National

NationalTELANGANA

తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు..

తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇంకా ఈ పార్కుల ద్వారా టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని,…

APNational

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చ….

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. సీఎం జగన్‌కు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. మేరకు విజ్ఞాపన పత్రం అందించారు సీఎం జగన్.

NationalTELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కాని ఎమ్మెల్సీ కవిత..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరుకాలేదు ఎమ్మెల్సీ కవిత. ఈడీ కార్యాలయానికి న్యాయవాదులను పంపించారు కవిత. తన తరఫున న్యాయవాది సోమభరత్‌ను పంపారు. ఈడీ కోరిన సమాచారాన్ని న్యాయవాదితో పంపారు. అనారోగ్యం కారణంగా చూపుతూ.. మరో తేదీన తాను విచారణకు హాజరువతానని చెప్పినట్లు తెలుస్తోంది.

NationalTELANGANA

ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించని కొత్త ట్విస్ట్..

2015లో ఈడీ స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు నితీష్‌ రాణా. అప్పటి నుంచి ఎన్నో కేసుల్లో ఈడీ తరపున వాదనలు వినిపించారు. నిన్నటివరకు నిందితులకు సూటి ప్రశ్నలు వేసిన ఈడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఐతే తాను వ్యక్తిగత కారణాలతోనే ఈడీ స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌గా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు రాణా. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి కీలక విచారణలు జరుగుతున్న ఈ సమయంలో..నితీష్‌ రాణా ఈడీ పబ్లిక్‌…

APHealthNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న H3N2 వైరస్‌…

దేశంలో వేగంగా వ్యాపిస్తోంది హెచ్‌3ఎన్‌2 వైరస్‌.. ఈ మాయదారి రోగం తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మొన్నటి వరకూ కరోనా..ఇప్పుడు H3N2 వైరస్‌.. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఇప్పుడు కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. హాంగ్‌కాంగ్‌ఫ్లూ H3N2 వైరస్.. ఈ పేరు చెప్తే ఇప్పుడు గుండెల్లో గుబులు రేపుతోంది. H3N2 వైరస్‌ కారణంగా సోకే ఇన్‌ఫ్లూయెంజానే హాంగ్‌కాంగ్ ఫ్లూ అంటున్నారు డాక్టర్లు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో…

NationalSPORTS

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్టులో టాస్‌ వేయనున్న ప్రధాని మోదీ…

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 చివరి దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది.. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలుపుకోసం ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ఇవాళ జరుగనున్న ఈ మ్యాచ్‌ చాలా ప్రత్యేకంగా నిలువనుంది. ఎందుకంటే..ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని మోదీతో పాటు..ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ హాజరుకానున్నారు. వీరిద్దరూ కలిసి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌ టాస్‌ ప్రధాని మోదీ వేయనున్నారు.…

NationalTELANGANA

హైదరాబాద్ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు..

హైదరాబాద్ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు ప్రారంభమైంది. నగరంలోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో జరుగుతున్న సదస్సుకు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలో తొలి సమావేశం జనవరిలో కోల్‌కతాలో జరుగగా, రెండో సమావేశానికి హైదరాబాద్‌ వేదికగా నిలిచింది. ఇప్పటివరకు 25 నగరాల్లో 36 సదస్సుల నిర్వహించగా ఈ ఏడాది జీ-20 సదస్సుకు ఇండియా నేతృత్వం వహిస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాల్లో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు, దేశాల అనుభవాలు, ఉత్తమ విజయగాధల అంశంపై ఈ సదస్సు…

NationalTELANGANA

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక మలుపు..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన హైదరాబాద్‌ వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. పిళ్లైకి సంబంధించిన ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు ఉన్నాయి. రామచంద్ర పిళ్లై సౌత్‌గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత బినామీగా ఉన్నారని , ఆమె ప్రయోజనాల కోసం రామచంద్రి పిళ్లై పనిచేశారని రిమాండ్‌ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. రామచంద్ర పిళ్లైకి సంబంధించి 17 పేజీలతో రిమాండ్‌ రిపోర్ట్‌ను తయారు చేసింది ఈడీ.. తాను కవిత బినామీ అని విచారణలో…

APHealthNationalTELANGANA

భయపెడుతున్న ర్యాట్ ఫీవర్…

కేరళలో మరో కొత్త ఫీవర్‌ బెంబేలెత్తిస్తోంది. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అతిరపల్లిలోని సిల్వర్‌ స్టార్మ్‌ వాటర్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించిన విద్యార్థులకు ర్యాట్‌ఫీవర్‌ సోకడంతో వాటర్‌ థీమ్‌ పార్క్‌ను మూసివేయాలని సూచించారు అధికారులు. వాటర్ థీమ్ పార్కును మూసివేయాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అతిరప్పిలి…

NationalTechnology

యూఐడీఏఐ.. అందుబాటులోకి కొత్త సర్వీసులు!

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో తప్పనిసరి అయింది ఇలా ఒక వ్యక్తి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఎంతో కీలకమైనది ప్రస్తుతం మన వ్యక్తిగత డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ అనుసంధానం కావడంతో ఆధార్ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీస్లను అందుబాటులోకి తీసుకువస్తుంది యూఐడీఏఐ.ఈ క్రమంలోనే తాజాగా ఆధార్ కార్డుదారుల కోసం మరొక కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది తద్వారా ఆధార్ సేవలు ఇకపై మరింత…