా వంటి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ప్రేక్షకులను అల్లరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యాప్స్ లో వచ్చే కంటెంట్ ని ఐ-బొమ్మ అనే ఒక వెబ్సైట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కొంత మంది…