National

National

కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది ఐఎస్ ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు..

కాన్పూర్ ఉగ్రవాద కుట్ర కేసులో 8 మంది అనుమానిత ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. లక్నోలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ 8 మంది ఉగ్రవాద కుట్రలో పాలుపంచుకున్నారని కోర్టు వీరిని దోషులుగా నిర్దారించింది. ఉగ్రవాద అణిచివేతలో ఇది పెద్ద విజయం అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. అయితే త్వరలోనే వీరందరికి కోర్టు శిక్ష విధిస్తుందని ఎన్ఐఏ తెలిపింది. 2017లో కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది దోషులు…

National

27న రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు

న్యూఢిల్లీ : పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో ఈ నెల 27న సొమ్ము జమకానుంది. ఫిబ్రవరి 27న కర్ణాటకలోని బెలగావిలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన 13వ కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేస్తారు. అర్హులైన రైతుల ఖాతాలో ఆయన డబ్బులను జమ చేస్తారు. ఈ విడత ద్వారా 9 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.18…

NationalTechnology

50 రోజుల్లో ఎల్‌ఐసికి రూ.50 వేల కోట్లు నష్టం

న్యూఢిల్లీ : ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాక్‌మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. భారత్ మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ ఎల్‌ఐసి, అయితే గత కొంత కాలంగా ఈ కంపెనీ మార్కెట్ నుండి భారీ లాభాలను ఆర్జించింది. కానీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు నష్టపోతూనే ఉన్నాయి ఈ కారణంగా అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఎల్‌ఐసి కూడా ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంది.…

National

మ్యాగ్‌ వరల్డ్‌ ఎక్స్‌పో 2023 వద్ద కెడీఎం కార్నివాల్‌..

ముంబై: ముంబై కేంద్రంగా కలిగిన సుప్రసిద్ధ లైఫ్‌స్టైల్‌, ప్రీమియం మొబైల్‌ యాక్ససరీస్‌ బ్రాండ్‌ కెడీఎం, ఇటీవల జరిగిన రెండవ ఎడిషన్‌ మ్యాగ్‌ వరల్డ్‌ ఎక్స్‌పో 2023 వద్ద కెడీఎం కార్నివాల్‌ నిర్వహించింది. కెడీఎం ప్రీమియం మొబైల్‌ యాక్ససరీలను విస్తృత శ్రేణిలో వినియోగదారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో కార్నివాల్‌ను తీర్చిదిద్దారు. బ్రాండ్‌ సిద్ధాంతమైన ‘కరో దిల్‌ కీ మర్జీ ‘, ప్రతి భారతీయుడినీ చేరుకుంటుంది. కెడీఎం తమ వినియోగదారులను మనసు చెప్పినట్లు నడుచుకోమని ప్రోత్సహిస్తుంది. కెడీఎం ఫౌండర్‌ ఎన్‌…

National

తుక్కుగూడ ఓఆర్‌ఆర్ వరకు మెట్రో విస్తరణ

తుక్కుగూడ ఓఆర్‌ఆర్ వరకు మెట్రో విస్తరణ ! త్వరలో అధ్యయనం చేయనున్న మెట్రో అధికారులు ఐటి రంగం విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్: రాయదుర్గం నుంచి మొదలై శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు (31 కిలోమీటర్ల) మేర విస్తరించనున్న మెట్రో నిర్మాణంలో కొన్ని మార్పులు, చేర్పులు జరుగనున్నట్టుగా తెలిసింది. నాగోల్- టు రాయదుర్గం కారిడార్ 3కు కొనసాగింపుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ప్రభుత్వం సొంత నిధులతోనే…

National

ఉత్తరప్రదేశ్‌లో విధానసభ వద్ద జర్నలిస్టులు, కెమెరామెన్లపై మార్షల్స్‌ దాడి

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో విధానసభ వద్ద జర్నలిస్టులు, కెమెరామెన్లపై మార్షల్స్‌ దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన శివపాల్‌ యాదవ్‌, తన పార్టీకి చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న చౌదరి చరణ్‌ సింగ్‌ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆ ఆందోళనను కవర్‌ చేయకుండా మార్షల్స్‌ అడ్డుకునాురు. జరులిస్టులు, కెమెరామెన్లపై దాడికి దిగారు. మార్షల్స్‌ విధి నిర్వహణ అసెంబ్లీకే పరిమితం. వారు అసెంబ్లీలో మాత్రమే విధులు నిర్వహించాలి. ఇలాంటి ప్రాంతాలు…

National

కర్ణాటకలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్.. వ్యక్తిగత ఫొటో షేర్ చేస్తూ తీవ్ర ఆరోపణలు

కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణుల మధ్య పోరు చర్చనీయాశంగా మారింది. చివరికి ఆ రాష్ట్ర హోంమంత్రి జోక్యం చేసుకునే వరకు చేరింది. ఇద్దరు ఉన్నతాధికారిణులపై చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు. ఇంతకు ఏం జరిగింది..? ప్రభుత్వ ఆగ్రహానికి కారణం ఏమిటి..? ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. ఐపీఎస్ అధికారిణి డి.రూప మౌద్గిల్ కర్ణాటక హస్తకళల అభివృద్ధి సంస్థలో ఐజీపీ ఎండీగా పనిచేస్తున్నారు. రోహిణి…

APCINEMANationalTELANGANA

ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం. శతజయంతికి వంద నాణెం

అటు సినిమాలలో, ఇటు రాజకీయాలలో కూడా చెరగని ముద్రవేసిన నటసార్వభౌముడు, సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం లభించనుంది. జూన్ 10వ తేదీన ఆయన శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్‌ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేయబోతోందని ఆయన కుమార్తె, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. రిజర్వ్ బ్యాంకులోని కరెన్సీ, నాణేలని ముద్రించే మింట్ విభాగం అధికారులు ఇటీవల ఆమెని కలిసి నమూనా నాణెం…

National

ఇండియాలో అత్యంత కలుషిత నగరం

గత రెండు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ముంబై (Mumbai ) వాసులు మెరుగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ IQAir (రియల్ టైమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటర్) ప్రకారం.. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరంగా ముంబై జనవరి 29- ఫిబ్రవరి 8 మధ్య జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. వారం రోజుల్లోనే ముంబై రెండో స్థానంలో నిలిచింది. జనవరి 29న IQAir ర్యాంకింగ్‌లో ముంబై 10వ స్థానంలో నిలిచింది. తర్వాత ఫిబ్రవరి…

National

11వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి: పి. సంఘం

  పార్వతీపురం : 11 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి, సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా, సీతానగరం మండలకేంద్రంలో ప్రధాన రహదారి గుండా వెళ్తూ ప్రచారకార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 15-20 తేదీలలో పాట్నా- బీహార్ లో జరిగబోయే ఈ జాతీయ మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం…