మణిపూర్ లో ఆగని హింస.. బీజేపీ ఎమ్మెల్యేపై దాడి, పరిస్థితి విషమం
మణిపూర్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఆ రాష్ట్రం భగ్గున మండిపోతోంది. గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయానికే మద్దతు తెలపడంతో మణిపూర్ లోని ఆదివాసులు తిరగబడ్డారు. బ్రాహ్మణులైన మైతీలను ఎస్టీల్లో చేర్చితే సహించేది లేదంటూ అనేక జిల్లాల్లో ఆందోళనలు ప్రారంభించారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు రేగాయి. ఆదివాసులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టారు. గురువారం నాటికి ఇంఫాల్, చురా చంద్పూర్, కంగ్పోక్కి ప్రాంతాల్లో…

